Allu Arjun: అబుదాబి స్వామి నారాయణ్ మందిర్ లో అల్లు అర్జున్.. అక్కడ ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్

హీరో అల్లు అర్జున్ అబుదాబిలోని స్వామి నారాయణ్ మందిర్ ను సందర్శించారు. అక్కడి ప్రతినిధులు అల్లు అర్జున్ కి ఆలయ విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఆలయ నిర్మాణాలను ఆసక్తిగా తిలకించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

New Update
allu arjun at Swami Narayan Mandir in Abu Dhabi

allu arjun at Swami Narayan Mandir in Abu Dhabi

Allu Arjun: సంధ్యా థియేటర్ ఎపిసోడ్ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈవెంట్లలో, మీడియా ముందు పెద్దగా  కనిపించలేదు. అయితే తాజాగా అల్లు అర్జున్ అబుదాబిలోని బీఏపీఎస్ స్వామి నారాయణ మందిరాన్ని సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అబుదాబిలోని ఈ ఆలయం తొలి రాతి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. బన్నీ అక్కడికి చేరుకున్న అనంతరం ప్రతినిధులు ఆయనకు ఆలయ విశిష్టతను, ప్రాముఖ్యతను వివరించారు. అలాగే అల్లు అర్జున్ నిర్మాణాలను ఆసక్తిగా తిలకించారు. 2024 ఫిబ్రవరి 14న భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ  ఆలయాన్ని  ప్రారంభించారు. 

ఇది కూడా చూడండి:  Betting App Case: ఎవ్వరినీ వదలకండి.. అందరిని జైల్లో వేయండి- పోలీసులకు మైనంపల్లి ఫిర్యాదు!

ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో

ఇదిలా ఉంటే రీసెంట్ గా  'పుష్ప2' తో భారీ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు బన్నీ. భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ చిత్రంగా  'పుష్ప2' రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 1871 పైగా కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం అల్లు అర్జున్.. అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం బన్నీ భారీ మొత్తాన్ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రూ. 175 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. అంతేకాదు లాభాల్లో 15%శాతం వాటా ఇచ్చేలా  మూవీ నిర్మాణ సంస్ధ 'సన్ పిక్చర్స్' తో బ్యాకెండ్ ఒప్పందం కూడా చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

telugu-news | latest-news | cinema-news | allu-arjun

Also Read: Court Premalo Song: "కథలెన్నో చెప్పారు.. కవితల్నీ రాశారు.." ప్రేమలో ఫుల్ వీడియో సాంగ్ చూశారా..?

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Urvashi Rautela: దబిడి దిబిడి భామకు గోల్డెన్ క్వీన్‌ అవార్డు..

"డాకు మహారాజ్" చిత్రంలో తన నటనకు గానూ బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలాకు ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు దక్కింది. అవార్డును పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ తనకు సప్పోర్ట్ చేసిన అభిమానులందరికి ధన్యవాదాలు తెలిపారు ఊర్వశి.

New Update
Urvashi Rautela Award

Urvashi Rautela Award

Urvashi Rautela: బాలయ్య బాబుతో కలిసి డాకు మహారాజ్ లో దబిడి దిబిడి అంటూ స్టెప్పులేసిన బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా కష్టానికి గుర్తింపు లభించింది. ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు (గోల్డెన్ క్వీన్ అవార్డు) తన ఖాతాలో వేసుకుంది ఈ హాట్ బ్యూటీ. అయితే డాకు మహారాజ్ లో బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో నటించి మెప్పించిన ఊర్వశి "దబిడి దిబిడి" పాటతో తెలుగు ఆడియన్స్ లో  ఓ రేంజ్ క్రేజ్ సంపాదించుకుంది. అయితే, ఈ పాటపై కొంతమంది విమర్శలు చేసినా, ఊర్వశి పెర్ఫార్మన్స్ మాత్రం ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది.

Also Read: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో

Also Read: Instagram: ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు మెటా షాక్.. పేరెంట్స్ పర్మిషన్ లేకుండా ఆ వీడియోలు చూడలేరు

గోల్డెన్ క్వీన్ అవార్డు..

అయితే, ఫ్యాన్స్ ఫేవరెట్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును  అందుకున్న ఊర్వశి ఈ విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. "డాకు మహారాజ్" చిత్రంలో తన నటనకు గానూ ఈ అవార్డును అందుకున్నట్టు ఈ విషయాన్నీ ఫ్యాన్స్ తో  సోషల్ మీడియా ద్వారా  పంచుకోవడం ఆనందంగా ఉంది" అని ఊర్వశి తెలిపింది, అవార్డును పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ తనకు సప్పోర్ట్ చేసిన  అభిమానులందరికి  ధన్యవాదాలు తెలిపారు. 

Also Read: ‘అదిదా సర్‌ప్రైజ్‌’ ఫుల్ వీడియో సాంగ్.. సైలెంట్​గా స్టెప్ లేపేసారుగా..!

Also Read: NTR: ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్.. పవన్ కొడుకు కోసం ఎన్టీఆర్ ట్వీట్

Advertisment
Advertisment
Advertisment