Kanguva: జెట్ స్పీడ్‌లో OTTలోకి వచ్చేస్తున్న ‘కంగువ’.. ఎప్పుడంటే?

సూర్య నటించిన కంగువ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియోలో డిసెంబర్ 13 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం త్వరలో వెల్లడి కానుంది.

New Update
kanguva.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం ‘కంగువ’. దర్శకుడు శివ తెరకెక్కించిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ కలిసి నిర్మించిన ఈ సినిమా నవంబర్ 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. కానీ అందరి అంచనాలను ఈ సినిమా తలకిందులు చేసింది. 

ఇది కూడా చదవండి: తప్పు జరిగింది.. పొరపాటైంది: లగచర్ల మహాధర్నాలో కేటీఆర్

ఎన్నో అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ షో నుంచే మిక్స్‌డ్ టాక్ అందుకుంది. ఈ సినిమా మొత్తం సూర్య వన్ మెన్ షోగా నడిచిందని.. ఏ ఒక్కరి క్యారెక్టర్‌తోనూ ఎమోషన్‌ను కనెక్ట్ కాలేదని కొందరు చెప్పుకొచ్చారు. అదే సినిమాకు అతి పెద్ద మైనస్‌గా తెలిపారు. 

రూ.350 కోట్ల బడ్జెట్‌

ఇక ఫస్ట్ డే నుంచే సినిమాపై రకరకాల కామెంట్స్ వినిపించడంతో కలెక్షన్లపై భారీగా దెబ్బపడింది. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిడంతో నిర్మాతలకు గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా థియేటర్లలో పెద్దగా ఆడకపోవడంతో ఓటీటీ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. 

Also Read: మీ దగ్గర బిట్ కాయిన్ ఉందా... అయితే మీరు కోటీశ్వరులైనట్లే..

తాజా సమాచారం ప్రకారం.. కంగువ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రైమ్ వీడియో అధిక ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో మూవీ రిలీజ్ అయిన ఆరు-ఎనిమిది వారాల్లోపు స్ట్రీమింగ్ చేయనున్నట్లు ముందుగా టాక్ వచ్చింది. 

అనుకున్న దానికంటే ముందుగానే

అయితే ఇప్పుడు మరో వార్త వినిపిస్తోంది. అనుకున్న దానికంటే మరింత ముందుగానే కంగువ ఓటీటీలోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని వీలైనంత తొందరగా ఓటీటీలోకి తీసుకొచ్చేందుకు ప్రైమ్ వీడియో సన్నాహాలు చేస్తుంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. కంగువ డిసెంబర్ 13న స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం త్వరలో వెల్లడి కానుంది. 

Also Read  : ల్యాండ్‌మైన్స్‌ ఉత్పత్తిపై నిషేధం.. ఐరాస చీఫ్‌ కీలక ప్రకటన!

Also Read :  జెట్ స్పీడ్‌లో OTTలోకి వచ్చేస్తున్న ‘కంగువ’.. ఎప్పుడంటే?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment