మహేష్ బాబు ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్.. SSMB29 రెండు పార్ట్స్ కాదు.. ఎన్నంటే!

'SSMB 29' రెండు భాగాలుగా రాబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే తాజా నివేదికల ప్రకారం.. రాజమౌళి ఈ పుకార్లను తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. 'SSMB 29' ఒకే పార్ట్ లో అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

New Update
SSMB29 Movie Updates

SSMB29 Movie Updates Photograph: (SSMB29 Movie Updates)

SSMB29: దర్శకుడు రాజమౌళి  'బాహుబలి' సినిమాతో ఒకే కథను రెండు భాగాలుగా చెప్పే ట్రెండ్ ప్రారంభించారు. అయితే ఇప్పుడు  మహేష్ బాబు 'SSMB 29' కూడా అదే ఫార్మాట్ లో ఉండబోతున్నట్లు పుకార్లు వస్తున్నాయి. ఈ సినిమా కూడా జక్కన్న రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు గత కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. 

ఒకే పార్ట్ లో 

అయితే తాజా నివేదికల ప్రకారం.. రాజమౌళి ఈ పుకార్లను తోసిపుచ్చినట్లు తెలుస్తోంది.  రెండు భాగాలుగా కాకుండా 'SSMB 29' కథను ఒకే పార్ట్ లో చెప్పాలని అనుకుంటున్నారట. అయితే చాలా మంది చిత్రనిర్మాతలు అనవసరంగా.. ఆర్ధిక లాభం కోసం కంటెంట్‌ను సాగదీస్తున్నారనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 'SSMB 29' లాంటి గ్రాండ్ స్కెల్ చిత్రాన్ని ఒకే పార్ట్ లో అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారట రాజమౌళి. RRR మాదిరిగానే ఇది కూడా 3 గంటల 30 నిమిషాల రన్‌టైమ్ కలిగి ఉంటుందని టాక్.

ఇదిలా ఉంటే 'ssmb29' కోసం మహేష్, రాజమౌళి టీమ్ తెగ కష్టపడుతున్నారు.  ప్రస్తుతం  ఒడిస్సాలోని కోరాపుట్ జిల్లాలో ఈ సినిమా తాజా షెడ్యూల్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీని కోసమే మహేశ్ బాబు హైదరాబాద్ నుంచి ఒడిస్సా బయలుదేరిన వీడియోలు ఇటీవలే తెగ వైరల్ అయ్యాయి. ఇక ఈమూవీలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది.  హాలీవుడ్ ఫిల్మ్ 'ఇండియానా జోన్స్ సిరీస్’ను పోలి ఉండేలా రాజమౌళి ఈ చిత్రాన్ని  రూపొందించనున్నట్లు తెలుస్తోంది. 

cinema-news | latest news telugu | Mahesh Babu SSMB 29 | rajamouli

Also Read: Viral News: తల్లికి, బిడ్డకు ఒకేసారి కడుపు చేసిన యూట్యూబర్.. నెట్టింట ఫొటోస్ షేర్ చేయడంతో రచ్చ రచ్చ!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Manchu Lakshmi - Manoj: అక్కా ఏడవకే.. మనోజ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి - VIDEO

ఫ్యామిలీ వివాదాలతో సతమతమవుతున్న తమ్ముడు మంచు మనోజ్‌ని ఓ ఫంక్షన్లో చూసి మంచు లక్ష్మి ఏడ్చేసింది. ఆమె స్టేజ్‌పై ఉన్న సమయంలో మనోజ్ దంపతులు వెళ్లారు. వారిని చూడగానే లక్ష్మి కంటనీరు పెట్టుకుని ఎమోషనల్ అయింది. పక్కనే ఉన్న మౌనిక అక్కా తమ్ముళ్ళను ఓదార్చింది.

New Update
manchu lakshmi gets emotional over seeing manchu manoj

manchu lakshmi gets emotional over seeing manchu manoj

అక్కా తమ్ముళ్ల బంధం ఎన్నటికీ వీడనిది.. విడదీయలేనిది. ఎన్ని గొడవలు జరిగినా.. తిరిగి మళ్లీ ఒక్కటి కావాల్సిందే. అదే మరోసారి నిజమైంది. మంచు ఫ్యామిలీలో  గత కొన్నాళ్లుగా వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా మంచు ఫ్యామిలీ గొడవలు చెలరేగాయి. పోలీస్ స్టేషన్ వరకు చేరుకున్నాయి. అక్కడితో ఆగలేదు. ఆఖరికి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు- మంచు మనోజ్ మరోవైపు. సినిమాను తలపించేలా వీరి వివాదం నడిచింది. ఇప్పటికీ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరుగుతున్నాయి. ఇది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఆ మధ్య వీరు ఒకరినొకరు తిట్టుకుని.. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు కాస్త సైలెంట్ అయ్యారు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

కానీ ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీలో చిచ్చు రాజుకుంది. మంచు మనోజ్ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తన కార్లను విష్ణు దొంగిలించాడంటూ తన తండ్రి మోహన్ బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. కూతురి పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లిన వెంటనే మంచు విష్ణు ఈ చోరీకి పాల్పడ్డాడని మనోజ్ ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఇదే రచ్చ కొనసాగుతోంది. 

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

ఇలా వరుస వివాదాలతో మంచు ఫ్యామిలీకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఈ వివాదాలపై నోరు విప్పేందుకు ఇష్టపడటం లేదు. అయితే మంచు లక్ష్మికి తమ్ముడు మనోజ్‌ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు నడుస్తున్నాయి. గతంలో ఆమె ముంబై నుంచి వచ్చి గొడవలను సరిచేయాలని చూసింది. కానీ ఆమె మాట ఎవరూ వినలేదని.. అక్కడ నుంచి వెంటనే మళ్లీ ఆమె వెళ్లిపోయిందని వార్తలు వినిపించాయి. 

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

అక్కా తమ్ముళ్ల అనుబంధం

ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి, తమ్ముడు మంచు మనోజ్ కలిసారు. ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే వార్షిక ఫండ్‌రైజర్ కార్యక్రమాన్ని మంచు లక్ష్మి ఏర్పాటు చేసింది. అందులో తన కూతురితో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. అదే సమయంలో మంచు లక్ష్మి స్టేజ్ మీద ఉండగానే.. వెనుక నుంచి మంచు మనోజ్ దంపతులు సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా తమ్ముడు మనోజ్‌ను చూసిన మంచు లక్ష్మీ మనసారా హత్తుకుని ఏడ్చేసింది. దీంతో పక్కనే ఉన్న మనోజ్ భర్య ఆమెను ఓదార్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధం విడదీయలేనిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

(manchu-manoj | manchu lakshmi | manchu family | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment