నాగ వంశీకి షాక్.. సినిమా ఫ్లాప్ అయితే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తారా?

మూవీ టికెట్ల ధరలపై నిర్మాత నాగవంశీ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నలుగురున్న ఫ్యామిలీ రూ.1500లతో టికెట్ కొనలేరా? అని అన్నాడు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. అవే డబ్బులు పెట్టిచూస్తే సినిమా ఫ్లాప్ అయితే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తారా? అని ప్రశ్నించాడు.

New Update
Producer Naga Vamsi

టాలీవుడ్ ప్రముఖ అగ్ర నిర్మాతల్లో నాగ వంశీ ఒకరు. ఎన్నో చిత్రాలను నిర్మించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఓ వైపు చిన్న చిన్న హీరోలత సినిమాలు తీసి సూపర్ డూపర్ హిట్లు అందుకుంటున్నాడు. మరోవైపు ఎన్టీఆర్, మహేశ్ బాబు అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో సైతం సినిమాలు తీసి లాభాలు అందుకుంటున్నాడు. 

ఇటీవలే దేవర మూవీని నిర్మించాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కేవలం 16 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.500 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో నిర్మాతకు బాగా లాభాలు వచ్చాయి. ఇక ఈ మూవీ తర్వాత ప్రొడ్యుసర్ నాగ వంశీ ఇప్పుడు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ మూవీ నిర్మిస్తున్నాడు. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్యూలో నిర్మాత నాగ వంశీ పాల్గొన్నాడు.

Also Read :  కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి.. 90మందికి అస్వస్థత

ఒక సినిమాకి రూ.1500 పెట్టలేరా?

ఇందులో భాగంగానే దేవర కలెక్షన్స్‌తో పాటు ప్రస్తుత సినిమా టికెట్ల ధరలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అయితే అతడు సినిమా టికెట్లపై మాట్లాడిన మాటలు నెట్టింట చర్చనీయాంశం అయింది. ముందుగా దేవర ఫేక్ కలెక్షన్లపై మాట్లాడాడు. దేవర సినిమా ఎంత మేర కలెక్షన్స్ సాధించిందో అంత మేరకు రిపోర్ట్ చేశానని చెప్పాడు. ఒకవేళ అంత కలెక్షన్స్ వచ్చాయని మీడియా నమ్మకపోతే తన తప్పేంటని అన్నట్లు మాట్లాడాడు.

ఇక దీని తర్వాత టికెట్ రేట్ల విషయం గురించి మాట్లాడాడు. ఒక ఫ్యామిలీ ఒక సినిమాకి రూ.1500 కూడా పెట్టలేరా? అని మాట్లాడటంపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ‘‘ఒక ఫ్యామిలీలో నలుగు సినిమాకి వెళ్లారు. అందులో ఒక్కొక్కరు చొప్పున రూ.250 పెట్టి టికెట్ కొన్నారు. అంటే మొత్తం రూ.1000 అవుతుంది.

Also Read :  లవర్‌తో పారిపోయిన వివాహిత.. ఆత్మహత్య ప్లాన్.. ట్విస్టులే ట్విస్టులు!

ఫ్లాప్ అయితే టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తారా..?

అలాగే పాప్‌కార్న్, కూల్ డ్రింక్స్‌కు కలిపి రూ.500 అవుతుంది. మొత్తం రూ.1500 అవుతుంది. ఇంత తక్కువలో అమౌంట్‌తో మూడు గంటల ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడ వస్తుంది. ఆంధ్రలో కానీ, తెలంగాణలో కానీ యూఎస్‌లో కానీ అదే అమౌంట్‌కి మూడు గంటలు ఎంటర్‌టైన్ చేసే ఎలిమెంట్ మరొకటి లేదు’ అని చెప్పుకొచ్చారు. దీంతో చాలా మంది నెటిజన్లు నాగ వంశీ మాటలపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో కామెంట్లు కురిపిస్తున్నారు. ‘‘రూ.1500 తీసుకుని ఫ్లాప్ సినిమాలు తీసినప్పుడు మేము ఎంటర్టైన్ కానప్పుడు టికెట్ డబ్బులు రిటర్న్ ఇస్తారా..?’’ అని కామెంట్లు చేస్తున్నారు. 

Also Read :  ఏపీలో నేడు మద్యం దుకాణాలు కేటాయింపులు!

Also Read :  బంగాళాఖాతంలో అల్పపీడనం..4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Retro Pre Release: సూర్యా 'రెట్రో' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో.. ఎవరో తెలుసా?

సూర్యా నటించిన 'రెట్రో' సినిమా మే 1న విడుదలకు సిద్ధమవుతోంది. తమిళ్,తెలుగు వర్షన్లకు ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. విజయ్ దేవరకొండతో ప్రీ-రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా రానుండటం తో సినిమాపై హైప్ పెరిగిపోయింది.

New Update
Retro Pre Release

Retro Pre Release

Retro Pre Release: సూర్యా(Surya) హీరోగా నటించిన తాజా తమిళ చిత్రం 'రెట్రో', కార్తిక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) దర్శకత్వంలో రూపొందింది. మే 1న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రం ఇప్పటికే తమిళ ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అయితే తెలుగు వెర్షన్ విషయంలో మాత్రం అంతటి హైప్ కనిపించడం లేదు. ప్రత్యేకంగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్‌ను చూస్తే, ఇది చాలా యూనిక్‌గా ఉండటంతో మాస్ ఆడియెన్స్‌కు సరిగ్గా కనెక్ట్ కాలేకపోయింది. అందుకే ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేందుకు చిత్ర యూనిట్ గట్టి ప్రమోషన్లను ప్లాన్ చేస్తోంది.

Also Read: "హై అలర్ట్…!! మే మరింత వేడెక్కనుంది!" రాజాసాబ్ అప్‌డేట్ ఆన్‌ ది వే..!

చీఫ్ గెస్ట్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగ వంశీ విడుదల చేయబోతున్నారు. ప్రమోషన్‌లలో భాగంగా, ఏప్రిల్ 26న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ముఖ్య అతిథిగా హాజరవుతుండటం విశేషం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న 'కింగ్‌డమ్' అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

Also Read: లవర్‌తో బాగోదు.. అందుకే సీత పాత్ర రిజెక్ట్ చేశా : శ్రీనిధి

రెట్రో చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని U/A సర్టిఫికేట్ పొందింది. సినిమా రన్ టైం మొత్తం 168 నిమిషాలు, అంటే 2 గంటల 48 నిమిషాలు. పూజా హెగ్డే(Pooja Hegde) ఈ సినిమాలో సూర్యా సరసన కథానాయికగా కనిపించనుంది. అలాగే జయరామ్, నాసర్, ప్రకాష్ రాజ్, నందితా దాస్ వంటి ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించగా, సూర్యా తన భార్య జ్యోతికతో కలిసి తన సొంత బ్యానర్ అయిన 2D ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మించారు.

Also Read: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

ఈ చిత్రంలోని పాటలకు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రత్యేకంగా "కనీమా" పాటలో సూర్యా – పూజా హెగ్డేల డ్యాన్స్ స్టెప్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం ముందుగానే విడుదల చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రమోషన్లు సినిమాపై మరింత హైప్‌ను పెంచేసాయి.

మే 1న 'రెట్రో' థియేటర్లలో ఆకట్టుకోనుంది. యాక్షన్, రొమాన్స్, మ్యూజిక్ అన్నీ కలబోతగా ఉండే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సి ఉంది.

Advertisment
Advertisment
Advertisment