Chiranjeevi Fans: చిరు అభిమానులు వర్సెస్ కొడాలి నాని అభిమానులు!

చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ‘జై చిరంజీవ.. కొడాలి నాని డౌన్‌డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు. కొడాలి నాని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

New Update
Chiranjeevi Fans: చిరు అభిమానులు వర్సెస్ కొడాలి నాని అభిమానులు!

Chiranjeevi Fans Protest against Kodali Nani : ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) అభిమానులు ఆందోళనలకు దిగారు. చిరంజీవి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సహా పలువురు వైసీపీ నేతలు మండిపడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ‘జై చిరంజీవ.. కొడాలి నాని డౌన్‌డౌన్‌’ అంటూ నినాదాలు చేశారు. కొడాలి నాని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో చిరంజీవి అభిమానులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి, పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. చిరుకి కొడాలి నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఆ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు వాహనాలకు అడ్డంగా చిరంజీవి అభిమానులు పడుకుని నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

చిరంజీవి, రంగా అభిమానుల ఓట్లతో గెలిచిన కొడాలి నానీకి 2024 ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గుడివాడలో సామాజిక సమీకరణాల రీత్యా.. చిరంజీవిపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. చిరంజీవి ప్రభుత్వాన్ని ప్రశ్నించారని అంత మాత్రానికే ఇష్టానుసారంగా మాట్లాడతారా అని ప్రశ్నిస్తున్నారు.

విజయవాడలోనూ పెద్ద ఎత్తున వచ్చిన చిరు అభిమానులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. డౌన్ డౌన్ కొడాలి నాని… జై చిరంజీవ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ పుర వీధుల్లో ర్యాలీ నిర్వహిస్తున్న చిరంజీవి అభిమానులను విజయవాడ వన్ వే రోడ్డులో పోలీసులు అడ్డుకోవడంతో కోపోద్రోక్తులైన అభిమానులు కొడాలి నాని క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.ఏజీకే స్కూల్‌ సెంటర్లో విజయవాడ మెయిన్‌రోడ్డుపై చిరంజీవి అభిమానులు బైఠాయించారు. వంగవీటి మోహనరంగా విగ్రహానికి క్షీరాభిషేకాలు చేశారు.

అనంతపురం నగరంలోనూ చిరంజీవి అభిమానుల నిరసన ఉద్రిక్తతలకు దారి తీసింది. టవర్ క్లాక్ వద్ద ఫ్యాన్స్ నిరసన ప్రదర్శన చేశారు. రాష్ట్రం, ప్రజల భవిష్యత్ గురించి చిరంజీవి మంచి మాటలు చెబితే, ఆయనపై వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలు చేయడం ఏంటని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చిరు ఫ్యాన్స్ హెచ్చరించారు.

వాల్తేరు వీరయ్య 200రోజుల ఫంక్షన్ లో.. చిరంజీవి మాట్లాడుతూ సినిమా రంగంపై రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్స్ పై స్పందించారు. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, ప్రాజెక్టులు, పేదవారు, ఉద్యోగ , ఉపాధి అవకాశాలు కల్పించడం వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా ఇండస్ట్రీ మీద పడతారేంటి అంటూ కొంచెం ఘాటుగానే చిరు స్పందించారు.

దీని గురించి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చిరు వ్యాఖ్యల పై మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ అయితే సినీ పరిశ్రమని పిచ్చుకతో పోల్చిన చిరంజీవినే దానిని తక్కువ చేసి మాట్లాడారని విమర్శించారు. ఈ క్రమంలోనే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా ఘాటుగానే స్పందించారు.

‘సినిమా పరిశ్రమలోని పకోడిగాళ్లు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారంటూ’ ఆయన వ్యాఖ్యానించారు. సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్లు పకోడీగాళ్లు.. ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు. తనవాళ్లకు కూడా ఈ సలహాలు ఇస్తే బావుంటుందన్నారు. మనకెందుకురా బాబు మన డ్యాన్సులు, ఫైట్లు మనం చూసుకుందామని వాళ్లకు కూడా సలహా ఇస్తే మంచిదన్నారు కొడాలి నాని.

Also Read: మరో వివాదంలో రాహుల్ గాంధీ. స్త్రీ ద్వేషం గల వారే ఇలా చేస్తారన్న స్మృతి ఇరానీ..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !

విశాఖలో గర్భిణీ అనూష హత్య కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో వివాహం చేసుకున్నారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తేలింది

New Update

AP Crime: విశాఖలో గర్భిణీ అనూషను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏసీపీ సంచలన విషయాలు వెల్లడించారు. జ్ఞానేశ్వర్, అనూష ప్రేమించుకుని 2022లో సింహాచలంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిందితుడు హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణ ప్రకారం.. పీఎం పాలెం పీఎస్‌ పరిధిలో గర్భిణీ అనూష హత్య ఘటనలో ఏసీపీ అప్పలరాజు సంచలన విషయాలు తెలిపారు. అనూషను వదిలించుకోవాలని జ్ఞానేశ్వర్ కొన్నాళ్లుగా చూస్తున్నాడని పోలీసులు విచారణలో తెలింది. ఈ క్రమంలోనే జ్ఞానేశ్వర్ పలు నాటకాలు ఆడిన్నారు. ముందు తనకు క్యాన్సర్ ఉందని, వేరే పెళ్లి చేసుకోవాలని అనూషపై జ్ఞానేశ్వర్ ఒత్తిడి చేశాడు.

గతంలో చంపడానికి ప్లాన్..

ఆమె అంగీకరించకపోవడంతో మరో నాటకం ఆడాడు. తనకు పెళ్లైనట్లు తల్లిదండ్రులకు తెలియదని, వారికి తెలిస్తే ఇద్దరినీ చంపేస్తారని అనూషకు చెప్పాడు. అందుకే.. విడాకులు తీసుకుందామని ఒత్తిడి చేశాడు. ఆ ప్రయత్నాలేవీ ఫలించకపోవడంతో అనూషను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. జ్ఞానేశ్వర్ భార్యను బయటకు తీసుకువెళ్లినా సరదాగా మెలిగేవాడు కాదని, జంటగా ఫొటోలు దిగుదామన్నా వద్దనేవాడు స్నేహితులు చెబుతున్నారు. గతంలో పలుమార్లు చంపడానికి ప్రయత్నించాడు. ఫలుదాలో టాబ్లెట్స్ కలిపి చంపాలని ఫ్లాన్‌ చేశాడు. జ్ఞానేశ్వర్ డెలివరీ ఉందని ఫ్రెండ్స్‌ అందరికీ వీడియో కాల్‌ చేశాడు.
 
ఇది కూడా చదవండి: రోజూ ఉదయాన్నే నిమ్మకాయ నీళ్లు తాగితే ఇవే లాభాలు

రాత్రికి రాత్రి అనూషను చున్నీతో చంపేశాడు. జ్ఞానేశ్వర్ ముఖంపై గోర్లతో రెక్కేసిన ఆనవాలు ఉన్నట్లు బాధితురాలి స్నేహితులు పోలీసుల విచారణలో తెలిపారు. అయితే.. మంగళవారం డెలివరీ ఉండగా.. సోమవారం రాత్రే ఆమెను హతమార్చాడు. ఏమీ తెలియనట్లు మళ్లీ పడుకున్నాడు. ఉదయం బంధువులు లేపినా.. అనూష లేవలేదు. వారితోపాటే అతనూ నిద్ర లేపుతున్నట్లు నటించాడు. దీంతో జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నామని.. తనను అనుమానించడంతోనే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడని ఏసీపీ అప్పలరాజు తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిందితుడిపై హత్య నేరం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.   

ఇది కూడా చదవండి: క్లీన్ షేవ్, గడ్డం.. చర్మానికి ఏది మంచిదో తెలుసా?

( AP Crime | ap-crime-news | ap-crime-report | ap crime updates | ap crime latest updates )

Advertisment
Advertisment
Advertisment