Maharashtra : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం...స్పాట్ లో 24 మంది!

మహారాష్ట్రలోని బుల్ధానాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ముందుగా ఒక బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఆ తరువాత ఈ రెండు వాహనాలకు మరో బస్సు ఢీకొట్టింది.

New Update
bus-accidrent mp

bus-accidrent mp

మహారాష్ట్రలోని బుల్ధానాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. షెగావ్-ఖామ్‌గావ్ జాతీయ రహదారిపై ముందుగా ఒక బస్సు, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో ప్రమాదానికి గురైన ఈ రెండు వాహనాలకు మరో బస్సు ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోగా..  దాదాపు 24 మంది గాయపడ్డారు.

వెంటనే క్షతగాత్రులను ఖామ్‌గావ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ప్రాథమిక సమాచారం ప్రకారం వేగంగా వస్తున్న బొలెరో కారు, ఎస్టీ బస్సు అకస్మాత్తుగా ఢీకొన్నాయి. ఆ తర్వాత వెనుక నుండి వస్తున్న 'ప్రి' ప్యాసింజర్ బస్సు కూడా ఈ రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించగా, 24 మంది గాయపడ్డారు.


 జీరో పాయింట్ వద్ద

అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్‌లో, ఢిల్లీ-లక్నో హైవేపై, రాత్రి జీరో పాయింట్ వద్ద, అదుపుతప్పిన ట్రక్కు ఒక కారును ఢీకొట్టి దాదాపు 50 మీటర్లు ఈడ్చుకెళ్లింది. ఈ సమయంలో కారు కూడా మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు బాలికలు మృతి చెందారు. డ్రైవర్ సహా ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. అతన్ని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. కారులో ఉన్న వారందరూ నైనిటాల్ సందర్శించడానికి వెళ్లి రోహ్‌తక్‌లోని తమ ఇంటికి తిరిగి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది.

 

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

57ఏళ్ల వయసులో ఇదేం బుద్ధి.. లవర్ తండ్రి అస్థికలతో బ్లాక్‌మెయిల్ ‘వస్తేనే ఇస్తా’

తైవాన్‌కి చెందిన ఎన్వీ(57) అతని మాజీ ప్రియురాలిని బ్లాక్‌మెయిల్ చేయడానికి ఆమె తండ్రి అస్థికలు దొంగలించాడు. ఆమె మళ్లీ కలిస్తేనే అస్తికలు ఇస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో టాంగ్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఎల్వీని అరెస్ట్ చేసి అస్థికలను ఆమెకి ఇచ్చేశారు.

New Update
Ashes

Ashes Photograph: (Ashes )

తన ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడానికి వ్యక్తి ఓ ప్లాన్ వేశాడు. ఆమె తండ్రి అస్థికలు దొంగలించి బ్లాక్‌మెయిల్ చేశాడు. ఈ విషయంగా ఫిభ్రవరిలో జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. తైవాన్‌కు చెందిన ఎల్వి(57) అనే వ్యక్తి అతని మాజీ ప్రియురాలి తండ్రి అస్థికలను దొంగిలించాడు. 15 సంవత్సరాలు కలిసి ఉన్న తర్వాత 2023లో ఎల్వీ, టాంగ్(48) మధ్య లవ్ బ్రేక్‌అప్ అయ్యింది. గత కొన్ని నెలల క్రితం టాంగ్ తండ్రి చనిపోయారు. ఆమె తన తండ్రి అంత్యక్రియల తర్వాత అస్థికలను జాగ్రత్తగా భద్రపరిచింది. 2023మేలో ఎల్వీ వాటిని దొంగలించాడు. 2025 లవర్స్ డే రోజు ఎల్వీ.. టాంగ్‌కు ఆమె తండ్రి అస్థికలు ఉన్న కలశం ఫొటో పంపాడు. ఆమె తిరిగి అతన్ని కలవడానికి అంగీకరిస్తేనే ఆ అస్థికలు ఇస్తానని బ్లాక్‌మెయిల్ చేశాడు. ఎల్వి 2023లో టాంగ్‌తో ఉన్న రిలేషన్‌ను కట్ చేసుకున్నాడు. 

Also read: Terrorists arrests: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

ఎల్వీకి ఆమెతో విడిపోవడం ఇష్టం లేదు. తరువాతి రెండేళ్లలో టాంగ్‌ను పదే పదే ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. మే 2023లో అతను టాంగ్ తండ్రి అస్థికలు ఉంచబడిన స్మశానవాటికను సందర్శించడం ప్రారంభించాడు. ఆమెను మానసికంగా ఒత్తిడి చేయడానికి ఆ కలశం దొంగిలించాలని అతను ప్లాన్ చేశాడు. టాంగ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు అస్థికలు ఉన్న కలశం కోసం వెతకడం ప్రారంభించారు. ఎల్వీ కోళ్ల ఫారంలో అస్థికలు ఉన్న కలశం లభించింది. మార్చి 28న పోలీసులు ఆ పాత్రను స్వాధీనం చేసుకుని శ్రీమతి టాంగ్‌కు తిరిగి ఇచ్చారు.  ఎల్వి ఇప్పటికే సంబంధం లేని చీటింగ్, మనీలాండరింగ్ ఆరోపణలపై జైలులో ఉన్నాడు. 

Also read: Hunger strike: 131 రోజుల నిరాహార దీక్ష విరమించిన రైతు ఉద్యమ నాయకుడు

Advertisment
Advertisment
Advertisment