CM Revanth Reddy New Team: సీఎం రేవంత్ రెడ్డి కొత్త టీమ్ లిస్ట్ ఇదే.. ఐటీ హెడ్ ఎవరో తెలుసా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సీఎంవో కొత్త టీమ్ మీద ఫోకస్ పెట్టారు. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ పాలనలో కీలకస్థానాల్లో ఉన్న ఐఎఎస్, ఐపీఎస్ అధికారులను మారుస్తూ, నిజాయితీగా, సమర్ధంగా పనిచేసే అధికారులను కీలక స్థానాల్లో నియమిస్తున్నారు.

New Update
BIG BREAKING:  రేవంత్ సంచలన నిర్ణయం.. మేడిగడ్డ, అన్నారంపై విచారణ

సీఎం ఆఫీసులో పని చేసే అధికారుల ఎంపిక మీద రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా త్వరలోనే ఐఏఎస్, ఐపీఎస్ ల బదీలీలు జరిగే అవకాశం ఉందని తెలస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లో మూడు కమిషనరేట్ల పరిధిలోని కమీషనర్లు బదిలీ అయ్యారు. దీని తర్వాత శాఖల సమీక్షలు పూర్తికాగానే బదిలీలు ఉంటాయని...పలువురు అధికారుల జాబితా కూడా సిద్ధమైందని చెబుతున్నారు. ఒకే స్థానంలో ఏళ్ళ తరబడి పనిచేస్తున్న అధికారులకు స్థాన చలనం ఉంటుందని అంటున్నారు.

Also Read:తెలంగాణ తొలి దళిత స్పీకర్ గా గడ్డం ప్రసాదరావు…బ్యాక్ గ్రౌండ్ ఇదే.

సీఎంవో కొత్త టీమ్ లో మొదటగా చెప్పుకోవాల్సిన ఆఫీసర్ ఐఏఎస్ ఆమ్రపాలి. ఇప్పటివరకు పీఎమ్వోలో పనిచేసిన ఈమె రేవంత్ రెడ్డి టీమ్ లో జాయిన్ కానున్నారని చర్చ జరుగుతోంది. ఆమ్రపాలి పీఎంవో పదవీ కాలం అక్టోబర్ తో ముగిసింది. దీంతో ఈమె తిరిగి తెలంగాణకు వచ్చేశారు. వచ్చిన వెంటనే కొత్త సీఎం రేవంత్ ను కలవడంతో ఈమె కచ్చితంగా సీఎంవో టీమ్ లో జాయిన్ అవుతారని చెబుతున్నారు.

టీమ్‌ను ఎంపిక చేసుకోవటంలో రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన తీరును అనుసరిస్తున్నారు. ఇన్నిరోజులు ప్రధాన్యతలేని పోస్టుల్లో కొనసాగుతున్న నిజాయితీగల ఆఫీసర్లను.. నిరాదరణకు గురైన సమర్థులను వెతికి మరీ వారికి అవకాశం కల్పిస్తున్నారు. సిన్సియారిటీకి పెద్దపీఠ వేస్తున్నారు. కొత్త ముఖాలను తెరపైకి తీసుకొస్తున్నారు. ప్రాధాన్యత గల పోస్టులను కట్టబెడుతున్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌లు, పీఆర్వోలు, తన వ్యక్తిగత సిబ్బంది విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ రేవంత్ రెడ్డి ఎంపిక చేస్తున్నారు. మినీ సెక్రటేరియట్‌గా ఉండే ముఖ్యమంత్రి కార్యాలయానికి సీఎం రోజువారీ వ్యవహారాలను నిర్వహించడానికి ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ, ముగ్గురు సెక్రటరీ స్థాయి అధికారులు అవసరం.ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ సెక్రటరీగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వి.శేషాద్రిని నియమిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మేరకు ఉత్తర్వులు వెలువడలేదు. మరోవైపు ముఖ్యమంత్రి కార్యదర్శిగా షానవాజ్ ఖాసింను నియమించారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ను సీమ్వో సెక్రటరీగా నియమించడం ఇదే మొదటిసారి.

