అరుణాచల్ ప్రదేశ్ అథ్లెట్లకు వీసా నిరాకరించిన చైనా

చైనా తన వంకర బుద్ధిని మరోసారి బయట పెట్టుకుంది. భారత్ లోని అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన అథ్లెట్లకు వీసాలను, అక్రిడేషన్ లను నిరాకరించింది. ఈ విషయం మీద భారత్ మండిపడుతోంది.

New Update
అరుణాచల్ ప్రదేశ్ అథ్లెట్లకు వీసా నిరాకరించిన చైనా

చైనాలో హంగజౌ లో 19వ ఆసియా క్రీడలు జరగనున్నాయి. దీనికి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారుల పట్ల చైనా వివక్ష చూపించింది. వారి వీసాలను, అక్రిడేషన్ ను నిరాకరించింది. దీని భారత్ స్పందించింది. క్రీడాకారులను అడ్డుకునేలా చైనా ఉద్దేశపూర్వకంగానే ఈపని చేసిందని నిరసన తెలియజేసింది. అరుణాచల్ ప్రదేశ్ కూడా భారత్ లో అంతర్భాగమేనని...భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినధి అరిందమ్ బాగ్చీ స్పష్టం చేశారు. ఇలా అడ్డుకోవడం క్రీడా స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నట్లు భారత విదేశాంగ మంత్రి ప్రకటించింది.

ఇటీవల జరిగిన జీ20 సమావేశాలకు ముందు స్టాండర్డ్ మ్యాప్స్ పేరుతో అరుణాచల్ ప్రదేశ్, లద్దాక్ ప్రాంతాలను తమ మ్యాపులో కలిపేసుకుని చూపించింది. ఇది రెండు దేశాల మధ్య వివాదాలకు దారి తీసింది. చైనా ఎప్పటి నుంచో అరుణాచల్ ప్రదేశ్ ని టిబెట్ లో భాగమని వాదిస్తోంది. దానిని భారత్ కూడా ధీటుగా అడ్డుకుంటోంది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని ఫైట్ చేస్తోంది.

ఇక అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులను అడ్డుకున్న విషయంలో చైనా కూడా స్పందించింది. చట్టబద్ధంగా ఆసియా గేమ్స్ లో చైనా అన్ని దేశాల అథ్లెట్లను స్వాగతిస్తోందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినధి మావోనింగ్ అన్నారు. కానీ అరుణాచల్ ప్రదేశ్ ను మాత్రం చైనా ప్రభుత్వం గుర్తించలేదని చెప్పుకొచ్చారు. నైరుతి చైనా అయిన జిజాంగ్ అటానమస్ రీజియన్ దక్షిణ భాగం జాంగ్నాన్ చైనా భూభాగంలో అంతర్భాగమని మావోనింగ్ వ్యాఖ్యానించారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు.  దీనికి సంబంధించి అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.

New Update
iPHONE 16 Trump Tariffs

iPHONE 16 Trump Tariffs Photograph: (iPHONE 16 Trump Tariffs)

గత పది రోజులుగా ప్రపంచం మొత్తం టారీఫ్ ల వార్ తో దడదడలాడిపోతోంది. టారీఫ్ లతో దాదాపు అన్ని దేశాలనూ బెంబేలెత్తించారు. అయితే రెండు రోజు క్రితం ఈ సుంకాలకు 90 రోజుల బ్రేక్ ను కల్పిస్తూ అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇందులో చైనాను మాత్రం కలపలేదు. దీంతో మిగతా దేశాలన్నీ కాస్త ఊపిరి పీల్చుకున్నా చైనాతో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే తాజాగా సుంకాల విషయంలో మరో కీలక నిర్ణయం ప్రకటించింది అమెరికా. 

ఫోన్లు, కంప్యూటర్ల మీద..

అమెరికా మీద చైనా 125 శాతం, అమెరికా 145 శాతం సుంకాలను విధించుకుంటున్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తుల మీద 145 ఉంటాయి కానీ స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల మీద కాదంటూ ఒక కీలక ప్రకటన చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్‌ డ్రైవ్‌లు, కంప్యూటర్‌ ప్రాసెసర్లు, మెమొరీ చిప్‌లు, సెమీ కండక్టర్లు, సోలార్‌ సెల్స్‌, ఫ్లాట్‌ టీవీ డిస్‌ప్లేలు వంటి వాటిని ఈ ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయి. అమెరికాకు చెందిన యాపిల్ సంస్థకు సంబంధించి ప్రోడక్ట్స్ ఎక్కువ శాతం చైనా నుంచే వస్తాయి. 

యాపిల్ కంపెనీకి ఊరట..

సుంకాల పెంచడంతో స్మార్ట్ ఫోన్లు, యాపిల్ ఫోన్లు ధరలు పెరుగుతాయని వినియోగదారుల్లో ఆందోళన పెరిగింది. దీంతో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కోసం అమెరికా వాసులు స్టోర్లకు కూడా పరుగెత్తారు. కానీ ఇప్పుడు అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. నిజానికి ప్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ఉత్పత్తుల మీద ప్రతీకార సుంకాలను పెంచాలంటే అవన్నీ అమెరికాలోనే తయారు చేయాలి. కానీ అక్కడ ఇవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నట్టుండి తయారీ కంపెనీలను పెట్టడం కూడా  కుదరదు.  దీనికి కొన్నేళ్ళు సమయం పడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. అమెరికా సుంకాల నిర్ణయంతో అత్యధికంగా నష్టపోయిన యాపిల్ కంపెనీ...ఇప్పుడు తాజా నిర్ణయంతో హమ్మయ్య అనుకుంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.

 today-latest-news-in-telugu | usa | china | trump tariffs | apple | i-phone

Also Read: SRH VS PBKS: ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడింది భయ్యా.. సన్‌రైజర్స్ ముందు భారీ టార్గెట్

 

Advertisment
Advertisment
Advertisment