హైదరాబాద్ లో జాన్వీ కపూర్ ప్రత్యేక పూజలు.. వైరలవుతున్న ఫొటోలు

బాలీవుడ్ నటి జాన్వీకపూర్‌ తాజాగా హైదరాబాద్‌లోని మధురానగర్‌ ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి.

New Update
dfsxb

బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కు తల్లి శ్రీదేవి లాగే దైవ భక్తి ఎక్కువ అనే విషయం తెలిసిందే. ఆమె తరుచూ ఫ్యామిలీతో తిరుమలకు వెళ్తూ ఉంటుంది. తెలుగు సాంప్రదాయ పద్ధతిలోనే మొక్కు తీర్చు కుంటుంది. అయితే తాజాగా ఈ హీరోయిన్ హైదరాబాద్ లోని మధురానగర్‌ ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చింది. 

Also Read :యోగ టీచర్ నుంచి సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి.. అనుష్క సినీ జర్నీ

అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించింది. అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందించారు. జాన్వీ హైదరాబాద్‌ వచ్చిందనే విషయం తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. 

Also Read :  వైసీపీకి మాజీ మంత్రి రాజీనామా!.. క్లారిటీ

ఇక 'దేవర' సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్ తో నటించే ఛాన్స్ అందుకొని బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకుంది. ప్రెజెంట్ ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. త్వరలోనే రామ్ చరణ్ తో 'RC16' మూవీ షూటింగ్ లో జాయిన్ కానుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుంది. తెలుగులో జాన్వీకి ఇది రెండో పాన్ ఇండియా మూవీ కావడం విశేషం.

Also Read :  డోనాల్డ్ ట్రంప్ గెలవడానికి ముఖ్య కారణాలు ఇవే...

Also Read : కమల్ హాసన్ కు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డుల గురించి తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

చిత్రనిర్మాత కరణ్ జోహార్ ఇండియన్ క్రికెటర్ ఎం. ఎస్ ధోని అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నట్లు వీడియో రిలీజ్ చేశారు. దీంతో ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

New Update
MS DHONI VIDEO

MS DHONI VIDEO

MS Dhoni టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎం. ఎస్ ధోని క్రికెట్ తో పాటు సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టారు. 2023లో  'లెట్స్ గెట్ మ్యారీడ్' అనే సినిమాకు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అయితే ఇప్పుడు ధోని హీరోగా కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి కారణం బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ షేర్ చేసిన వీడియో.  ధోని ఓ కొత్త రొమాంటిక్ అవతార్ లో కనిపించబోతున్నారు అంటూ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ధోని హార్ట్  సింబల్ బెలూన్ చేతిలో పట్టుకొని కనిపించారు. దీంతో ఫ్యాన్స్ ధోని హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అని అనుకుంటున్నారు. అంతేకాదు కరణ్ ఈ వీడియోను షేర్ చేయడంతో.. ధోనిని కరణ్ జోహార్ పరిచయం చేయబోతున్నారా అని కామెంట్లు పెడుతున్నారు. కానీ.. ఇంతలోనే అసలు విషయం బయటపడింది.

యాడ్ ఫిల్మ్ షూట్

 ఆ వీడియో ఒక యాడ్ ఫిల్మ్ షూట్ కి సంబంధించినదని తెలిసింది. ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో.. ఇది యాడ్ షూట్ కి సంబంధించిన వీడియో అని అర్థమైంది. ఏదేమైనా మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అయితే గతంలో కూడా ధోని సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఇటీవలే రామ్ చరణ్ - బుచ్చిబాబు rc16 లో ధోని క్యామియో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత చిత్రబృందం అలాంటిదేమి లేదని చెప్పడంతో పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది.  

ప్రస్తుతం ధోని  CSK కెప్టెన్‌గా గా వ్యవహరిస్తున్నారు. వరుసగా ఐదు మ్యాచుల పరాజయాల తర్వాత.. తాజాగా జరిగిన లక్నో సూపర్ జెయింట్స్‌ వర్సెస్ CSK మ్యాచ్ లి చెన్నై సూపర్ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. ఈ విజయంలో ధోని కీలక పాత్ర పోషించడం విశేషం. 

telugu-news | latest-news | ms-dhoni | karan-johar

Advertisment
Advertisment
Advertisment