కేబినెట్ లో నిర్ణయాలు తీసుకుంటున్నది మంత్రులు కాదు... రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు...

దేశంలోని ప్రతి సంస్థలోనూ ఆర్ఎస్ఎస్ తమ సొంత వ్యక్తులను చొప్పిస్తోందన్నారు. కేబినెట్ లో నిర్ణయాలు తీసుకుంటున్నది మంత్రులు కాదన్నారు. మంత్రి వర్గంలో ఏం జరగాలనేది ఆర్ఎస్ఎస్ కు చెందిన ఓ పెద్ద మనిషి నిర్ణయిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రులను అడిగినా నిజం చెబుతారన్నారు. తాము తమ మంత్రిత్వ శాఖలను నడపడం లేదని కేంద్ర మంత్రులు చెబుతారని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ నియమించిన వ్యక్తులు ఆ మంత్రిత్వ శాఖలను నడుపుతున్నారని చెప్పారు.

author-image
By G Ramu
New Update
కేబినెట్ లో నిర్ణయాలు తీసుకుంటున్నది మంత్రులు కాదు... రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు...

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. దేశంలోని ప్రతి సంస్థలోనూ ఆర్ఎస్ఎస్ తమ సొంత వ్యక్తులను చొప్పిస్తోందన్నారు. కేబినెట్ లో నిర్ణయాలు తీసుకుంటున్నది మంత్రులు కాదన్నారు. మంత్రి వర్గంలో ఏం జరగాలనేది ఆర్ఎస్ఎస్ కు చెందిన ఓ పెద్ద మనిషి నిర్ణయిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఇదే విషయాన్ని కేంద్ర మంత్రులను అడిగినా నిజం చెబుతారన్నారు. తాము తమ మంత్రిత్వ శాఖలను నడపడం లేదని కేంద్ర మంత్రులు చెబుతారని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ నియమించిన వ్యక్తులు ఆ మంత్రిత్వ శాఖలను నడుపుతున్నారని చెప్పారు. వాళ్లే మంత్రిత్వ శాఖలకు అన్ని సూచనలు చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

భారత దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చిందన్నారు. దేశంలో స్వేచ్ఛను ఏకీకృతం చేసేది రాజ్యాంగమన్నారు. రాజ్యాంగం అనేది నియమాల సముదాయమని చెప్పారు. రాజ్యాంగ సిద్దాంతాలకు మద్దతిచ్చేలా రాజ్యాంగ సంస్థలను ఏర్పాటు చేయాలన్నారు. కానీ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు మాత్రం సంస్థాగత నిర్మాణంలో భాగంగా తమ సొంత వ్యక్తులనే కీలక స్థానాల్లో నియమిస్తున్నారని మండిపడ్డారు.

ఇది ఇలా వుంటే రాహుల్ గాంధీ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ లో పర్యటిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆయన లడఖ్ ప్రాంతంలో మొదటి సారిగా పర్యటిస్తున్నారు. గతంలో ఎస్పీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, దాని మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ సిద్దాంతంతో సంబంధం వున్న వాళ్లు గతంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించారని పేర్కొన్నారు.

ఆ వాస్తవాలను దాచి పెట్టేందుకే ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఇప్పుడు ప్రతి ఇంటిపై జెండాలు ఎగుర వేయాలని ప్రచారం చేస్తున్నాయని అన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ లు ఇప్పుడు ‘న్యూ క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని నడుపుతున్నాయని చెప్పారు. అందులో భాగంగా అప్పులు తీసుకున్న వ్యాపారస్తులు దేశం నుంచి వెళ్లిపోయేలా అనుమతిస్తోందన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tahawwur Rana: భారత్ కు తహవూర్ రాణా అప్పగింత..స్పెషల్ ఫ్లైట్ లో..

ముంబయ్ పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణా చిట్టచివరి పిటిషన్ కూడా తిరస్కరణ గురైంది. దీంతో అక్కడి అధికారులు అతనిని భారత్ కు అప్పగించారు. ఒక ప్రత్యేక విమానంలో రాణాను తీసుకుని భారతీయ అధికారుల బృందం ఇండియాకు పయనమైంది. 

New Update
Tahawwur Rana

Tahawwur Rana Photograph: (Tahawwur Rana)

తనను భారత్ కు అప్పగించొద్దు మొర్రో అంటూ మొత్తుకున్నాడు. భారత్ కు తనను పంపిస్తే చిత్ర హింసలకు గురి చేస్తారని ఏడ్చాడు. కానీ అమెరికాలో సుప్రీంకోర్టుతో సహా ఏ న్యాయస్థానం అతని మాటను వినలేదు. చిట్టచివరి పిటిషన్ కూడా నిన్న తిరస్కరణకు గురైంది. దీంతో అక్కడి అధికారులు రాణాను భారతీయ అధికారులకు అప్పగించారు. చట్టపరమైన లాంఛనాలన్నింటినీ పూర్తి చేసుకుని తహవూర్ ను కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు అతనిని తీసుకుని అధికారుల బృందం ప్రత్యేక విమానంలో ఇండియాకు తిరుగుపయనమైందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పలు ఇంగ్లీష్ న్యూస్ లలో కథనాలు వచ్చాయి. ఈ రాత్రికి లేదా రేపు తెల్లవారు ఝాముకు వారు ఇండియా చేరుకోనున్నారు. 

ఎప్పటి నుంచో పోరాడుతున్న భారత్..

తహవూర్‌ రాణా పాకిస్థాన్‌కు చెందిన కెనడా జాతీయుడు. 26/11 ముంబయి దాడుల్లో కీలక సూత్రధారి. ఇతన్ని అప్పగించాలని భారత్ చాలాకాలంగా పోరాడుతోంది. అయితే దీన్ని తహవూర్ రాణా చాలా సార్లు ప్రయత్నించాడు. అక్కడి ఫెడరల్ కోర్టుల్లో చాలా సార్లు పిటిషన్ వేశాడు. ఆ కోర్టులన్నీ అతని అభ్యర్థనను తిరస్కరించాయి.  శాన్‌ఫ్రాన్సిస్కోలోని యూఎస్‌ కోర్టు ఆఫ్‌ అప్పీల్‌లోనూ చుక్కెదురైంది. దీంతో చివరిసారి గా  గతేడాది నవంబరు 13వ తేదీన అమెరికా సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశాడు తహవూర్ రాణా. అయితే ఈ పిటిషన్ ను కట్టేయాలని కోర్టును అమెరికా ప్రభుత్వం కోరింది. దీనికి సంబంధించి 20 పేజీల అఫిడవిట్ ను దాఖలు చేసింది. దీన్ని పరిశీలించిన సుప్రీంకోర్టు అమెరికా ప్రభుత్వం అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంది. రాణా పిటిషన్ ను కొట్టేసింది. తాజాగా నిన్న మరో న్యాయస్థానం కూడా అతని పిటిషన్ ను తిరస్కరించింది. వీటన్నిటితో పాటూ రాణా అప్పగింతపై అధ్యక్షుడు ట్రంప్ సైతం ప్రకటన చేశారు. ప్రధాని మోదీ పర్యటనకు వెళ్ళినప్పుడు 26/11 ముంబయి ఉగ్ర దాడిలో నిందితుడైన అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిని భారత్‌ కు అప్పగిస్తామని మాటిచ్చారు. 

 today-latest-news-in-telugu | Tahawwur Rana | india

Also Read: USA-China: మేం కూడా మా ఆయుధాలతో సిద్ధంగా ఉన్నాం..104 శాతం టారీఫ్ లపై చైనా మండిపాటు

Advertisment
Advertisment
Advertisment