Bengaluru: లైంగిక వేధింపుల కేసులో సూరజ్ రేవణ్ణకు బెయిల్

లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు, జనతాదళ్ సెక్యులర్ నేత సూరజ్ రేవణ్ణకు బెంగళూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జేడీఎస్‌ కార్యకర్తపై సూరజ్ రేవణ్ణ అసహజ లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి.

New Update
Bengaluru: లైంగిక వేధింపుల కేసులో సూరజ్ రేవణ్ణకు బెయిల్

Suraj Revanna: ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణపై భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సూరజ్ రేవణ్ణపై 27 ఏళ్ల వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జూన్ 16న గన్నికాడలోని తన ఫామ్‌హౌస్‌లో సూరజ్ రేవణ్ణ తనను లైంగికంగా వేధించాడని సదరు వ్యక్తి ఫిర్యాదులో ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా హోలెనరసిపుర పోలీసులు సూరజ్ రేవణ్ణపై సెక్షన్ 377, 342 కింద కేసు నమోదు చేశారు. సూరజ్ రేవణ్ణ మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనువడు. తనపై వచ్చిన ఆరోపణలన్నింటినీ సూరజ్‌ రేవణ్ణ ఖండించారు. తన నుంచి రూ.5 కోట్లు దోపిడీ చేసేందుకు సదరు వ్యక్తి తప్పుడు ఫిర్యాదు చేశారని సూరజ్‌ ఆరోపించారు. సూరజ్ రేవణ్ణపై పార్టీ కార్యకర్తే లైంగిక వేధింపుల తప్పుడు కేసు పెట్టారని సూరజ్ రేవణ్ణ సన్నిహితుడు శివకుమార్ ఆరోపించారు.

ఈ కేసులో అరెస్ట్ అయిన సూరజ్‌కు తాజాగా బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్‌ను బెంగళూరు కోర్టు మంజూరు చేసింది. మరోవైపు ప్రజ్వ్ రేవన్ణ కూడా లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయ్యారు.

Also Read:Law Set: వచ్చేనెల 5 నుంచి లాసెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Madhya Pradesh:క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!

మధ్యప్రదేశ్‌ లో ఓ వింత దొంగతనం జరిగింది. అప్పుల వాళ్ల బాధలు భరించలేక దొంగతనం చేశాడు ఓ వ్యక్తి.అంతేకాకుండా తనని క్షమించాలని,ఆరు నెలల్లో ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తానని,లేని పక్షంలో పోలీసులకు పట్టించవచ్చని నిందితుడు ఓ లేఖను కూడా ఉంచాడు.

New Update
money

money

అప్పుల వాళ్ల వేధింపులు భరించలేకపోతున్నానంటూ ఓ బాధితుడు దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు.అంతటితో ఆగకుండా..తనను క్షమించాలని,డబ్బును ఆర్నెళ్లలో తిరిగి ఇచ్చేస్తానని టైప్‌ చేసి ఉంచిన లేఖను సైతం వదిలి వెళ్లడం గమనార్హం.మధ్యప్రదేశ్‌ లోని ఖర్గోన్‌ జిల్లాల్లో ఓ వింత వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

Also Read: ఐదు విమానాల్లో అమెరికాకు ఐఫోన్లు.. ట్రంప్ సుంకాలకు అలా షాకిచ్చిన యాపిల్!

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ...స్థానికంగా ఓ దుకాణంలో ఆదివారం అర్థరాత్రి దొంగతనం జరిగింది. నిందితుడు రూ.2.45 లక్షలు ఎత్తుకెళ్లాడు.ఈ విషయాన్ని గురించిన యజమాని...ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకుని వెళ్లాడు. ఈ క్రమంలోనే దర్యాప్తు చేపట్టిన పోలీసులకు దుకాణంలో ఓ లేఖ దొరికింది.

Also Read: TRUMP Tariffs: టారీఫ్‌ల విషయంలో వెనక్కి తగ్గిన ట్రంప్.. ఈ దేశాలపై సుంకాలు రద్దు..!

తాను దొంగతనం చేయాలనుకోలేదని, కానీ ...వేరే మార్గం లేకపోయిందని నిందితుడు అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.నేను పొరుగు ప్రాంతంలోనే ఉంటాను. కొంతకాలంగా అప్పుల వాళ్ల వేధింపులు ఎక్కువ అయ్యాయి. రామనవమి రోజు చోరీకి పాల్పడినందుకు క్షమాపణలు.నేను దొంగతనం చేయాలనుకోలేదు.

కానీ వేరే మార్గం లేకపోయింది. అవసరమైనంత డబ్బే తీసుకున్నాను. ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను.లేని పక్షంలో పోలీసులకు పట్టించొచ్చు.కానీ ఇప్పుడు మాత్రం ఈ డబ్బు తీసుకుని వెళ్లడం నాకు చాలా ముఖ్యం అని ఆ లేఖలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దుకాణం యజమాని సైతం బ్యాగులో రూ. 2.84 లక్షలు భద్రపర్చగా..అందులో రూ.2.45 లక్షలు కనిపించడం లేదని చెప్పినట్ఉ తెలుస్తుంది.

నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Sharmila fires on YCP :  ప్రజలు చెప్పుతో కొట్టినా పద్ధతి మారలేదు.. వైసీపీపై షర్మిల సంచలన వ్యాఖ్యలు!

Also Read: Trump's another shock : హెచ్ 1బీ, ఎఫ్1 వీసాదారులు, గ్రీన్ కార్డు దరఖాస్తుదారులకు ట్రంప్ మరో షాక్..! హెల్ప్ డెస్క్ సస్పెండ్

 note | madhya-pradesh | madhya pradesh news | apology | steals money | police | letter | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment