Pushpa-2: ‘పుష్ప2’ రిలీజ్ వేళ.. నాగబాబు ఆసక్తికర ట్వీట్

అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమాపై నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రతిసినిమా విజయం సాధించాలని..ప్రేక్షకులు అన్ని సినిమాలను చూసి ఆదరించాలని కోరుకుంటున్నామని అన్నారు. మెగా అభిమానులు, సినీ ప్రియులు సినిమాని ఈ స్ఫూర్తితో ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.

New Update
pushpa 2 (4)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప2’ సినిమా ఆగమేఘాలతో రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నాగబాబు ఆసక్తిక ట్వీట్ చేశారు. 24 క్రాఫ్ట్‌ల కష్టంతో, వందల మంది టెక్నీషన్ల శ్రమతో వేల‌ మందికి ఉపాధి కలిగించి, కోట్ల మందిని అలరించేదే సినిమా అని అన్నారు.

Also Read: నాగచైతన్య హల్దీ ఫంక్షన్ లో అఖిల్ ఏం చేశాడో చూడండి.. ఫొటో వైరల్!

నాగబాబు ఆసక్తికర ట్వీట్

‘‘సినిమా అంటే వందలాది మంది కష్టానికి ఫలితం దక్కుతుంది. సినీ పరిశ్రమలో వేల మంది పనిచేస్తున్నారు. మనమంతా పరిశ్రమలో భాగమే. ప్రతి సినిమా విజయం సాధించాలని.. ప్రేక్షకులు అన్ని సినిమాలను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాము అన్నారు. మెగా అభిమానులు, సినీ ప్రేమికులందరూ సినిమాని ఈ స్ఫూర్తితో ఆదరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..! 

సాయి ధరమ్ తేజ్ ట్వీట్

తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సైతం పుష్ప2 సినిమాపై ఆసక్తికర ట్వీట్ చేశాడు. పుష్ప2 మూవీ టీంకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని పేర్కొన్నాడు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అల్లు Vs మెగా వార్ ఎలా స్టార్ట్ అయిందంటే?

ఇప్పటి వరకు అల్లు వెర్సస్ మెగా ఫ్యామిలీ అన్నట్లు సోషల్ మీడియాలో వార్ జరిగింది. ఎప్పుడైతే బన్నీ తన ఫ్రెండ్, వైసీపీ నాయకుడు అయిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఎన్నికల సమయంలో మద్దతు తెలిపాడో అప్పటి నుంచి టీడీపీ, జనసేన పార్టీ నాయకులకు టార్గెట్ అయ్యాడు. 

అది అక్కడితో ఆగకుండా మెగా ఫ్యామిలీని సైతం పాకింది. ఎప్పుడైతే బన్నీ శిల్పా రవికి మద్దతు ఇచ్చాడో.. మరు క్షణమే.. నాగబాబు ట్విట్టర్ వేదికగా సంచలన ట్వీట్ చేశాడు. మనవాళ్లు పరాయివాళ్లు అయ్యారు.. పరాయివాళ్లు మనవాళ్లు అయ్యారు అంటూ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేశాడు. అప్పటి నుంచి మొదలైంది. అల్లు వెర్సస్ మెగా సోషల్ మీడియా వార్. 

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది?

అక్కడ నుంచి బన్నీ ఈవెంట్లలో పాల్గొని తనకు ఏది నచ్చితే అదే చెప్తానని అనడం.. తన ఫ్రెండ్‌కి మాట ప్రకారమే అతడికి మద్దతు తెలిపానని చెప్పాడు. తనకు పార్టీలతో సంబంధం లేదని మాట ఇచ్చానంటే అవతల ఎలాగున్నా వస్తానని అన్నాడు. ఈ విషయంలో తగ్గేదే లే అన్నట్లు మాట్లాడాడు.

Also Read :  కాకినాడ పోర్ట్ లో అసలు ఏం జరుగుతుంది?

