Manchu Manoj: మోహన్ బాబు, మనోజ్ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు ఫేస్ టూ ఫేస్!

మోహన్‌బాబు, మనోజ్‌ ఆస్తి వివాదం మరోసారి వార్తల్లోకెక్కింది. తాజాగా తండ్రీ, కొడుకు రంగారెడ్డి జిల్లా కలెక్టరేక్ట్‌కు వెళ్లారు. ఇటీవల మోహన్‌బాబు ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇద్దరిని విచారణకు పిలిచారు. ఇద్దరికీ నోటీసులు ఇచ్చారు.

New Update
Mohan Babu and Manchu Manoj Rangareddy District Collectorate

Mohan Babu and Manchu Manoj Rangareddy District Collectorate

Mohan Babu and Manchu Manoj

మోహన్‌బాబు, మంచు మనోజ్‌ ఆస్తి వివాదం మరోసారి వార్తల్లోకెక్కింది. తాజాగా తండ్రి మోహన్ బాబు, కొడుకు మనోజ్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేక్ట్‌కు వెళ్లారు. ఇటీవల మోహన్‌బాబు ఫిర్యాదు చేయగా.. ఆ ఫిర్యాదుతో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ఇద్దరిని విచారణకు పిలిచారు. ఈ మేరకు కలెక్టర్ ప్రతిమా సింగ్ మెజిస్ట్రేట్ హోదాలో ఇద్దరికీ నోటీసులు ఇచ్చారు. కాగా మంచు మనోజ్ రంగారెడ్డి జిల్లా జల్‌పల్లిలోని ఫామ్ హౌస్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే.

Also Read: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వందే భారత్‌లో నాన్ వెజ్ నిషేధం

జనవరి 18న ఫిర్యాదు

గత నెల జనవరి 18న మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా మెజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేశారు. జల్‌పల్లిలో ఉన్న తన ఆస్తులను కొందరు అక్రమంగా దోచుకోవాలని చూస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా.. తన నివాసంలో ఉన్న వారందరినీ త్వరగా ఖాళీ చేసి తనకు అప్పగించాలని కోరారు. సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం.. తన ఆస్తులను స్వాధీనం చేసి తనకు అప్పగించాలని కలెక్టర్‌ను కోరారు. 

Also Read: పార్లమెంట్ ను కుదిపేసిన కుంభమేళా తొక్కిసలాట

దీంతో మోహన్ బాబు ఫిర్యాదుపై కలెక్టర్ స్పందించారు. మోహన్ బాబు ఆస్తులపై పోలీసుల నుంచి నివేదిక తీసుకున్నారు. అనంతరం జల్‌పల్లిలోని ఫామ్ హౌస్‌లో ఉంటున్న మంచు మనోజ్‌కు నోటీసులు పంపించారు. విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ తరుణంలోనే మంచు మనోజ్ తన లీగల్ టీమ్‌తో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టరేక్ట్‌కు వెళ్లారు. అక్కడ అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్‌ను కలిసారు. 

కాగా ఈ ఆస్తి వివాదం గతేడాది ఒక ఎపిసోడ్‌లా నడిచింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునేంతలా ఇది నడిచింది. మోహన్ బాబు ఇంటి మీదకి మంచు మనోజ్ తన బౌన్సర్లతో వెళ్లడం చూశాం. అలాగే మోహన్ బాబు సైతం తన కోపాన్ని ఆపుకోలేక ప్రముఖ టీవీ ఛానెల్ రిపోర్టర్‌పై కూడా దాడి చేసిన సంఘటనలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఇలా తండ్రీ కొడుకుల వివాదం నడుస్తూనే ఉంది. 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Manchu Lakshmi - Manoj: అక్కా ఏడవకే.. మనోజ్‌ను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మి - VIDEO

ఫ్యామిలీ వివాదాలతో సతమతమవుతున్న తమ్ముడు మంచు మనోజ్‌ని ఓ ఫంక్షన్లో చూసి మంచు లక్ష్మి ఏడ్చేసింది. ఆమె స్టేజ్‌పై ఉన్న సమయంలో మనోజ్ దంపతులు వెళ్లారు. వారిని చూడగానే లక్ష్మి కంటనీరు పెట్టుకుని ఎమోషనల్ అయింది. పక్కనే ఉన్న మౌనిక అక్కా తమ్ముళ్ళను ఓదార్చింది.

New Update
manchu lakshmi gets emotional over seeing manchu manoj

manchu lakshmi gets emotional over seeing manchu manoj

అక్కా తమ్ముళ్ల బంధం ఎన్నటికీ వీడనిది.. విడదీయలేనిది. ఎన్ని గొడవలు జరిగినా.. తిరిగి మళ్లీ ఒక్కటి కావాల్సిందే. అదే మరోసారి నిజమైంది. మంచు ఫ్యామిలీలో  గత కొన్నాళ్లుగా వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా మంచు ఫ్యామిలీ గొడవలు చెలరేగాయి. పోలీస్ స్టేషన్ వరకు చేరుకున్నాయి. అక్కడితో ఆగలేదు. ఆఖరికి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు- మంచు మనోజ్ మరోవైపు. సినిమాను తలపించేలా వీరి వివాదం నడిచింది. ఇప్పటికీ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరుగుతున్నాయి. ఇది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఆ మధ్య వీరు ఒకరినొకరు తిట్టుకుని.. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు కాస్త సైలెంట్ అయ్యారు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

కానీ ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీలో చిచ్చు రాజుకుంది. మంచు మనోజ్ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తన కార్లను విష్ణు దొంగిలించాడంటూ తన తండ్రి మోహన్ బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. కూతురి పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లిన వెంటనే మంచు విష్ణు ఈ చోరీకి పాల్పడ్డాడని మనోజ్ ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఇదే రచ్చ కొనసాగుతోంది. 

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

ఇలా వరుస వివాదాలతో మంచు ఫ్యామిలీకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఈ వివాదాలపై నోరు విప్పేందుకు ఇష్టపడటం లేదు. అయితే మంచు లక్ష్మికి తమ్ముడు మనోజ్‌ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు నడుస్తున్నాయి. గతంలో ఆమె ముంబై నుంచి వచ్చి గొడవలను సరిచేయాలని చూసింది. కానీ ఆమె మాట ఎవరూ వినలేదని.. అక్కడ నుంచి వెంటనే మళ్లీ ఆమె వెళ్లిపోయిందని వార్తలు వినిపించాయి. 

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

అక్కా తమ్ముళ్ల అనుబంధం

ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి, తమ్ముడు మంచు మనోజ్ కలిసారు. ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే వార్షిక ఫండ్‌రైజర్ కార్యక్రమాన్ని మంచు లక్ష్మి ఏర్పాటు చేసింది. అందులో తన కూతురితో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. అదే సమయంలో మంచు లక్ష్మి స్టేజ్ మీద ఉండగానే.. వెనుక నుంచి మంచు మనోజ్ దంపతులు సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా తమ్ముడు మనోజ్‌ను చూసిన మంచు లక్ష్మీ మనసారా హత్తుకుని ఏడ్చేసింది. దీంతో పక్కనే ఉన్న మనోజ్ భర్య ఆమెను ఓదార్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధం విడదీయలేనిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.

(manchu-manoj | manchu lakshmi | manchu family | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment