ISRO: నేల మీదకు జాబిల్లి..చంద్రయాన్ 4,5 లక్ష్యం

చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చంద్రయాన్ 4, 5 మీద దృష్టి పెట్టింది. వీటి ద్వారా భూమి మీదకు జాబిల్లిని తీసుకురావడమే లక్ష్యమని చెబుతున్నారు ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్. 2028లో వీటిని ప్రయోగించనున్నారు.

New Update
చంద్రయాన్-3 లాంచింగ్ విజయవంతం.. ఇస్రో ఖాతాలో మరో మైలురాయి

Chandrayan-4,5: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తమ నెక్ట్స్ ప్రయోగాలకు సిద్ధం అవుతోంది. చంద్రయాన్ –3 సక్సెస్ అవడంతో మరిన్ని మూన్ మిషన్లను చంద్రుని మీదకు పంపించాలని నిర్ణయించుకుంది. వీటి కోసం తయారీ కూడా మొదలుపెట్టేసింది. చంద్రయాన్ 4, 5 మిషన్లకు సంబంధించిన డిజైన్లు ఇప్పటికే పూర్తయ్యాయని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ఇవి రెండు చంద్రయాన్–3కు కొనసాగింపుగా ఉంటాయని ఆయన చెప్పారు.

చంద్రయాన్‌-4 ప్రయోగాన్ని 2028లో నిర్వహించాలనేది ఇస్రో లక్ష్యంమని చెప్పారు ఛైర్మన్ సోమనాథ్. చంద్రుఇ ఉపరితలంపై నుంచి శిలలు, మట్టి నమూనాలను సేకరించి వాటిని భూమి మీదకు తీసుకురావడమే లక్ష్యమని అన్నారు. అలా తీసుకొచ్చిన వాటి మీద సమగ్ర విశ్లేషణ చేస్తామని చెప్పారు.ఇదే చంద్రయాన్‌-4 ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఇందులో ల్యాండర్‌, అసెండర్‌, ట్రాన్స్‌ఫర్‌ మాడ్యూల్‌, రీ ఎంట్రీ మాడ్యూల్‌ వంటి కీలక భాగాలు ఉంటాయని చెప్పారు. ల్యాండర్‌‌ చంద్రుడి మీద దిగుతుంది. అదే ఉపరిలం మీద నుంచి నమూనాలను సేకరిస్తుంది. ఇక అసెండర్ సేకరించిన నమూనాలను చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళుతుంది. అసెండర్‌ తీసుకొచ్చిన నమూనాలను ఈ ట్రాన్స్‌ఫర్‌ మాడ్యూల్‌ రీ ఎంట్రీ మాడ్యూల్‌కు తరలించడం ట్రాన్స్‌ఫర్ మాడ్యూల్ బాధ్యతని వివరించారు. రీ ఎంట్రీ మాడ్యూల్‌ చంద్రుడిపై సేకరించి న శాంపిళ్లను భూమిపైకి చేరుస్తుందని తెలిపారు.

ఇక చంద్రయాన్‌‌–5 గురించి చెబుతూ దీనిని భారత్ దీనిని జపాన్‌తో కలిసి సంయక్తంగా చేపడుతుందని చెప్పారు ఛైర్మన్ సోమనాథ్. ఇందులో దీనిద్వారా చంద్రుని మీద ఎప్పుడూ నీడలోనే ఉండే మంచు ప్రాంతాలను అన్వేషిస్తాము. ఈ మిషన్‌లో ఇస్రో రూపొందించిన ల్యాండర్‌తోపాటు జపాన్‌ అభివృద్ధి చేసిన 350 కిలోల రోవర్‌ కీలక పాత్ర పోషిస్తాయి. చంద్రుడి పై సవాళ్లతో కూడిన ప్రాంతాలను అన్వేషించడానికి వీలుగా వీటిని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

Also Read: PM Modi: భారత్‌ది ఎప్పుడూ శాంతి మార్గమే‌‌–ప్రధాని మోదీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

India-China: ట్రంప్ టారిఫ్‌ ఎఫెక్ట్.. భారత్, చైనా దోస్తీ

ట్రంప్‌ ట్రేడ్‌వార్‌ను చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 వరకు భారత పౌరులకు 85 వేలకు పైగా వీసాలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపరిచేందుకు ఇది కీలకమైన అడుగని చైనా ఎంబసీ తెలిపింది.

New Update
Trump and Jinping

Trump and Jinping

వలసదారుల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. వీసా రూల్స్‌ను ఆయన మరింత కష్టతరం చేశారు. మరోవైపు ఇప్పటికే ప్రతీకార సుంకాలతో ట్రంప్‌ ట్రేడ్‌ వార్‌ను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కానీ ఈ అవకాశాన్ని  చైనా తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు వీసా గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఏప్రిల్ 9 వరకు చైనా రాయబార కార్యాలయం భారత పౌరులకు 85 వేలకు పైగా వీసాలు జారీ చేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపరిచేందుకు ఇది కీలకమైన అడుగని చైనా ఎంబసీ తెలిపింది.  

Also Read: హైదరాబాద్‌లో మరో డిజిటల్ అరెస్ట్.. మహిళా ప్రొఫెసర్‌ నుంచి రూ. కోట్లు దోచేసిన కేటుగాళ్లు!

అంతేకాదు భారత పౌరుల కోసం చైనా చాలావలకు వీసా సడలింపులు చేసింది. ఆ దేశాన్ని ప్రయాణాన్ని మరింత ఈజీగా చేసింది. భారతీయులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోకుండానే నేరుగా వీసా సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. తక్కువ రోజులు చైనాలో ప్రయాణించే వాళ్లకి బయోమెట్రిక్ డేటా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. దీంతో ఇది వీసా ప్రాసెసింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తోంది.  

చైనా వీసా తక్కువ ధరకు దొరకడం వల్ల భారతీయలకు ప్రయాణం మరింత సులవుగా మారింది. వీసా జారీ చేసేందుకు పట్టే సమయాన్ని కూడా తగ్గించేశారు. ఇది వ్యాపార,విహార యాత్రకు వెళ్లేవాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చైనా, భారత పర్యాటకులకు ఆకర్షణీయమైన సాంస్కృతిక కార్యక్రమాలు, పండుగలు, పర్యాటక ప్రదేశాలను ఇది ప్రోత్సహిస్తోంది. 

Also Read: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. టోల్ చెల్లింపుల్లో భారీ మార్పులు

మరోవైపు ట్రంప్ టారిఫ్‌ల పేరుతో ట్రేడ్‌వార్ మొదలుపెట్టారు. దీంతో చైనా భారత్‌ల మధ్య వాణిజ్య సంబంధాలు ద్వైపాక్షిక లాభాలపై ఆధారపడి ఉన్నాయని చైనా దౌత్యవాణిజ్య ప్రతినిధి యూ జింగ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. '' చరిత్రలో ప్రతీకార సుంకాలు, వాణిజ్య యుద్ధాల్లో ఎవరూ గెలవలేదు. ప్రపంచ దేశాలు అన్నీకలిసి సంప్రదింపులు, బహుళపక్ష సూత్రాలపై నిలపడి ఏకపక్ష చర్యలు, రక్షణవాద విధానాలకు వ్యతిరేకంగా ఉండాలని'' అన్నారు.  

 rtv-news | trump | china | national-news 

Advertisment
Advertisment
Advertisment