Chiranjeevi: ఎమ్మెల్సీగా నాగబాబు.. మెగాస్టార్ చిరంజీవి షాకింగ్ రియాక్షన్!

ఎమ్మెల్సీగా నాగాబాబు ఎన్నికపై ఆయన సోదరుడు చిరంజీవి స్పందించారు. ‘ఎమ్మెల్సీగా ఎన్నికయి ఏపీ శాసనమండలిలో తొలిసారి అడుగు పెట్టబోతున్న నా తమ్ముడు నాగబాబుకి అభినందనలు. ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడాలి’’ అని అన్నారు.

New Update
Megastar Chiranjeevi responds to Nagababu MLC

Megastar Chiranjeevi responds to Nagababu MLC

ఇటీవల ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. ఇందులో 5గురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిలో జనసేన తరఫున కొణిదెల నాగబాబు ఉన్నారు. ఆయన ఎన్నికపై ఇప్పటికే పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఎట్టకేలకు నాగబాబు ఎమ్మెల్సీ పై ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. 

Also read :  రంజాన్ ఎఫెక్ట్.. వాచిపోతున్న పండ్ల రేట్లు.. కిలో ఎంతంటే?

ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీగా ఎన్నికయి ఏపీ శాసనమండలిలో అడుగు పెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబుకి శుభాకాంక్షలు చెప్పారు. ప్రజా సమస్యల మీద గళం విప్పాలని అన్నారు. వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడాలని.. ఆ కృషిలో విజయం సాధించాలని అన్నారు. వారి అభిమానాన్ని మరింత పొందాలని ఆ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్‌గా మారింది. 

Also Read :  ఒప్పందం పై పుతిన్‌ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్‌!

వర్మపై నాగబాబు కామెంట్స్

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి నేటికి 12 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో భారీగా ‘జయకేతనం’ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు జనసేన పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, జనసైనులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా సభకు హాజరైన పవన్ కళ్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు సంచలన కామెంట్లు చేశారు. 

Also Read :  పరువు పోయిందిగా.. పాకిస్థాన్ క్రికెటర్లకు ఘోర అవమానం!

పవన్ గెలవడానికి రెండు కారణాలు

ఈ మేరకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత వర్మకు కౌంటర్ ఇచ్చారు. పవన్‌ కళ్యాణ్‌ను తామే గెలిపించామని ఎవరైనా భావిస్తే అది వారి కర్మ అని అన్నారు. పిఠాపురంలో పవన్‌ గెలవడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని అన్నారు. అందులో మొదటి కారణం పవన్‌ కల్యాణ్ అని అన్నారు. ఆ తర్వాత రెండో కారణం జనసైనికులు, కార్యకర్తలు అంటూ నాగబాబు హాట్ కామెంట్స్ చేశారు.

Also read :  రంజాన్ ఎఫెక్ట్.. వాచిపోతున్న పండ్ల రేట్లు.. కిలో ఎంతంటే?

ఈ రెండు కారణాల వల్లే పవన్ విజయం సాధించారు అని తెలిపారు. దీంతో పవన్‌ గెలుపులో వర్మ పాత్ర లేదని నాగబాబు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. కాగా 2024 ఎలక్షన్లలో పవన్ గెలిచిన తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ.. తన మద్దతు వల్ల పవన్ గెలిచాడని ప్రచారం జరిగింది. ఇప్పుడు వాటికి కౌంటర్‌గానే నాగబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో.  

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Attack పహల్గామ్ లో బిగ్ బాస్ నటి కాజల్.. ఇప్పుడు ఆమె ఎలా ఉందంటే!

బిగ్ బాస్ ఫేమ్ నటి RJ కాజల్ కూడా దాడి సమయంలో పహల్గామ్ లోనే ఉండడం ఆమె అభిమానులకు ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో కాజల్ తాను క్షేమంగా ఉన్నానని తెలియజేస్తూ ఇన్ స్టాలో వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం తాను పహల్గామ్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాని తెలిపింది.

New Update
rj kajal in  Pahalgam attack

rj kajal in Pahalgam attack

Rj Kajal: కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన యావత్ దేశాన్ని కలచివేస్తోంది. మినీ స్విజ్జర్ ల్యాండ్ గా పేరొందిన పహల్గామ్ ప్రకృతి అందాలను చూసేందుకు వచ్చిన పర్యాటకులను దారుణంగా కాల్చి చంపారు ఉగ్రవాదులు. ఈ దాడిలో 29 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బయటపడ్డారు. 

పహల్గామ్ లో కాజల్ 

అయితే బిగ్ బాస్ ఫేమ్ నటి RJ కాజల్ కూడా దాడి సమయంలో పహల్గామ్ లోనే ఉన్నారు. దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కాజల్ తాను క్షేమంగా ఉన్నానని తెలియజేస్తూ ఇన్ స్టాలో వీడియోను రిలీజ్ చేసింది. ప్రస్తుతం తాను పహల్గామ్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాని తెలిపింది. నాకు కోసం ఆలోచించిన అందరికీ కృతజ్ఞతలు అని చెప్పింది.  ''పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నన్ను ఎంతో బాధించింది.  ఇక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రజల రక్షణ కోసం పోలీసులు, అధికారులు ఎంతో కృషిచేస్తున్నారు. ఇప్పుడు కాశ్మీర్ ప్రశాంతంగా, సేఫ్ గా ఉంది'' అంటూ వీడియోను షేర్ చేసింది. 

 latest-news | telugu-news | cinema-news

Also Read: Pahalgam Terror Attack-Tollywood: క్షమించరాని క్రూరమైన చర్య..ఉగ్రదాడిని ఖండించిన సినీ ప్రముఖులు!

Advertisment
Advertisment
Advertisment