Chandrababu : చంద్రబాబుపై కోర్టుకు సిఐడి ఫిర్యాదు..!!

చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మధ్యంతర బెయిల్ కు అదనపు షరతులు పెట్టాలని సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. ఇరువైపులా న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఎల్లుండికి వాయిదా వేసింది.

New Update
Chandrababu: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ కు తన అభిప్రాయం పంపిన చంద్రబాబు

చంద్రబాబు కోర్టుకు ఆదేశాలను ఉల్లంఘించారా..ఆయనకు బెయిల్ ఇచ్చిన సందర్భంగా కోర్టు కొన్ని షరతులను విధించిన విషయం తెలిసిందే. వీటికి అదనంగా సీఐడీ కూడా కొన్ని షరతులను పెట్టింది. దానిపైనే కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు...ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లే క్రమంలో కోర్టు ఆదేశాలను పాటించలేదని సీఐడీతోపాటు ప్రభుత్వం కూడా భావిస్తోంది. మధ్యంతర బెయిల్ ఇస్తే ఈ ర్యాలీలు ఏంటని వైపీసీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. దీనిపై సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మధ్యంతర బెయిల్ కు అదనపు షరతులు పెట్టాలని సీఐడీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. ఇరువైపులా న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆయన అనారోగ్య కారణాల దృష్ట్యా బెయిల్ తప్పనిసరి అని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్నన్యాయమూర్తి ఎల్లుండికి తీర్పును వాయిదా వేసింది.

సీఐడీ వాదనలు ఇలా ఉన్నాయి:

-జైలు నుంచి బయటకు వచ్చి చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

-ఆ వీడియో క్లిప్పింగ్స్ పెన్ డ్రైవ్ లో కోర్టుకి సమర్పించిన సీఐడీ

-కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత కూడా చంద్రబాబు మీడియా తో మాట్లాడారు అని కోర్టుకు వెల్లడించిన సీఐడీ

-13 గంటల పాటు జైలు నుంచి రాజమండ్రి నుంచి ర్యాలీగా చంద్రబాబు విజయవాడకు వచ్చారని కోర్టుకు తెలిపిన సీఐడీ

-ర్యాలీలు నిర్వహించకూడదని కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పినా చేశారన్న సీఐడీ.

చంద్రబాబు తరపు న్యాయవాదుల వాదనలు ఇలా ఉన్నాయి:

-కోర్టు ఆర్డర్ ఎక్కడా చంద్రబాబు అతిక్రమించ లేదు.

-చంద్రబాబు మాట్లాడటం అనేది ఆయన ప్రాథమిక హక్కులలో భాగమే తప్ప అతిక్రమణ కాదు.

-జైలు శిక్ష పడిన వారికి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం గతంలో కోర్టులు కల్పించాయి.

-సీఐడీ చెబుతున్న షరతులు ఆయన్ని హక్కులు హరించే విధంగా ఉన్నాయని కోర్టుకు తెలిపిన చంద్రబాబు లాయర్లు.

ఇది కూదా చదవండి: నేను పోటీ చేయను.. తెలంగాణ బీజేపీకి మరో కీలక నేత షాక్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori Arrest: అఘోరీకి బిగ్ షాక్.. సంగారెడ్డి సబ్ జైలుకు తరలింపు- 14 రోజులు అక్కడే

అఘోరీకి చేవెళ్ల కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు (కంది జైలు) తరలించారు. అదే సమయంలో అఘోరీ నుంచి వర్షిణీని వేరు చేసి భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ వర్షిణీకి కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు.

New Update

లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

14 రోజుల రిమాండ్

విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. అక్కడ వర్షిణీకి భరోసా సెంటర్ అధికారులు కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

ఇదే విషయంపై అఘోరీ తరఫు లాయర్ మాట్లాడుతూ.. ‘‘కోర్టులో ఇప్పుడు వాదోపవాదనలు ఏం జరగలేదు.  కోర్టు కేవలం 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. కేసుకు సంబంధించి పూర్వపరాలు పరిశీలించి కేసు వాదించాలా లేదా అనేది జరుగుతుంది. కోర్టు తరఫున అడ్వకేట్‌ను పెట్టుకునే స్థోమత లేనివారికి కోర్టు నన్ను అపాయింట్ చేసింది. బెయిల్ గురించి ఇప్పుడే చెప్పలేం. కేసుకు సంబంధించి అన్నీ పరిశీలించిన తర్వాత ఒక టైం పడుతుంది. ’’ అని చెప్పుకొచ్చారు. 

కేసు ఏంటంటే?

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలానికి చెందిన మహిళా ప్రొడ్యూసర్ అఘోరీపై చీటింగ్ కేసు పెట్టింది. 6 నెలల క్రితం ప్రొద్దటూర్‌లోని ప్రగతి రిసార్ట్స్‌లో డిన్నర్‌కు వచ్చిన అఘోరి ఆమెకు పరిచయం అయ్యింది. తర్వాత తరుచుగా ఆమెకు ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు తెలుసుకునేది. ఒక పూజ చేస్తే అంతా మంచి జరుగుతుందని మహిళా ప్రొడ్యూసర్‌కు మాయ మాటలు చెప్పింది అఘోరీ .

క్షుద్ర పూజలు చేయడానికి అడ్వాస్‌గా రూ.5 లక్షలు తన అకౌంట్‌లోకి వేయించుకుంది. తర్వాత యూపీ ఉజ్జయినిలోని ఫాం హౌస్‌కి తీసుకెళ్లి పూజ చేసింది. అప్పుడు మరో రూ.5 లక్షలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేసింది అఘోరీ. లేకపోతే పూజ విఫలమై కుటుంబం నాశనమవుతుందని లేడీ అఘోరీ ఆమెను భయపెట్టింది. ఆ మాటలకు భయపడిన ఆ మహిళ మరో రూ.5 లక్షలు అఘోరీకి ముట్టజెప్పింది.

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

aghori Arrest | lady aghori arrest | Lady Aghori Sri Varshini | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment