Hyderabad Viral News: ఎంతకు తెగించావ్రా..  రోడ్డు మీద వెళ్తున్న యువతికి ముద్దు పెట్టి..

రోడ్డు మీద వెళ్తున్న ఒంటరిగా వెళ్తున్న ఓ యువతికి ముద్దు పెట్టి పరారయ్యాడు ఓ దుండగుడు. ఈ ఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో  వెంటనే 100కు డయల్‌ చేసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

New Update
misbehave

Hyderabad Viral News: రోడ్డు మీద వెళ్తున్న ఒంటరిగా వెళ్తున్న ఓ యువతికి ముద్దు పెట్టి పరారయ్యాడు ఓ దుండగుడు. ఈ ఘటన కాకతీయ యూనివర్సిటీ(Kakatiya University) పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ని రెడ్డికాలనీ ప్రాంతంలో  చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రెడ్డికాలనీ ప్రాంతానికి చెందిన ఓ యువతి గత రాత్రి 9 గంటల సమయంలో రోడ్డుపై ఉన్న టైలర్‌ షాపుకు బయలుదేరింది. అయితే అదే ప్రాంతంలో నివాసం ఉండే ఓ  వివాహితుడు  ఈ విషయాన్ని గమనించాడు. 

Also Read :  వల్లభనేని వంశీ అరెస్ట్‌..ఏపీ హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు!

యువతి ఒంటరిగా ఉండటం..  ఆ ప్రదేశమంతా చీకటిగా ఉండటంతో ఇదే అదునుగా భావించి ఆమెను ఫాలో అయి  దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకున్నాడు. అయితే ఆ యువతి కేకలు వేయడంతో వెంటనే  అక్కడి నుంచి పరారయ్యాడు. జరిగిన విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో  వెంటనే 100కు డయల్‌ చేసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Also Read :  RCB vs GG :  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో ఆర్సీబీ శుభారంభం

విషయం తెలుసుకున్న స్థానికులు, యువతి బంధువులు నిందితుడు కిరాయికి ఉన్న ఇంటికి వెళ్లి దాడి చేసేందుకు ప్రయత్నించారు. సదరు ఇంటి యజమాని కూడా 100 కు డయల్‌ చేసి నిందితుడి మీద ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న కేయూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇలాంటి కామాంధులను వదలకూడదని..  కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. 

Also Read: Horoscope Today:ఈ రోజు ఈ రాశివారు  ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్‌!

ఇద్దరు షాపు ఓనర్లు అరెస్ట్..

కుళ్లిన చికెన్ అమ్మిన ఇద్దరు షాపు ఓనర్లను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ సుధీంద్ర తెలిపారు. రసూల్ పురలోని అన్నానగర్, అర్జున్ నగర్ లోని రెండు చికెన్షాపుల్లో గురువారం 600 కిలోల కుళ్లిన చికెన్ నన్ను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇద్దరు షాపు ఓనర్లు ఎం.భాస్కర్, బొట్టా రవీందరు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ చికెన్ వేస్టేజ్, బోన్స్ కొన్ని నెలల వరకు నిల్వ ఉంచి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లకు తక్కువధర అమ్ముతున్నట్లు తెలిపారు.

Also Read :  ఆర్డీవో సంతకాన్ని ఫోర్జరీ చేసి తప్పుడు డాక్యుమెంట్లు.. ఇట్ల దొరికిపోయిండు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Viral video: రన్నింగ్ ట్రైన్‌ కిటికీలో ఇరుక్కున్న దొంగ.. కిలోమీటర్ ఈడ్చుకెళ్లిన ప్యాసింజర్

రన్నింగ్ ట్రైన్‌లో ప్యాసింజర్ ఫోన్ కొట్టేయాలనుకున్న దొంగని కి.మీ ఈడ్చుకెళ్లారు. ఇది బీహార్ భాగల్పూర్ రైల్వే స్టేషన్ దగ్గర జరగ్గా.. సోషల్ మీడియాలో వీడియో వైరలవుతోంది. కిటికీలోంచి ఫోన్ లాక్కొని పారిపోదామని చూసిన దొంగ చేయి ప్యాసింజర్ గట్టిగా పట్టుకున్నాడు.

New Update
running train theft

కదులుతున్న రైల్లో దొంగతనం చేసి సీజీగా తప్పించుకోవచ్చని చాలామంది కేటుగాళ్లు భావిస్తున్నారు. దీంతో స్టేషన్ నుంచి ట్రైన్ మూవ్ కాగానే.. ప్యాసింజర్ల ఫోన్లు, బంగారు ఆభరణాలు లాక్కొని ఉడాయిస్తు్న్నారు. ఇటీవల ఇలాంటి దొంగతనం కేసులు చాలా జరుగుతున్నాయి. రన్నింగ్ ట్రైన్ నుంచి దూకే ప్రయత్నం ప్యాసింజర్ చేయడనే ధైర్యంతో చైన్ స్నాచర్లు, 420లు ఇలా చేస్తున్నారు. కదులుతున్న ట్రైన్‌లో ప్రయాణికుడి ఫోన్ కొట్టేయాలని ట్రై చేసిన ఓ దొంగ దొరికిపోయాడు. కిటికీలోంచి దొంగని గట్టిగా అలానే పట్టుకొని కిలోమీటర్ వరకు అలానే లాక్కెల్లారు. ఈ ఘటన బీహార్ భాగల్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది.

Also read: Assembly: అసెంబ్లీ ముందే పొట్టు పొట్టు కొట్టుకున్న MLAలు (VIDEO)

Also read: Rafale Marine jets: ఫ్రాన్స్ నుంచి భారత్‌ మరో 26 రఫెల్ ఫెటర్ జెట్లు!

రన్నింగ్ ట్రైన్‌లో ప్యాసింజర్ ఫోన్ వాడుతున్నాడు. దానిపై కన్నేసిన దొంగ కిటికీలోచ్చి ఫోన్ లాక్కొని పారిపోవాలని ప్లాన్ వేసుకున్నాడు. ప్రయాణికుడు అప్రమత్తంగా ఉండటంతో దొంగ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. తన ఫోన్‌తోపాటు దొంగ చేయి కూడా వదలకుండా గట్టిగా ఉడం పట్టు పట్టినట్లు పట్టుకున్నాడు. గజేంద్రమోక్షంలో ఏనుగు కాలు నోట కరుచుకున్న మొసలిలా ప్రయాణికుడు దొంగ చేయి పట్టుకొని కిలో మీటర్ వరకు రన్నింగ్ ట్రైన్‌లో ఈడ్చుకెళ్లాడు. తలపై రెండుమూడు దెబ్బలు కూడా తగిలించారు తోటి ప్రయాణీకులు. దీంతో దొంగ చేయి కిటికీలోపల, తల, కాళ్లు, బాడీ ట్రైన్ బయట ఉంది. గిలిగిలా కొట్టుకుంటూ దొంగ కదులుతున్న ట్రైన్‌లో కిలో మీటర్ దూరం వెళ్లాడు. దీన్ని అదే బోగీలో కూర్చున్న ఇతర ప్రయాణికులు వీడియో తీశారు. ఆ విడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisment
Advertisment
Advertisment