Shweta Basu: తెలుగు సెట్ లో నాకు పదే పదే అది చెబుతూ వేధింపులు .. శ్వేతా బసు సంచలనం

నటి శ్వేతా బసు ప్రసాద్ తెలుగు సినిమా సెట్ లో తన హైట్ కారణంగా వేధింపులకు గురైట్లు తెలిపింది. ఓ సినిమా చిత్రీకరణ సమయంలో ఆమె సహనటుడు పొడవుగా ఉండడంతో.. చిత్ర బృందం తన ఎత్తు గురించి తరచూ మాట్లాడుతూ ఇబ్బంది పెట్టేవారని చెప్పింది.

New Update
Shweta Basu

Shweta Basu

నటి శ్వేతా బసు ప్రసాద్ (Shweta Basu Prasad) 2008లో కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో శ్వేతా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేసింది. రైడ్, కాస్కో, కలవర్ కింగ్, ప్రియుడు, జీనియస్  వంటి అనేక చిత్రాల్లో నటించింది. హిందీ , తమిళ్లో కూడా సినిమాలు చేసింది. చివరిగా 2022లో 'ఇండియన్ లాక్ డౌన్' అనే సీరీస్ లో కనిపించింది. 

Also Read: Chhaava Day 2 Collections: రెండు రోజుల్లోనే 100 కోట్ల దిశగా.. 'చావా' బాక్సాఫీస్ సంచలనం

తెలుగు సెట్ లో ఎగతాళి 

అయితే తాజాగా  బాలీవుడ్ బబుల్‌ అనే ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్వేతా తెలుగు సినిమా (Telugu Cinema) సెట్ లో తనకు జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది. తన హైట్ కారణంగా వేధింపులకు గురైనట్లు తెలిపింది. శ్వేతా మాట్లాడుతూ.. ఓ తెలుగు సినిమా చిత్రీకరణ సమయంలో మూవీ యూనిట్ అంతా ప్రతిరోజూ నా ఎత్తును గుర్తు చేసేవారు. ఎందుకంటే  హీరో నా కంటే చాలా  పొడవుగా ఉండేవాడు. దీంతో ప్రతి సీన్ మార్చేసేవాడు. రీటేక్‌లు ఇచ్చేవాడు. నాకు నియంత్రణ లేని ఒక దాని గురించి( హైట్) నన్ను పదేపదే అనేవారు. అది  జన్యుపరమైనది.. దానిని మేనేజ్ చేయలేము. నన్ను నిజంగా వేధించిన ఏకైక సెట్ అదే అంటూ తన అనుభవాన్ని పంచుకుంది. 

Also Read: Prabhas Salaar: ఇదిరా రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్.. 366 రోజులు ట్రెండింగ్‌లోనే ‘సలార్’

Also Read :  అప్పులే కారణమా? .. ఫ్యామిలీ మొత్తం సూసైడ్.. ముందుగా విషం ఇచ్చి..

శ్వేతా ప్రస్తుతం టీవీ షోలలో సందడి చేస్తూ బిజీగా ఉంది.  11 సంవత్సరాల వయసులో తన నటనా జీవితాన్ని  ప్రారంభించిన శ్వేతా 'మక్దీ ' అనే చిత్రంతో బాలనటిగా అవార్డును గెలుచుకుంది. ఆ గుర్తింపుతో టెలివిజన్ సీరీస్, సినిమాల్లో అవకాశాలు సంపాదించుకుంది. 2005లో ఇక్బాల్ చిత్రంలో ఖదీజా పాత్రకు ఉత్తమ సహాయ నటిగా 5వ కరాచీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం అవార్డును గెలుచుకుంది.

Also Read: Thandel Collections: ఇప్పుడు వేయండ్రా విజిల్స్.. నాగ చైతన్య ‘తండేల్’ కలెక్షన్స్ చూస్తే షాకై షేకైపోతారు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Manchu Lakshmi - Manoj: అక్కా ఏడవకే.. మనోజ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి - VIDEO

ఫ్యామిలీ వివాదాలతో సతమతమవుతున్న తమ్ముడు మంచు మనోజ్‌ని ఓ ఫంక్షన్లో చూసి మంచు లక్ష్మి ఏడ్చేసింది. ఆమె స్టేజ్‌పై ఉన్న సమయంలో మనోజ్ దంపతులు వెళ్లారు. వారిని చూడగానే లక్ష్మి కంటనీరు పెట్టుకుని ఎమోషనల్ అయింది. పక్కనే ఉన్న మౌనిక అక్కా తమ్ముళ్ళను ఓదార్చింది.

New Update
manchu lakshmi gets emotional over seeing manchu manoj

manchu lakshmi gets emotional over seeing manchu manoj

అక్కా తమ్ముళ్ల బంధం ఎన్నటికీ వీడనిది.. విడదీయలేనిది. ఎన్ని గొడవలు జరిగినా.. తిరిగి మళ్లీ ఒక్కటి కావాల్సిందే. అదే మరోసారి నిజమైంది. మంచు ఫ్యామిలీలో  గత కొన్నాళ్లుగా వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా మంచు ఫ్యామిలీ గొడవలు చెలరేగాయి. పోలీస్ స్టేషన్ వరకు చేరుకున్నాయి. అక్కడితో ఆగలేదు. ఆఖరికి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు- మంచు మనోజ్ మరోవైపు. సినిమాను తలపించేలా వీరి వివాదం నడిచింది. ఇప్పటికీ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరుగుతున్నాయి. ఇది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఆ మధ్య వీరు ఒకరినొకరు తిట్టుకుని.. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు కాస్త సైలెంట్ అయ్యారు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

కానీ ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీలో చిచ్చు రాజుకుంది. మంచు మనోజ్ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తన కార్లను విష్ణు దొంగిలించాడంటూ తన తండ్రి మోహన్ బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. కూతురి పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లిన వెంటనే మంచు విష్ణు ఈ చోరీకి పాల్పడ్డాడని మనోజ్ ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఇదే రచ్చ కొనసాగుతోంది. 

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

ఇలా వరుస వివాదాలతో మంచు ఫ్యామిలీకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఈ వివాదాలపై నోరు విప్పేందుకు ఇష్టపడటం లేదు. అయితే మంచు లక్ష్మికి తమ్ముడు మనోజ్‌ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు నడుస్తున్నాయి. గతంలో ఆమె ముంబై నుంచి వచ్చి గొడవలను సరిచేయాలని చూసింది. కానీ ఆమె మాట ఎవరూ వినలేదని.. అక్కడ నుంచి వెంటనే మళ్లీ ఆమె వెళ్లిపోయిందని వార్తలు వినిపించాయి. 

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

అక్కా తమ్ముళ్ల అనుబంధం

ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి, తమ్ముడు మంచు మనోజ్ కలిసారు. ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే వార్షిక ఫండ్‌రైజర్ కార్యక్రమాన్ని మంచు లక్ష్మి ఏర్పాటు చేసింది. అందులో తన కూతురితో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. అదే సమయంలో మంచు లక్ష్మి స్టేజ్ మీద ఉండగానే.. వెనుక నుంచి మంచు మనోజ్ దంపతులు సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా తమ్ముడు మనోజ్‌ను చూసిన మంచు లక్ష్మీ మనసారా హత్తుకుని ఏడ్చేసింది. దీంతో పక్కనే ఉన్న మనోజ్ భర్య ఆమెను ఓదార్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధం విడదీయలేనిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

(manchu-manoj | manchu lakshmi | manchu family | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment