YSR Sunna Vaddi : కోనసీమలో జగన్‌ పర్యటన..సున్నా వడ్డీ పథకం నిధుల విడుదల!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నేడు డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. అమలాపురం లోని జనుపల్లిలో ఆయన పర్యటిస్తారు.ఆయన తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయల్దేరి అమలాపురంలోని పోలీస్‌ గ్రౌండ్స్‌కు సీఎం జగన్‌ చేరుకుంటారు.

New Update
YSR Sunna Vaddi : కోనసీమలో జగన్‌ పర్యటన..సున్నా వడ్డీ పథకం నిధుల విడుదల!

YSR Sunna Vaddi Shceme : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (YS Jagan) డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా విచ్చేశారు. ఈ సందర్భంగా అమలాపురం జిల్లా  జనుపల్లి  గ్రామంలో ఏర్పాటయిన బహిరంగ  సభలో ఆయన ప్రసంగించారు.  తొలుత తాడేపల్లిలోని ఆయన నివాసం నుంచి బయల్దేరి అమలాపురంలోని పోలీస్‌ గ్రౌండ్స్‌కు సీఎం జగన్‌ చేరుకున్నారు.  నాలుగో విడత వైఎస్సాఆర్‌ సున్నా వడ్డీ పథకం (YSR Sunna Vaddi Scheme) కింద పొదుపు మహిళల ఖాతాల్లోకి వడ్డీ డబ్బును జగన్ బటన్‌ నొక్కి విడుదల చేస్తారు.

ముఖ్యమంత్రి రాష్ట్ర  వ్యాప్తంగా అర్హత ఉన్న 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05,13,365 మంది మహిళలు బ్యాంకులకు చెల్లించిన రూ.1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్‌ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు.

ఈరోజు విడుదల చేసే రూ.1,353.76 కోట్లతో కలిపి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద ఇప్పటివరకు మొత్తం సాయం రూ.4,969.05 కోట్లకు చేరుతుంది. పేద మహిళలకు సాధికారత కల్పిస్తూ వారు చేస్తున్న వ్యాపారాలకు మరింత చేయూతనిచ్చేలా వారికి సున్నా వడ్డీకే రుణాలు అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

బ్యాంకు రుణాలు సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని మహిళల మీద వడ్డీ భారం పడకుండా వారి తరపున ఆ భారాన్నీ వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద నేరుగా పొదుపు సంఘాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తోంది.

Also Read: హస్తినకు వైఎస్ షర్మిల..ఈ రోజు ఖర్గేతో భేటీ..విలీనం పై రానున్న క్లారిటీ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

తిరుమలలో నిలువు దోపిడీ.. తలనీలాలకు రూ.100.. వీడియో ఇదిగో!

తిరుమలలో శ్రీవారికి కొందరు తలనీలాలు సమర్పించే దగ్గర ఎలాంటి డబ్బులు కూడా తీసుకోరు. అంతా ఉచితమే. కానీ కొందరు క్షురకులు తిరుమల కళ్యాణకట్టలో భక్తుల నుంచి లంచం తీసుకుంటున్న వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

New Update
Tirumala kalyana katta

Tirumala kalyana katta

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏడాది అంతా భక్తులు వెళ్తుంటారు. ఏ సమయంలో వెళ్లినా కూడా భక్తులతో తిరుమల కలకలలాడుతుంది. అయితే శ్రీవారికి కొందరు తలనీలాలు సమర్పిస్తారు. తలనీలాలు సమర్పించే దగ్గర ఎలాంటి డబ్బులు కూడా తీసుకోరు. అంతా ఉచితమే. కానీ కొందరు క్షురకులు మాత్రం భక్తుల నుంచి లంచం తీసుకుంటున్నారు.

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

ఇది కూడా చూడండి: Holiday Culture: హాలీడే కల్చర్‌ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్ల

ఓ నెటిజన్ వీడియో తీసి..

తిరుమల కళ్యాణకట్టలో భక్తుల నుంచి లంచం తీసుకుంటున్న వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. టీటీడీ దయచేసి దీనిపై దృష్టి పెట్టండని తెలిపారు. భక్తులు ఇష్టపూర్వకంగా డబ్బు ఇస్తే సమస్య కాదని.. భక్తులు కార్మికులకు ఎల్లప్పుడూ కూడా మద్దతు ఇస్తారని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

ఇదిలా ఉండగా.. పిల్లలకు వేసవి సెలవులు ఇవ్వడంతో చాలామంది దైవదర్శనానికి ప్రాధాన్యత ఇస్తున్నారు.ఎక్కువమంద తిరుమలను దర్శించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎక్కువమంది బస్‌లు, ట్రైన్‌లలో వెళ్తున్నప్పటికీ తిరుమతితో పాటు ఇతర ప్రాంతాలను దర్శించుకోవాలనుకునేవారు కార్లలో వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇది కూడా చూడండి: శవం ముందు పెళ్లి డ్యాన్సులు.. డీజే పాటలకు చిందేసిన ఆడ, మగ - వీడియో చూశారా?

వేసవికాలం కావడంతో కార్లలో వెళ్లే వారు జాగ్రత్తలు తీసుకోవాలని తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు సూచిస్తున్నారు.  ఇటీవల ఎండాకాలం లో తిరుమలకి వస్తున్న రెండు కార్లు దగ్ధం అయ్యాయి, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ రెండు కార్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఈ విధంగా కార్లు దగ్ధం అవడానికి పలు కారణాలున్నాయి. కాబట్టి తమ సూచనలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ కోరారు.

Advertisment
Advertisment
Advertisment