Crime News : దారుణం.. లెక్చరర్ను కత్తితో పొడిచి చంపిన స్టూడెంట్.. అస్సోంలో కెమిస్ట్రీ పాఠాలు చెప్పే ఓ లెక్చరర్.. ఓ విద్యార్థి సరిగా చదవడం లేదని అతని తల్లిదండ్రులను పిలుచుకురమ్మనాడు. విద్యార్థి పేరెంట్స్ను తీసుకురాకపోవడంతో అతడిని క్లాస్ నుంచి వెళ్లిపొమ్మన్నాడు. దీంతో ఆ విద్యార్థి.. లెక్చరర్ను కత్తితో పొడిచి చంపాడు. By B Aravind 07 Jul 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Assam School : అస్సోం (Assam) లో దారుణం జరిగింది. ఓ విద్యార్థి (Student) ఏకంగా పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడిని (Teacher) కత్తితో పొడిచి చంపడం కలకలం రేపింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. శివసాగర్ జిల్లాలో రాజేష్ బారువా (55) అనే వ్యక్తి కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తున్నారు. శుక్రవారం ఎప్పటిలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు తరగతి గదికి వచ్చారు. ఆ తర్వాత ఓ విద్యార్థిని.. సరిగా చదవడం లేదని, మీ తల్లిదండ్రులను పిలుచుకొని రావాలంటూ మందలించాడు. Also read: ఉత్తరాఖండ్ను ముంచెత్తుతున్న వరదలు.. చార్ధామ్ యాత్ర నిలిపివేత మరుసటి రోజున ఆ విద్యార్థి సివిల్ డ్రెస్తో తరగతి గదికి వచ్చాడు. పాఠం చెప్పెందుకు క్లాస్కు వచ్చిన రాజేష్ బారవా ఆ విద్యార్థిని లేపి.. మీ పేరెంట్స్ను తీసుకొచ్చావా అని అడిగాడు. ఆ విద్యార్థి సమాధానం చెప్పకపోవడంతో క్లాస్ నుంచి వెళ్లిపో అంటూ గట్టిగా అరిచాడు. దీంతో అప్పటికే పక్కా ప్లాన్తో క్లాస్కు వచ్చిన ఆ విద్యార్థి తన వద్ద ఉన్న కత్తితో లెక్చరర్ రాజేష్పై దాడి చేశాడు. తలపై తీవ్రంగా పొడిచి అక్కడినుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలపాలైన రాజేష్ను అక్కడున్న సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో పోలీసులు కేసు (Police Case) నమోదు చేసి విచారణ ప్రారంభించారు. Also Read: భూమిని తాకనున్నభారీ ఉల్క..హెచ్చరించిన ఇస్రో! #telugu-news #assam-school #national-news #teacher సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి