ఇండియా కూటమి కన్వీనర్ గా ఆయనకే ఛాన్స్.... !

విపక్ష ఇండియా కూటమికి కన్వీనర్ గా కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేను ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. అత్యధికులు ఆయన వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జేడీయూ నేతలు ఆయనకు మద్దతు ఇస్తున్నారు. ఇండియా కూటమికి నాయకత్వం వహించే బాధ్యతను కాంగ్రెస్ కు ఇస్తే బాగుంటుందని సూచనలు చేస్తున్నారు.

author-image
By G Ramu
New Update
Mallikarjun Kharge:  కలబురగిలో ఖర్గే ఎమోషనల్.. తన అంత్యక్రియలకు రావాలంటూ!

విపక్ష ‘ఇండియా’కూటమి కన్వీనర్‌గా కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గేను ఎన్నుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ముంబైలో జరిగే విపక్ష కూటమి మూడవ సమావేశంలో కన్వీనర్ గా మల్లిఖార్జున ఖర్గే పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఖర్గే అత్యంత సీనియర్ నేత కావడంతో ఆ పదవికి ఆయన పేరును ప్రతిపాదించాలని పలు పార్టీల నేతలు భావిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

విపక్ష కూటమి కన్వీనర్ పదవిని జేడీయూ చీఫ్, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆశిస్తున్నారంటూ మొదట్లో వార్తలు వచ్చాయి. ఇండియా కూటమికి ఆయన్నే కన్వీనర్ గా నియమించాలని శివసేన(యూబీటీ), ఇతర పార్టీల నేతలు ప్రతిపాదనలు చేశారు. కానీ తాను ఎలాంటి పదవులు కోరుకోవడం లేదని ఆయన ఇటీవల ప్రకటించారు. తాను మొదటి నుంచి ఈ విషయాన్ని చెబుతూ వస్తున్నానని అన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఏక తాటిపైకి తేవడమే తన లక్ష్యమని ఆయన వెల్లడించారు. దీంతో కన్వీనర్ పదవి బరి నుంచి ఆయన తప్పుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో జేడీయూ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లిఖార్జున ఖర్గే లేదా మరో నేతను ఇండియా కూటమికి కన్వీనర్ గా ఎన్నుకోవాలని జేడీయూ నేతలు సూచించారు.

విపక్ష కూటమి మూడవ సమావేశాన్ని ముంబైలో నిర్వహించనున్నారు. ఈ నెల 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో సీట్ల పంపకాలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించనున్నారు. దీంతో పాటు 11 మంది సభ్యుల సమన్వయ కమిటీని నామినేట్ చేయనున్నారు. ఇక కూటమి లోగోను ఈ సమావేశంలో ఆవిష్కరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

ప్రతిపక్షాలను ఒకే తాటి పైకి తీసుకు రావడంలో జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. ఆయన చొరవతోనే మొదటి సమావేశాన్ని బిహార్ రాజధాని పాట్నాలో నిర్వహించారు. ఈ సమావేశంలో విపక్ష పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దీంతో జూలై 17-18 తేదీల్లో కర్ణాటక రాజధాని బెంగళూరులో రెండవ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలోనే విపక్ష కూటమికి ఇండియా అనే పేరు ఖరారు చేశారు.

ALSO READ: విపక్ష కూటమి కన్వీనర్ పోస్టుపై….. నితీశ్ కుమార్ ఏమన్నారంటే….!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

భారీ వర్షం.. పిడుగులు పడి 13 మంది మృతి

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. మృతుల కుటుంబాలకు సీఎం నితిశ్ కుమార్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు.

New Update
13 killed in lightning strikes in four districts of Bihar

13 killed in lightning strikes in four districts of Bihar

బీహార్‌లో పలు జిల్లాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురు గాలులు వీచాయి. బుధవారం ఉదయం నాలుగు జిల్లాల పరిధిలో పిడుగులు పడి 13 మంది ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. దర్‌బంగా, బెగూసరాయ్ జిల్లాల్లో తొమ్మిది మంది పిడుగుపాటుకు గురై మృతి చెందారు. మధుబనీ జిల్లాలో ముగ్గురు చనిపోయారు. వీళ్లలో ఇద్దరూ ఒకే ఫ్యామిలీకి చెందిన తండ్రి, కూతురు. ఇక సమస్తిపుర్‌లో ఒక వ్యక్తి పిడుగుపాటు వల్ల మృతి చెందాడు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారికంగా వెల్లడించింది.    

Also Read: ముగ్గురు పిల్లల తల్లికి ఇంటర్ స్టూడెంట్‌తో మూడో పెళ్లి

ఈ ఘటనపై సీఎం నితీశ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. విపత్తు నిర్వహణ అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే బిహార్ ఆర్థిక సర్వే ప్రకారం చూసుకుంటే 2023లో పిడుగుపాటు వల్ల 275 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 Also read: పెళ్లికి ముందు కాబోయే అల్లుడితో అత్త జంప్‌..

ఇదిలాఉండగా భారత వాతావరణ శాఖ (IMD) కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 9 నుంచి 12వ తేదీ దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలుల విస్తాయని.. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా సంభవించే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.  

Also read: బీహార్ లో దారుణం కేంద్రమంత్రి మనమరాలి దారుణ హత్య

 

 

Advertisment
Advertisment
Advertisment