TS Politics: ఇస్తే నా కొడుక్కు, కుదరకపోతే సీపీఎంకు.. మిర్యాలగూడపై జానారెడ్డి మెలిక

ఇస్తే తన కొడుక్కు, లేకుంటే సీపీఎంకు మిర్యాలగూడ టికెట్ ను కేటాయించాలన్న భావనతో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసమే ఆయన సీపీఎంతో పొత్తుకు ఆరాటపడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరో నేత బత్తుల లక్ష్మారెడ్డికి టికెట్ ఇవ్వడం ఆయనకు ఇష్టం లేదని తెలుస్తోంది.

New Update
TS Politics: ఇస్తే నా కొడుక్కు, కుదరకపోతే సీపీఎంకు.. మిర్యాలగూడపై జానారెడ్డి మెలిక

తెలంగాణలో సీపీఐ(CPI), సీపీఎం(CPM), కాంగ్రెస్(Congress) కలిసి పోటీ చేస్తాయని అంతా భావించారు. కానీ సీట్ల లెక్కల్లో సయోధ్య కుదరకపోవడంతో సీపీఎం ఒంటరిగానే బరిలోకి దిగేందుకు సిద్ధం అవుతోంది. సీపీఐకు కేవలం ఒక్క కొత్తగూడెం టికెట్ మాత్రమే ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఎన్నికల తర్వాత రెండు ఎమ్మెల్సీలను ఇస్తామని తెలిపింది. ఇందుకు సీపీఐ కూడా ఓకే చెప్పింది. అయితే.. సీపీఎంకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు నల్గొండ జిల్లాలోనూ మంచి పట్టు ఉంది. కానీ సీట్ల అడ్జస్ట్మెంట్ కుదరకపోవడంతో ఆ జిల్లాల కాంగ్రెస్ ముఖ్య నేతలు పొత్తు విషయాన్ని పక్కకు పెట్టేశారు. కానీ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి (Janareddy) మాత్రం ఇంకా సీపీఎంతో పొత్తు కోసం ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. కమ్యూనిస్టులపై జానారెడ్డికి అకస్మాత్తుగా ప్రేమ పెరగడానికి కారణం ఏంటన్న అంశంపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మిర్యాలగూడ స్థానాన్ని సీపీఎంకి ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కానీ ఆ సీటుతో పాటు మరో సీటును సీపీఎం అడుగుతోంది.
ఇది కూడా చదవండి: BJP Final List: ఆ 11 మంది ఎవరు?.. కొనసాగుతున్న ఉత్కంఠ!

ఆ విషయంలోనే సీట్ల పంచాయితీ తెగక సీపీఎం ఒంటరి పోరుకు సిద్ధమైంది. అయితే.. ఆఖరి నిమిషంలో మళ్లీ పొత్తు కుదిరినా సీపీఎంకు మిర్యాలగూడ సీటును ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసమే కాంగ్రెస్ కూడా మిర్యాలగూడ సీటును ప్రకటించలేదు. అయితే.. మిర్యాలగూడలో కాంగ్రెస్ అభ్యర్థి కాకుండా సీపీఎం అభ్యర్థే పోటీ చేయాలని జానారెడ్డి భావిస్తున్నట్లు చర్చ సాగుతోంది. ఎందుకంటే.. జానారెడ్డికి మొదటి నుంచి మిర్యాలగూడపై మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యంలోనే మిర్యాలగూడ టికెట్ ను తన తనయుడు రఘవీర్ కు ఇప్పించాలని ఆయన విశ్వ ప్రయత్నాలు చేశారు. అయితే.. జిల్లాకు చెందిన మరో ఇద్దరు అగ్రనేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి సపోర్ట్ తో బీఎల్ఆర్ (బత్తుల లక్ష్మారెడ్డి) పేరును హైకమాండ్ పరిశీలిస్తోంది.

దీంతో జానారెడ్డి కుమారుడికి టికెట్ వచ్చే అవకాశం లేకుండా పోయింది. దీంతో తన కుమారుడు కాకుండా వేరే అభ్యర్థి పోటీ చేసే బదులు సీటును సీపీఎంకు ఇప్పించడం బెటరని జానారెడ్డి భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా అయితే.. భవిష్యత్ లో అయినా పరిస్థితులు అనుకూలిస్తే తన కుమారుడికి మిర్యాలగూడ టికెట్ వస్తుందని ఆయన ఆశలు పెట్టుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే.. సీపీఎం ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గాల్లో ఉత్తమ్, కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీ చేస్తున్నారు. సీపీఎంతో పొత్తులేకపోతే వీరికే నష్టం ఉండే అవకాశం ఉంటుంది. కానీ వారు మాత్రం మిర్యాలగూడలో కాంగ్రెస్ పోటీ చేయాలని పట్టుబడుతున్నారు. కానీ జానారెడ్డి మాత్రం సీపీఎం పోటీ చేయాలని ప్రయత్నించడం ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Congress Politics: మీనాక్షికి బిగ్ షాక్ ఇచ్చిన సీనియర్లు.. హైకమాండ్ కు కంప్లైంట్!

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ను తొలగించాలని హైకమాండ్ కు కాంగ్రెస్ సీనియర్ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. HCU అంశంపై మీనాక్షి వ్యవహరించిన తీరు పార్టీ, ప్రభుత్వానికి ఇబ్బందిగా మరిందంటూ ఫిర్యాదు చేశారు.

New Update

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు సీనియర్ నేతలు బిగ్‌షాక్ ఇచ్చారు. ఆమెను తొలగించాలంటూ ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. ఆమె వ్యవహారశైలితో పార్టీకి నష్టం జరుగుతుందంటూ హైకమాండ్ కు మొరపెట్టుకున్నారు. ముఖ్యంగా HCU అంశంపై మీనాక్షి వ్యవహరించిన తీరు పార్టీ, ప్రభుత్వానికి ఇబ్బందిగా మరిందంటూ కంప్లైంట్ చేశారు. దీంతో ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ను ఇన్‌ఛార్జిగా కొనసాగిస్తారా? లేక తప్పిస్తారా? అన్న అంశం తెలంగాణ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. HCU భూముల విషయంలో మీనాక్షి నటరాజన్ ఏకంగా సెక్రటేరియట్లోని భట్టి విక్రమార్క ఛాంబర్ లో సమీక్ష నిర్వహించిన అంశంపై విమర్శలు వచ్చాయి. అనంతరం యూనివర్సిటీకి వెళ్లి స్టూడెంట్స్ తో భేట కావడం ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. 

అందుకే సీనియర్లకు కోపం?

పార్టీలో అందరూ ఒకటే అనే సిద్ధాంతంతో మీనాక్షి పని చేస్తున్నారు. ఇది సీనియర్లకు మింగుడు పడడం లేదని తెలుస్తోంది. తమ సిఫారసులను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు గాంధీభవన్ లో చర్చ సాగుతోంది. రాహుల్ గాంధీ టీమ్ లో మీనాక్షి కీలకంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర బాధ్యతలు అప్పగించారన్న ప్రచారం ఉంది.

ఇక్కడ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని.. ఈ క్రమంలో పార్టీని బలోపేతం చేయడం, నిజమైన కార్యకర్తలకు న్యాయం చేయడం అన్న లక్ష్యంగా మీనాక్సి నటరాజన్ ను తెలంగాణ ఇన్ఛార్జిగా నియమించింది హైకామాండ్. అయితే.. ప్రస్తుతం సీనియర్లు ఆగ్రహంగా ఉన్న ఈ తరుణంలో ఆమెను కొనసాగిస్తారా? లేక పక్కకు పెడతారా? అన్న అంశంపై తెలంగాణ పాలిటిక్స్ లో ఉత్కంఠగా మారింది.

(telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
Advertisment