/rtv/media/media_files/2025/02/20/naAGZbURvynPVI0HFPPn.jpg)
actress Divya Bharathi About Gv Prakash Divorce in King Ston movie interview
GV Prakash-Saindhavi: కోలీవుడ్ స్టార్ సింగర్ జీవీ ప్రకాశ్ - సైంధవి జంట గతేడాది విడిపోయారు. పలు కారణాల వల్ల ఒకరినొకరు అర్థం చేసుకుని తమ హ్యాపీ లైఫ్కు శుభం కార్డు పలికారు. అయితే ఈ జంట విడిపోవడానికి ఓ నటి కారణమని ఆ మధ్య వార్తలు జోరుగా సాగాయి. ఆ వార్తలపై నటి తాజాగా క్లారిటీ ఇచ్చింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు దివ్య భారతి. వీరిద్దరు కలిసి గతంలో ‘బ్యాచిలర్’ అనే సినిమా చేశారు.
Also Read: America: పనామా హోటల్ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!
ఆ సినిమా సినీ ప్రేక్షకుల నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా అందులో జీవీ ప్రకాశ్, దివ్య భారతి కెమెస్ట్రీకి సినీ ప్రియులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాతే జీవీ ప్రకాశ్ -సైంధవి జంట విడాకులకు సిద్ధమయ్యారు. దీంతో దివ్య భారతి పై పలువురు విమర్శలు చేశారు. తాజాగా ఆమె ఈ వార్తలపై స్పందించింది.
Also Read: USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్
ఎంతో మంది విమర్శించారు
తాజాగా జీవీ ప్రకాశ్- దివ్యభారతి మరోసారి కలిసి నటించిన చిత్రం ‘కింగ్స్టన్’. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దివ్య భారతి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా జీవీ ప్రకాశ్ విడాకులను ఉద్దేశించి ఆమె మాట్లాడింది. జీవీ ప్రకాశ్ తన భార్య సైంధవి విడాకులు ప్రకటించిన టైంలో తనను ఎంతో మంది విమర్శించారని తెలిపింది. వారిద్దరూ విడిపోవడానికి కారణం తానేనని చాలా మంది తనపై ట్రోలింగ్స్ చేశారని పేర్కొంది.
#GVPrakash: Many People are talking like me & DivyaBharathi are dating each other. We are normal friends & we don't even meet outside the floors#DivyaBharathi: I used to get messages like I'm the reason behind GVPrakash's separation of marriage life
— 🆃🅰🅼🅸🅻 🅲🅸🅽🅴🅼🅰 🆃🅰🅻🅺🆂 (@tamilcinema_12) February 20, 2025
pic.twitter.com/QKVEUEwToC
జీవీ ప్రకాశ్, తాను గతంలో ‘బ్యాచిలర్’ కోసం కలిసి వర్క్ చేశాం అని.. ఆ సినిమాలో తమ జంట కెమిస్ట్రీకి చాలా మంది ప్రేక్షకులు మెచ్చుకున్నారని పేర్కొంది. అయితే ఆ సినిమాతో తామిద్దరం రిలేషన్లో ఉన్నామని చాలా మంది తప్పుగా అనుకున్నారన్నారు.
ఈ క్రమంలోనే జీవీ ప్రకాశ్ - సైంధవి విడాకులు ప్రకటించిన టైంలో ఎంతోమంది తనకు మెసేజ్లు పంపారని.. వారు విడిపోవడానికి కారణం తనేనని విమర్శించారన్నారు. తనను తిడుతూ మెసేజ్లు పెట్టేవారిలో మహిళలే ఎక్కువమంది అని అన్నారు. వాటిని జీవీకి పంపిస్తే.. ఇలాంటి మెసేజ్ల గురించి పట్టించుకోకుండా కెరీర్పై ఫోకస్ పెట్టమని అతడు చెప్పాడని తెలిపింది. దీంతో ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి.
ఇదే విషయంపై జీవీ ప్రకాశ్ స్పందించాడు. దివ్యతో తాను పలు ప్రాజెక్ట్ల కోసం కలిసి పనిచేశానని.. తమ మధ్య ఎలాంటి రిలేషన్ షిప్లు లేవని .. తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని అన్నాడు.