ఇదిలా ఉంటే రీసెంట్‌గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగగా.. ఒక్క మెగా హీరో కూడా రాలేదు. చిరంజీవి వస్తారని అంతా ఎదురుచూశారు. చిన్న చిన్న ఈవెంట్లకు వెళ్లే చిరు.. బన్నీ సినిమా ఈవెంట్‌కు రాకపోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆ గొడవ వల్లే చిరు రాలేదని చర్చించుకున్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విషెస్ చెప్పడం అంతా ఆశ్చర్యపోతున్నారు.  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

pahalgam Terror Attack: ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న బాలీవుడ్‌ జంట!

జమ్మూకశ్మీర్‌ లోని పహల్గం లో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ దాడి నుంచి నటి దీపికాకాకర్‌ తన భర్త షోయబ్‌త్రుటిలో తప్పించకున్నారు.ఈ విషయం గురించి వారు స్వయంగా వెల్లడించారు.

New Update
deeika

deeika

 


జమ్మూకశ్మీర్‌ లోని పహల్గం లో జరిగిన ఉగ్రదాడిలో అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈదాడి నుంచి మరికొందరు వారి ప్రాణాలను అరచేతపట్టుకొని బయటపడ్డారు.నటి దీపికాకాకర్‌ తన భర్త షోయబ్‌ ఇటీవల కశ్మీర్‌ వెళల్లారు. విహార యాత్రకు సంబంధించిన ఫొటోలను ఆదివారం ఇన్‌ స్టాలో పంచుకున్నారు.

కశ్మీర్‌ లోని అందమైన ప్రదేశాలను వీడియోలు తీసి షేర్‌ చేశారు. దాడి జరిగిన తరువాత వీరి అభిమానులు ఆందోళన చెందారు. ఈ ఘటనలో వారు చిక్కుకుపోయారేమో అని మెసేజ్‌ లు పెట్టారు.తాజాగా దీపికా, ఆమె భర్త షోయబ్‌ ఢిల్లీ కి వచ్చేసినట్లు చెబుతూ ఓ పోస్టు పంచుకున్నారు. 

మేం క్షేమంగా ఉన్నాం.మంగళవారం ఉదయమే కశ్మీర్‌ నుంచి బయల్దేరాం. సురక్షితంగా ఢిల్లీ చేరుకున్నాం.ఎవరూ ఆందోళన పడకండి అని ఇన్‌ స్టాలో తెలిపారు. తాము క్షేమంగా ఉన్నామని తెలుపుతూ దీపికా భర్త నటుడు షోయబ్ పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు విమర్శలకు దారి తీసింది. వారు ఢిల్లీ చేరుకున్నట్లు నటుడు తెలిపాడు.

ఈ పర్యటన పై వ్లాగ్‌ చేసినట్లు ప్రకటించారు.అది త్వరలోనే విడుదల చేస్తామని తెలిపారు.ఒక వైపు పెనువిషాదం పై దేశమంతా బాధపడుతుంటే ఇప్పుడు వ్లాగ్‌ ప్రచారం చేసుకుంటున్నారా..? అంటూ కొందరు నెటిజన్ లు విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు. 

జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గామ్ లో టూరిస్ట్ లపై జరిగిన టెర్రర్ ఎటాక్‌ లో 27మంది మృతి చెందారు.  మరో 20మంది ప్రాణాపాయస్థితిలో ఉన్నారు.  సాధారణ పౌరులపై ఇదే అతిపెద్ద ఉగ్రదాడి కావడం గమనార్హం.  చాలా ఏళ్ల తర్వాత దేశంలో ఇదే భారీ ఉగ్రదాడి కూడా.  పర్యాటకులనే టార్గెట్ చేసుకున్న ఉగ్రవాదులు.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి టూరిస్టులపై కాల్పులు జరిపారు.   వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 

Also Read:BIG BREAKING : జమ్మూకశ్మీర్‌ ఉగ్రదాడిలో 27మంది మృతి!

Also Read: J&K Terror Attack : మీరేం మగాళ్లు రా.. ఆర్మీ డ్రెస్‌లో వచ్చి కాల్పులు!

pahalgam army operation | Pahalgam attack | pahalgam breaking news | pahalgam latest news | bollywood | latest-news

Advertisment
Advertisment
Advertisment