Lok Sabha Election Result: ఇది మోదీ వ్యతిరేక తీర్పు.. ఎన్నికల ఫలితాలపై ఖర్గే, రాహుల్ రియాక్షన్ లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిచారు. ఈసారి ఎన్నికలు మోదీ వ్యతిరేక తీర్పును ఇచ్చాయని భావిస్తున్నామని.. నైతికంగా ఇది మోదీ ఓటమి అని అన్నారు. ప్రజాతీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నామని స్పష్టం చేశారు. By B Aravind 04 Jun 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందిచారు. ఈసారి ఎన్నికలు మోదీ వ్యతిరేక తీర్పును ఇచ్చాయని భావిస్తున్నామని.. నైతికంగా ఇది మోదీ ఓటమి అని అన్నారు. ఏ పార్టీకీ కూడా ప్రజలు మ్యాజిక్ ఫిగర్ రాలేదని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కాంగ్రెస్ పోరాటం కొనసాగించిందని అన్నారు. రాహుల్చేపట్టిన యాత్రలు కాంగ్రెస్కు సీట్లు పెరిగేందుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు. ప్రజాతీర్పును వినమ్రంగా స్వీకరిస్తున్నామని స్పష్టం చేశారు. మరోవైపు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యవస్థలపై, నిఘా సంస్థలపై చేసిన యుద్ధంగా భావిస్తామని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే యుద్ధం చేశామని పేర్కొన్నారు. Also Read: మ్యాజిక్ ఫిగర్కు దూరంలో బీజేపీ.. ప్రభుత్వ ఏర్పాటుకు మంతనాలు #modi #bjp #malli-kharjun-kharge #congress #india #rahul-gandhi సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి