Malla Reddy Land Dispute : మల్లారెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

మల్లారెడ్డి భూవివాదంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి పెద్ద కబ్జాకోరని.. తాము కొన్న భూమిని దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి అరచకాలు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్తాం

New Update
Malla Reddy Land Dispute : మల్లారెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

BRS MLA : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy) భూవివాదం (Land Dispute) కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ' మల్లారెడ్డి పెద్ద కబ్జాకోరు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇన్నిరోజులు దౌర్జన్యాలు చేశారు. మల్లారెడ్డి అరచకాలు ముఖ్యమంత్రి రేవంత్ (CM Revanth) దృష్టికి తీసుకెళ్తాం. సుచిత్రలో సర్వే నెంబర్ 83/Eలో 600 గజాల ల్యాండ్‌ను 2015లో నేను కొనుగోలు చేశారు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డితో పాటు.. మిగతా బీఆర్‌ఎస్ నేతలు నాతోపాటే ల్యాండ్ కొన్నారు. 2021లో ఈ భూమిని శ్రీనివాస్‌ రెడ్డికి అమ్మేశాం.

Also read: మిర్యాలగూడలో ఈటల స్పీచ్-LIVE

మేము కొన్న భూమి డాక్యుమెంట్లు మల్లారెడ్డి ఫేక్ అంటున్నాడు. ల్యాండ్ వివాదం పరిష్కరించమని.. అనేకసార్లు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డిని అడిగాను. ఇందులో వాళ్ల ల్యాండ్ లేనప్పటికీ దౌర్జన్యంగా కబ్జా చేస్తున్నారని' అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. మరోవైపు ఈ భూ వివాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. సుచిత్రలోని వివాద స్థలానికి వెళ్లిన రెవెన్యూ అధికారులు.. సర్వే నంబర్ 82లో ల్యాండ్ సర్వే చేస్తున్నారు. ఇప్పటికే ఆ వివాద స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎవరినీ అటువైపు వెళ్లకుండా అనుమతించడం లేదు. మీడియాకు కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు. ల్యాండ్ సర్వేతో వివాదం కొలిక్కి రానుంది.

Also read: అలర్ట్.. ఈ నెల 25 వరకు వర్షాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు