కానిస్టేబుల్ చొరవ..భుజాల మీద మోసి మరీ ప్రాణాలు కాపాడిన వైనం

చనిపోతున్న వ్యక్తిని మోసుకుని తీసుకెళ్ళి మరీ ప్రాణాలు కాపాడారు కరీంనగర్‌లోని ఓ పోలీస్ కానిస్టేబుల్. పురుగుల మందు తాగాడని సమాచారం అందుకున్న కానిస్టేబుల్..2 కిలోమీటర్లు పొలాల నుంచి నడిచి ఊరికి చేరుకుని అతడిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు.

New Update
కానిస్టేబుల్ చొరవ..భుజాల మీద మోసి మరీ ప్రాణాలు కాపాడిన వైనం

 Karimnagar district, Bhetigal: రక్షణ కల్పించాల్సిన ఉద్యోగం అది. నేరపరిశోధనే కాదు...అమాయకుల ప్రాణాలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత వారి భుజాల మీద ఉంటుంది పోలీసులకు. చాలా మంది పోలీసులు ఎంతో నిజాయితీతో, అంకిత భావంతో ప్రజలకు సేవలు అందిస్తూ మంచి గుర్తింపు పొందుతున్నారు. అలానే మరికొందరు పోలీసులు..తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాపాయస్థితిలో ఉన్న ఎందరో సామాన్యులను కాపాడి..వారి జీవితం నిలబెడుతున్నారు. గతంలో సడెన్‌గా హార్ట్‌ ఎటాక్‌ బారిన పడిన వారికి సీఆర్ చేసి కాపాడిన ఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోబోతున్న కానిస్టేబుల్‌ కూడా అలాంటి పనే చేశారు. తాను చేస్తున్న ఉద్యోగానికి 100శాతం న్యాయం చేశారు కరీంనగర్ జిల్లాలోని కానిస్టేబుల్ జయపాల్. సమయస్ఫూర్తి, మానవతతో ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడారు.

ఏం జరిగిందంటే...
కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం భేతిగల్‌‌కు చెందిన కుర్ర సురేష్‌ అనే వ్యక్తి ఇంట్లో గొడవ పడి పొలం దగ్గర పురుగుల మందు తాగాడు. అక్కడ ఉన్నవారు అది గమనించి 100కు సమాచారం ఇచ్చారు. దీనికి వెంటనే స్పందించిన బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుల్‌ జయపాల్‌, హోమ్‌గార్డు కిన్నెర సంపత్‌లు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే సురేష్ అపస్మారక స్థితిలో ఉన్నాడు. అంతే జయపాల్ ఆలోచిస్తూ కూర్చోకుండా సురేష్‌ను భుజం మీద వేసుకుని ఊర్లోకి పరుగులు పెట్టారు. అలా రెండు కిలోమీటర్లు నడిచి సమయానికి అతనిని ఆసుపత్రిలో చేర్చారు. జమ్మగుంట ప్రభుత్వాసుపత్రిలో సురేష్‌ను జాయిన్ చేశారు.

జయపాల్‌కు ప్రశంసలు..

సురేష్ ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉంది. సకాలంలో ఆసుపత్రికి తీసుకురావడం వల్లనే అతని ప్రాణాలను కాపాడగలిగామని డాక్టర్లు చెబుతున్నారు. దీనికి కారణమైన కానిస్టేబుల్ జయపాల్‌కు సురేష్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బ్లూ కోల్ట్స్‌ కానిస్టేబుల్‌, ఇతర సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు అభినందించారు. సురేష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

Also Read:Jobs: నిరుద్యోగులకు శుభవార్త..61,960 జీతంలో గవర్నమెంట్ జాబ్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK VS LSG: ఎట్టకేలకు చైన్నైను వరించిన విజయం..దగ్గరుండి గెలిపించిన కెప్టెన్ మహీ

హమ్మయ్య పాయింట్ల పట్టికలో అట్టుగ ఉండి విజయం కోసం తపిస్తున్న జట్టును కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ విజయతీరాలకు నడిపించాడు. చివర్లో వరుసగా ఫోర్లు, సిక్స్ లు కొడుతూ మ్యాచ్ గెలిచేలా చేశాడు. ఐదు వరుస ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు ఎల్ఎస్జీ మీద గెలిచింది.

author-image
By Manogna alamuru
New Update
ipl

CSK VS LSG

గెలిచింది...గెలిచింది...చెన్నై సూపర్ కింగ్స్ మొత్తానికి మ్యాచ్ గెలిచింది.  పేలవమైన ప్రదర్శనతో అందరినీ నిరాశకు గురి చేస్తున్న సీఎస్క్ కు ఈరోజు మంచి విజయం దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ మీద 5 వికెట్ల తేడాతో చెన్నై గెలిచింది. వరుసగా ఐదు ఓటములను మూట గట్టకున్న సీఎస్కో ఎట్టకేలకు కాస్త ఊపిరి పీల్చుకుంది. స్వయంగా కెప్టెన్ ధోనీనే మ్యాచ్ ను గెలిపించడం ఈ మ్యాచ్ లో మరొక విషయం. ముందు బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై బ్యాటర్లలో శివమ్‌ దూబె (43*), రచిన్‌ రవీంద్ర (37), షేక్‌ రషీద్‌ (27), ధోనీ (26*) రాణించారు. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ 2, అవేశ్‌ ఖాన్‌, మార్‌క్రమ్‌, దిగ్వేశ్‌ ఒక్కో వికెట్‌ తీశారు.  

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగి..

ఈరోజు మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన లక్నో నిర్దేశించిన 20 ఓవర్లలో లక్నో జట్టు 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రిషభ్ పంత్ చెలరేగిపోయాడు. 49 బంతుల్లో 63 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన మార్క్‌రమ్, నికోలస్ పూరన్ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ ఇద్దరూ ఎక్కువ సమయం క్రీజ్‌లో నిలవలేకపోయారు. తొలి ఓవర్‌ ముగిసేసరికి లక్నో 1 వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. 

చెలరేగిన పంత్..

ఆ తర్వాత క్రీజ్‌లోకి మిచెల్ మార్ష్ వచ్చాడు. అక్కడనుంచి మార్ష్, పూరన్ భారీ షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టారు. కానీ పూరన్ దూకుడు తక్కువ సమయానికే పరిమితం అయింది. నికోలస్ పూరన్ (8) పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో లఖ్‌నవూ రెండో వికెట్ కోల్పోయింది. అన్షుల్ కాంబోజ్ వేసిన నాలుగో ఓవర్‌లో చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్‌ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాడు.  దీంతో లక్నో జట్టు 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 34 పరుగులు సాధించింది. ఇక పంత్, మార్ష్‌ నిలకడగా ఆడుతున్న సమయంలో మరో బిగ్ షాక్ తగిలింది. మార్ష్‌ (30) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో లక్నో జట్టు 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు సాధించింది. ఆ తర్వాత పంత్ చెలరేగిపోయాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. 49 బంతుల్లో 63 పరుగులు రాబట్టాడు. అలాగే బడోని 17 బంతుల్లో 22 పరుగులు, అబ్దుల్ సమద్ 11 బంతుల్లో 20 పరుగులు చేశారు. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 166 పరుగులు రాబట్టారు.  
 

today-latest-news-in-telugu | IPL 2025 | csk-vs-lsg 

Also Read: Waqf Act Protest: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..

Advertisment
Advertisment
Advertisment