వీరితో పాటూ 2003 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ లోకేష్ కుమార్ ను కూడా సీమ్వో టీమ్ లోకి తీసుకురానున్నరని వార్తలు వస్తున్నాయి. ఈయన ప్రస్తుతం ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా అడిషనల్ సీఈవో గా పని చేస్తున్నారు. అక్కడ రిలీవ్ ఇవ్వగానే ఇక్కడకు వచ్చి లోకేష్ జాయిన్ అవుతారని చెబుతున్నారు. అంతకు ముందు లోకేష్ జీహెచ్ఎంసీ కమీషనర్గా నాలుగు ఏళ్ళు పని చేశారు.

వీరి తర్వాత బీసీ వెల్ఫేర్ సెక్రటరీ బుర్రా వెంకటేశాన్ని సీమ్వో ఆఫీసర్ గా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ స్వెర్జ్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ దానా కిశోర్ ను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీగా నియమించే యోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న అరవింద్ కుమార్ ను బదిలీ చేస్తారని చెబుతున్నారు. మరోవైపు 1992 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ జాజును ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ఆఫీసర్ గా నియమించనున్నారు. ప్రస్తుతం ఈ పదవిలో జయేష్ రాజన్ ఉన్నారు. ఇక స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ అయిన కె. రామారావును మాత్రం కొన్నాళ్ళ పాటూ కంటిన్యూ చేయనున్నారు. మూడు నెలల తర్వాత వచ్చే తెలంగాణ స్టేట్ బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టేంతవరకు ఈయన ఉంటారని చెబుతున్నారు. దాని తర్వాత రెవెన్యూ డిపార్ట్ మెంట్లో కీలక పదవికి రామారావు వెళతారని సమాచారం. ఇక చివరగా దాసరి రవి చందన కమర్షియల్ టాక్సస్ కమీషనర్ గా గాని, హెల్స్ డిపార్ట్ మెంట్ డైరెక్టర్ గా గాని నియమిస్తారని తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News Updates: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు ఇచ్చిన చెన్నమనేని రమేష్

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
Live News Updates in Telugu

Live News Updates in Telugu

🔴Live News Updates: 

Telangana: తెలంగాణలో ద్రోణి ప్రభావం... మరో 2 రోజులు వానలు.. పిడుగులు!

తెలంగాణలో రాగల రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నల్గొండ,వరంగల్‌ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

Rains
Rains

 

తెలంగాణలో మరో రెండు రోజులు వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం,మంగళవారం ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం ఏప్రిల్ 20 సాయంత్రం హైదరాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 

Also Read:  Zelensky: చెప్పుకోవడానికే కాల్పుల విరమణ..దాడులు మాత్రం ఆగడం లేదు!

గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్,యాదాద్రి భువనగిరి, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ,  రంగారెడ్డి,  సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో కూడా పలు చోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ హైదరాబాద్ శాఖ తెలిపింది.

Also Read: మహిళా కమిషన్ లాగే.. పురుషులకు ప్రత్యేక కమిషన్ కావాలని డిమాండ్

ఇక ఈరోజు సోమవారం కూడా తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా నల్లగొండ, వరంగల్‌, సూర్యాపేట, మహబూబాబాద్,  జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా బలమైన ఈదురు గాలులు, పిడుగుల సమయంలో సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఇదిలా ఉంటే.. మరోవైపు కొన్ని జిల్లాల్లో సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కాగా  ఆదిలాబాద్‌లో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా 2- 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Also Read: Pavani Reddy : మొదటి భర్త ఆత్మహత్య.. రెండో పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ!

Also Read: Prakasam: క్రికెట్ గ్రౌండ్‌లో పిడుగుపాటు.. చెట్టుకిందికెళ్లిన ఇద్దరు బాలురు మృతి

  • Apr 21, 2025 16:38 IST

    ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు ఇచ్చిన చెన్నమనేని రమేష్

    చెన్నమనేని రమేష్ వారసత్వ కేసులో తెలంగాణ హైకోర్ట తీర్పు ప్రకారం అతను ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షల డీడీ ఇచ్చారు. తప్పుడు పత్రాలు సమర్పించి ఆది శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే కాకుండా అడ్డుకున్నట్లు 2024 డిసెంబర్‌లో హైకోర్టు తేల్చి చెప్పింది.



  • Apr 21, 2025 14:49 IST

    మెంటల్ టార్చర్, బాడీ షేమింగ్ చేశారు.. కీరవాణి పై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు!

