Nagachaitanya : వాళ్ళ కోసం చేపల పులుసు వండిన నాగ చైతన్య.. వైరల్ అవుతున్న వీడియో

'తండేల్' షూట్ టైమ్ లో నాగ చైతన్య విశాఖపట్నంలోని స్థానికులతో మాట్లాడారు. వారి స్టైల్‌లోనే చేపల పులుసు చేసి పెడతానని మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం చేపల పులుసు వండి అక్కడివారికి వడ్డించారు. దీనికి సంబంధించిన వీడియోను మూవీ టీమ్ తాజాగా షేర్‌ చేసింది.

New Update

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం 'తండేల్'. రొమాంటిక్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. సినిమా ఎక్కువ భాగం విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రాంతాల్లో చిత్రీకరించారు. 

షూటింగ్ సమయంలో నాగచైతన్య స్థానికులతో మాట్లాడుతూ, తండేల్ సినిమా పూర్తయ్యేలోపు స్వయంగా చేపల పులుసు వండి వారికి వడ్డిస్తానని మాటిచ్చాడు.ఇప్పుడు షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో, తన మాటను నిలబెట్టుకుంటూ నాగచైతన్య స్వయంగా కట్టెల పొయ్యిపై రుచికరమైన చేపల పులుసు వండాడు. అందుకు సంబంధించిన వీడియోను చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. 

Also Read : వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్

ఈ వీడియోలో.. ఒక స్థానిక వ్యక్తి మాట్లాడుతూ,' అన్నా ఇంతకుముందు నాగచైతన్యను కలిసిన కదా.. అప్పుడు మా అంత బాగా ఆయన చేత్తోనే చేపల పులుసు వండుతనని మాటిచ్చినడు. ఆ మాటెంతవరకు కరెక్ట్‌ అవుతుందో చూడటానికి మేం వెళ్లాం. అచ్చం మాలాగే కట్టెల పొయ్యిపై రుచికరమైన చేపల పులుసు వండాడంటూ..' వీడియో సాగింది. 

చైతన్య వండిన చేపల పులుసును స్థానికులు ఆస్వాదిస్తూ, సూపర్‌గా ఉందని ప్రశంసించారు. "యేట్లో చేపలు పట్టాక, మంచి పులుసు వండాలి కదా," అంటూ నాగచైతన్య చేపల పులుసు వండిన మేకింగ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మలయాళ నటితో రొమాన్స్.. గోపీచంద్ కొత్త సినిమా ముహూర్తం! ఫొటోలు వైరల్

మాచో స్టార్ గోపీచంద్ కొత్త మూవీని అనౌన్స్ చేశారు. SVCC బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈరోజు పూజ కార్యక్రమాలతో మూవీని లాంచ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

New Update

Gopichand టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ SVCC(శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర)  బ్యానర్ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. గోపీచంద్ సూపర్ హిట్  'సాహసం' తర్వాత రెండోసారి ఈ నిర్మాణ సంస్థతో చేతులు కలిపారు. SVCC 39వ చిత్రంగా ఈ మూవీ రూపొందనుంది. ఈ సందర్భంగా ఈరోజు పూజ కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేశారు. నిర్మాతలు BVSN ప్రసాద్, బాపీనీడు, గోపిచంద్ తదితరులు పూజ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మలయాళ నటి హీరోయిన్ గా 

కుమార్ సాయి దర్శకత్వం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్యామ్ దత్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. ఇందులో గోపిచంద్ సరసన కథానాయికగా మలయాళ నటి మీనాక్షి దినేష్ నటిస్తోంది. మే లేదా జూన్ లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. సినిమాలోని ఇతర నటీనటుల విషయాలు కూడా త్వరలోనే వెల్లడించనున్నారు.

latest-news | cinema-news | actor-gopichand 

Also Read: Pahalgam Attack: పహల్గాంలో నా బర్త్ డే వేడుకలు, షూటింగ్ కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్!

Advertisment
Advertisment
Advertisment