Trisha : నా కొడుకు చనిపోయాడు.. త్రిష షాకింగ్ పోస్ట్, నెట్టింట వైరల్

హీరోయిన్ త్రిష తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందులో తన పెంపుడు కుక్క జోరో మృతిచెందినట్లు వెల్లడించింది. గత 12 ఏళ్లుగా తనతో కలిసి ఉన్న జోరో ఈ క్రిస్మస్ ఉదయం చివరి శ్వాస విడిచింది. ఈ షాక్‌ నుంచి కోలుకోవడానికి నాకు కొంత సమయం పడుతుందని పేర్కొంది.

New Update
trisha emotional post

trisha emotional post

కోలీవుడ్ బ్యూటీ త్రిష తాజాగా చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ నెటిజన్లను కదిలిస్తోంది. ఆ పోస్ట్‌లో తన పెంపుడు కుక్క జోరో మృతిచెందినట్లు వెల్లడించింది. గత 12 ఏళ్లుగా తనతో కలిసి ఉన్న జోరో ఈ క్రిస్మస్ ఉదయం చివరి శ్వాస విడిచింది.

త్రిష జోరోను తన కంటికి రెప్పలా చూసుకుని, కన్నబిడ్డలా ప్రేమించింది. కానీ దురదృష్టవశాత్తూ, జోరో ఇక లేడన్న వార్త ఆమెను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషయాన్ని త్రిష ఎక్స్ వేదికగా పంచుకుంటూ తన బాధను వ్యక్తం చేసింది.

Also Read: యూపీలో దారుణం..పుట్టినరోజని పిలిచి బట్టలిప్పించి..మూత్రం తాగించారు

బాధలో ఉన్నాం..

ఈ మేరకు పోస్ట్‌లో," క్రిస్మస్ రోజు తెల్లవారుజామున నా ప్రియమైన జోరో కన్నుమూశాడు. నా జీవితంలో జోరో స్థానాన్ని తెలిసిన వారందరికీ ఇది ఎంతగానో అర్థమవుతుంది. జోరో లేకపోతే నా జీవితం శూన్యం. నేను, నా కుటుంబం ఈ సమయంలో తీవ్ర దుఃఖంలో ఉన్నాము. ఈ షాక్ నుంచి కోలుకోవడానికి కొంత సమయం అవసరం. అందువల్ల సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుంటున్నాను. కొన్ని రోజులు అందుబాటులో ఉండను," అంటూ పేర్కొంది. అలాగే తన పెంపుడు కుక్క జోరో ఫోటోలను సైతం షేర్ చేసింది. దీంతో త్రిష పెట్టిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

త్రిష సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మెగాస్టార్ తో కలిసి 'విశ్వంభర' కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తో విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ.. కమల్ హాసన్ తో థగ్ లైఫ్ సినిమాలు చేస్తోంది. వీటిలో 'విదాముయార్చి' త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: త్వరలో ఢిల్లీ సీఎం అరెస్ట్.. కేజ్రీవాల్ సంచలన ప్రకటన!

#telugu-movie-news #telugu-film-news #telugunews #actress-trisha #latest-news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Arjun Son Of Vyjayanthi Trailer: కల్యాణ్‌రామ్‌ ‘అర...

Arjun Son Of Vyjayanthi Trailer: కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

కళ్యాణ్ రామ్ కొత్త సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ అత్యంత ఉత్కంఠభరింతగా ఉంది. యాక్షన్, రొమాన్స్, సాంగ్స్ ఇలా ప్రతి విషయంలోనూ కట్ చేసిన ట్రైలర్ అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరిస్తుంది.

New Update
Arjun Son Of Vyjayanthi Trailer | Nandamuri Kalyan Ram | Vijayashanti

Arjun Son Of Vyjayanthi Trailer | Nandamuri Kalyan Ram

నందమూరి కల్యాణ్‌రామ్‌, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన కొత్త సినిమా ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’. సయీ మంజ్రేకర్‌ ఇందులో హీరోయిన్‌‌గా నటిస్తోంది. కొత్త దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో మేకర్స్ అదిరిపోయే సర్ ప్రైజ్ అందించారు.

ట్రైలర్ అదుర్స్

ఇవాళ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో భాగంగా ట్రైలర్‌ విడుదల చేశారు. ఫుల్ యాక్షన్‌ సన్నివేశాలతో ఈ ట్రైలర్ అదిరిపోయింది. టైటిల్‌కు తగ్గట్లుగా తల్లీకొడుకుల అనుబంధానికి ఎంతో ప్రాధాన్యమున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రైలర్ చూసి ఎంజాయ్ చేయండి. 

(Arjun Son Of Vyjayanthi)

Advertisment
Advertisment
Advertisment