    'పాడుతా తీయగా' సింగర్ ప్రవస్తి కీరవాణి, సునీత, చంద్రబోస్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు జడ్జీ సీట్లో కూర్చొని అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను మానసికంగా హింసించారని, బాడీ షేమింగ్ చేశారని ఆరోపించారు.

    Antha Ramamayam Song | Pravasthi Performance | Padutha Theeyaga | Season - 25 | 7th April 2025



  • Apr 21, 2025 14:47 IST

    మెదక్‌లో మరో విషాదం.. ఇద్దరు పిల్లలతో కలిసి వాగులో దూకిన తల్లి!

    మెదక్‌ జిల్లా తూప్రాన్‌లో హల్దీవాగు దగ్గర విషాద ఘటన చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపానికి గురైన మమత అనే తల్లి, తన ఇద్దరు చిన్నారులతో కలిసి వాగులో దూకింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మమతను స్థానికులు కాపాడారు.

     



  • Apr 21, 2025 14:04 IST

    Pope Fransis: పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత

    పోప్ ఫ్రాన్సిస్ (88) కన్నుమూశారు. కొద్దిరోజులుగా శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్న పోప్‌ సోమవారం ఉదయం 7.35 గంటలకు పోప్‌ తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఈస్టర్ వేడుక జరగగా మరుసటి రోజే ఆయన తుదిశ్వాస విడిచారు. 

    Pop Fransis
    Pop Fransis

     



  • Apr 21, 2025 10:40 IST

    IT Employees Accident: మరణంలోనూ వీడని స్నేహం.. ఇద్దరు ఐటీ ఉద్యోగుల దుర్మరణం!

    హైదరాబాద్‌ రింగురోడ్డుపై విషాదం చోటుచేసుకుంది. చిరకాల మిత్రులు ఒకేసారి రోడ్డు ప్రమాదంలో మరణించడం అందరినీ కలిచివేస్తోంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఒడిశాకు చెందిన భానుప్రకాశ్‌, బిశ్వాల్‌ ప్రయాణిస్తున్న కారు పల్టీలు కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు.

    hyde acdnt
    hyde acdnt Photograph: (hyde acdnt)

     



  • Apr 21, 2025 10:39 IST

    Crime news: బావ ఆస్తిపై కన్నేసిన బావమరిది.. ఏకంగా అక్కతో కలిసి మర్డర్ స్కెచ్!

    బావ ఆస్తిపై కన్నేసిన బావమరిది దారుణానికి పాల్పడ్డాడు. రైల్వే ఉద్యోగి అయిన బావను లేపేసి అక్కకు ఉద్యోగం ఇప్పించి, తాను ఆస్తిలో షేర్ తీసుకోవాలని కుట్ర చేశాడు. కానీ బిహార్‌ కు చెందిన బాధితుడు సుమిత్‌ కుమార్‌ ఫోన్ రికార్డుల ఆధారంగా వారిపై కేసు పెట్టాడు.

    Sangareddy crime

     



  • Apr 21, 2025 07:01 IST

    విషాదం.. పిడుగుపాటుకు ఒకే రోజు స్పాట్‌లోనే ఐదుగురు..?

    రాష్ట్రంలో వేర్వేరు జిల్లాల్లో ఒకే రోజు ఐదుగురు పిడుగు పాటుతో మృతి చెందారు. క్రికెట్ ఆడుతుండగా ప్రకాశంలో ఇద్దరు, కర్నూలులో ఇద్దరు, కడపలో ఒకరు మృతి చెందారు. వేర్వేరు జిల్లాల్లో పిడుగు పాటు వల్ల ఒకే రోజు మృతి చెందారు.

    Thunderbolt
    Thunderbolt

     



  • Apr 21, 2025 07:00 IST

    Israel: సైన్యం తప్పు వల్లే ఆ మరణాలు.!

    గాజాలో ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 14 మంది పాలస్తీనా అత్యవసర సేవల సిబ్బందితో పాటు ఓ ఐరాస ఉద్యోగి మృతి చెందారు.ఈ ఘటనలో సైన్యానికి సంబంధించి వృత్తి పరమైన వైఫల్యాలు చోటు చేసుకున్నట్లు తేలింది.ఈ క్రమంలోనే ఓ డిప్యూటీ కమాండర్ పై సైన్యం వేటు వేసింది.

    israel
    Attacks On Gaza

     



Advertisment
Advertisment
Advertisment