Rythu Runa Mafi: నేడే అకౌంట్లోకి డబ్బు జమ!

TG: ఈరోజు మూడో విడత రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఖమ్మం జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మూడో విడత రుణమాఫీ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ కానున్నాయి.

New Update
Runa mafi: రుణమాఫీ అమలులో 31 సాంకేతిక సమస్యలు.. వ్యవసాయ శాఖ కీలక నివేదిక!

Rythu Runa Mafi: పంద్రాగస్టు రోజున రైతులకు రుణాల నుంచి విముక్తి చేసేందుకు సిద్ధమైంది రేవంత్ సర్కార్. ఈరోజు తెలంగాణలో (Telangana) మూడో విడత రుణమాఫీ చేయనుంది. ఆగస్టు 15వ తేదీ లోగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గతంలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే , ఇప్పటి వరకు రెండు విడతల్లో రూ.1,50,000 రైతు రుణాలను మాఫీ చేసింది రేవంత్ సర్కార్.

ఈరోజు రూ.1,50,000 నుండి రూ.2,00,000 వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనుంది. ఈరోజు రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ కానున్నాయి. ఖమ్మం జిల్లా (Khammam) వైరా మండలంలో నిర్వహించనున్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మూడో విడత నిధులను విడుదల చేయనున్నారు. కాగా ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి రాగానే రూ.2లక్షల రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

మరో రెండు గ్యారెంటీలు..

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా పెన్షన్ పెంపు, మహిళలకు రూ.2500 వంటి పథకాలను ఈరోజు ప్రారంభిస్తారనే చర్చ పార్టీ వర్గాల్లో నెలకొంది. కాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ సభలో ఎలాంటి హామీల వర్షం కురిపిస్తారనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది. కాగా ఇప్పటి వరకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో (Six Guarantees) రెండు గ్యారెంటీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేసింది.మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, అలాగే గ్యాస్ సిలిండర్ రూ.500లకు అందించింది. అయితే.. ఈరోజు పర్యటనలో సీఎం రేవంత్ ఏం ప్రకటన చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Also Read: త్వరలో ఎకరాకు రూ.15,000.. సీఎం కీలక ప్రకటన

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Fruits: పండ్లను చూసే తియ్యగా ఉన్నాయో లేదో చెప్పొచ్చు

వేసవిలో పండ్లను కొన్ని సమయంలో పొర పాట్లు చేస్తారు. దానిమ్మ, నారింజ, పుచ్చకాయ, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్ నీటి శాతం ఉన్నవి శరీరాన్ని హైడ్రేట్ చేసి, వేడిని తగ్గిస్తాయి. పండ్లు ముదురు రంగు, కొంత మెత్తగా ఉంటే అది తీపిగా, పుల్లగా ఉండే అవకాశం ఉంటుంది.

New Update
Fruits sweet

Fruits sweet

Fruits: వేసవిలో పండ్ల వినియోగం విపరీతంగా పెరుగుతుంది. శరీరానికి అవసరమైన తేమను కలిగి ఉండే పండ్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే సరైన పండ్లను ఎంచుకోవడంలో చాలామంది పొర పాట్లు చేస్తుంటారు. ఫలితంగా ఇంటికి తీసుకువెళ్లిన పండ్లు పచ్చిగా ఉండడం, రుచి తక్కువగా ఉండటం వంటి సమస్యలు ఎదురవుతాయి. దానిమ్మ వంటి పండ్లు కొనేటప్పుడు పైభాగం స్వల్పంగా తెరిచి ఉంటే అది తియ్యగా ఉన్నని భావించవచ్చు. మిగతా పండ్ల విషయంలో కూడా కొన్ని సరళమైన లక్షణాలను గమనించడం ద్వారా తియ్యని ఫలాలను ఎంచుకోవచ్చు. 

ఆకుపచ్చని ఆకులు ఉండాలి:

పుచ్చకాయకు చక్కటి చారలు, గట్టి పొడవైన ఆకారం ఉంటే అది ఎక్కువగా తీపిగా ఉండే అవకాశం ఉంది. అలాగే దానిని కొడితే ఖాళీగా అనిపించకూడదు. నారింజను కొనేటప్పుడు దాని రంగును గమనించండి. ముదురు రంగు, కొంత మెత్తగా ఉంటే అది తీపిగా, పుల్లగా ఉండే అవకాశం ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్ విషయంలో కూడా ఆకుపచ్చని ఆకులు ఉండాలి. ఇది ఫలాన్ని తాజాగా ఉందని సూచిస్తుంది. 

ఇది కూడా చదవండి: వేసవిలో అమ్మాయిలు దీనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి

బొప్పాయి విషయానికి వస్తే పూర్తిగా పసుపు రంగులో ఉంటే మాత్రమే తియ్యటి బొప్పాయి అని గుర్తించాలి. పచ్చని రంగులో ఉన్న బొప్పాయిలు ఎక్కువసార్లు పూర్తిగా పండవు. ఈ చిన్నచిన్న సూచనలతోనే మనం సరైన, రుచికరమైన పండ్లను ఎంచుకోవచ్చు. పైగా మార్కెట్‌కి వెళ్లే ప్రతిసారీ కాస్తంత గమనికతో చూస్తే డబ్బు కూడా వృథా కాదు. ముఖ్యంగా వేసవిలో మంచి నీటి శాతం ఉన్న పండ్లు తినడం శరీరాన్ని హైడ్రేట్ చేసి, వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: టాయిలెట్లలో డ్యూయల్‌ ఫ్లష్‌లు ఎందుకు ఉంటాయి?

home-tips | home tips in telugu | latest-news | telugu-news )

Advertisment
Advertisment
Advertisment