singer kalpana: పోలీసుల అదుపులో సింగర్ కల్పన భర్త ప్రసాద్‌

సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం సంచలనంగా మారింది. ఆమె బలవన్మరణానికి కారణమేంటని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె భర్త ప్రసాన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. రెండు రోజులుగా తాను ఇంట్లో లేనని భర్త ప్రసాద్ చెబుతున్నారు.

New Update
singer kalpana

singer kalpana Photograph: (singer kalpana )

ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మంగళవారం ఆమె నివాసంలో నిద్రమాత్రలు మింగి సూసైడ్ అట్మెంట్ చేశారు. వెంటనే ఆమెను నిజాం పేట్‌లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఐసీయూలో వెంటిలేటర్‌పై ఆమెకు చికిత్స అందిస్తున్నారు. కల్పన ఆత్మహత్నానికి గల కారణాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె భర్త ప్రసాద్‌ను పోలీసులు విచారిస్తున్నారు. రెండు రోజులుగా తాను ఇంట్లో లేనని భర్త ప్రసాద్ చెబుతున్నారు. పోలీసులు కల్పన, ఆమె భర్త ప్రసాద్ ఫోన్లను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సింగర్ కల్పన ప్రసాద్‌ను రెండో వివాహం చేసుకున్నారు. 

Also read : posani: దెబ్బ మీద దెబ్బ.. పోసానికి మరో కేసులో 14 రోజులు రిమాండ్

రెండు రోజులుగా బయటకు రాకుండా ఇంట్లోనే ఉన్న కల్పన మంగళవారం ఓవర్ డేస్ నిద్రమాత్రలు తీసుకున్నారు. ఫోన్ చేసిన ఆన్సర్ చేయడం లేదని, సీసీ కెమెరాలో పరిశీలించి భర్త ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంటికి వెళ్లి చూడగా.. కల్పన అపస్మారక స్థితిలో కనిపించారు. కల్పనను చూసేందుకు ఆమె భర్త చెన్నై నుంచి హాస్పిటల్‌కు చేరుకున్నారు. వారి మధ్య ఎలాంటి వివాదాలు లేవని.. సంతోషంగా ఉంటున్నామని పోలీసులకు తెలిపారు. కావాలనే నిద్రమాత్రలు అధికంగా తీసుకున్నారా? లేక అనుకోకుండా ఓవర్ డోస్ అయ్యిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి పక్కవారు కల్పన బయటకు రావడం లేదని చెప్పడానికి ఆమె భర్తకు ఫోన్ చేశారు. ఆ సమయంలో ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సింగర్ సునీతా, శ్రీకృష్ణాలతోపాటు ఆమె అభిమానులు హాస్పిటల్‌కు చేరుకున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Puri Jagannadh: పూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!

టాలీవుడ్ కు మరో క్రేజీ కాంబో సెట్ అయ్యింది. తాజా సమాచారం ప్రకారం సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ ఇటీవలే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి కథ చెప్పారని తెలుస్తోంది. స్క్రిప్ట్ విన్న వెంటనే విజయ్ సేతుపతి కూడా ఓకే చేసేసారట. అధికారిక ప్రకటన త్వరలో రానుంది.

New Update
Puri Jagannadh- vijay sethupathi

Puri Jagannadh- vijay sethupathi

Puri Jagannadh: టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబోలో మూవీ రాబోతోంది. తాజా సమాచారం ప్రకారం సంచలన దర్శకుడు పూరి జగన్నాథ్ ఇటీవలే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi)కి కథ చెప్పారని తెలుస్తోంది. స్క్రిప్ట్ విన్న వెంటనే విజయ్ సేతుపతి కూడా ఓకే చేసేసారట.

స్క్రిప్ట్ బాగా నచ్చినందున విజయ్ సేతుపతి తన బిజీ షెడ్యూల్ పక్కన పెట్టి ప్రస్తుతం పూరి జగన్నాధ్ సినిమాకే ప్రాధాన్యత ఇచ్చాడని తెలుస్తోంది. పూరీ కూడా కేవలం విజయ్ సేతుపతిని దృష్టిలో పెట్టుకొని కథని సిద్ధం చేశారట. అందుకు సంబందించిన పూర్తి అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. అన్ని కుదిరి ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయితే మాత్రం పూరీ ఖాతాలో ఈసారి పక్కా హిట్ పడ్డట్టే.

Also Read: IPL 2025: రోహిత్ శర్మ కెప్టెన్సీపై పంజాబ్ కింగ్స్ బ్యాటర్ షాకింగ్ కామెంట్స్.. తన కోరిక అదేనంటూ!

పూరీ కమ్ బ్యాక్ మూవీ..

ఈ సినిమా పూరీ కి కమ్ బ్యాక్ మూవీ అవుతుందని ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. పూరీ గత సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా  కొట్టిన సంగతి తెలిసిందే. విజయ్ సేతుపతితో  హిట్ కొట్టాలని పూరీ ఎదురుచూస్తున్నాడు. అయితే విజయ్ సేతుపతి చివరగా వెట్రిమారన్ డైరెక్షన్ లో పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ విడుదల పార్ట్ 2 లో కనిపించి మెప్పించాడు.

Also Read: Tulsi Gabbard: భారత్ లో ఉంటే ఇంట్లో ఉన్నట్లే ఉంటుంది

Advertisment
Advertisment
Advertisment