Union Budget 2024: పవన్ ఆశించినట్లే జరిగింది.. బడ్జెట్ పై నాదెండ్ల ఫస్ట్ రియాక్షన్!

ఏపీకి కేంద్రం భారీగా నిధులు కేటాయించడంపై నాదెండ్ల మనోహర్ సంతోషం వ్యక్తం చేశారు. బడ్జెట్ విషయంలో పవన్ కల్యాణ్ ఆశించిందే జరిగిందన్నారు. జనసేన డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలు కోసం అంకిత భావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.

New Update
Union Budget 2024: పవన్ ఆశించినట్లే జరిగింది.. బడ్జెట్ పై నాదెండ్ల ఫస్ట్ రియాక్షన్!

Nadendla Manohar: ఏపీకి కేంద్రం భారీ నిధులు కేటాయించడంపై మంత్రి నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవణ్ కళ్యాణ్ (Pawan Kalyan) ఏదైతే ఆశించాడో అదే జరిగిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు మనోహర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు ఒక స్థానం కల్పించింది. ఏదైతే పవణ్ కళ్యాణ్ ఆశించాడో అదే జరిగింది. గత ప్రభుత్వంలో ఏపీ అనాథ రాష్ట్రంగా మిగిలింది. టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ కూటమి రాష్ట్ర అభివృధి బాధ్యత తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ను పట్టించుకోవడంలేదని ప్రజలు అనుకోకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలని కేంద్రాన్ని అడిగినందుకు అభినందిస్తున్నా. ఎటాంటి స్వార్థం లేకుండా ప్రజలు కోసం అంకిత భావంతో పనిచేస్తాం. పవన్ కళ్యాణ్ ఈరోజు అసెంబ్లీలో చెప్పిన మాటను కచ్చితంగా పటిస్తామన్నారు.

ఇది కూడా చదవండి: AP Speaker Ayyannapathrudu: ఏపీ స్పీకర్ అయ్యన్న సంచలన రికార్డు.. అభినందనల వెల్లువ!

ఇక ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో జనసేన డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శాసనసభాపతికి పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సమాచారం అందించారు. పార్టీ తరఫున చీఫ్‌ విప్‌గా నెల్లిమర్ల శాసనసభ్యురాలు లోకం మాధవి, కోశాధికారిగా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కార్యదర్శులుగా విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్‌లు నియమితులయ్యారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori - Sri Varshini: ఎంత ధైర్యం.. ప్రభాస్‌ను ఏంటి భయ్యా అఘోరీ ఇలా అనేసింది- దుమ్మెత్తిపోస్తున్న ఫ్యాన్స్!

నాకు ప్రభాస్ అంటే ఇష్టం. ఆయన్ను డైరెక్ట్‌గా చూసే రోజు ఎప్పుడొస్తుందో? కలిస్తే ఒక్క సెల్ఫీ అడుగుతాను అని వర్షిణి తెలిపింది. వెంటనే అఘోరీ ఏంటీ ప్రభాస్ గోల ఆపు అనేసింది. అది కాస్త ప్రభాస్ ఫ్యాన్స్‌కు కోపం తెప్పించింది. దీంతో అఘోరీని ట్రోల్ చేస్తున్నారు.

New Update

అందరూ ఊహించినట్లుగానే లేడీ అఘోరీ-శ్రీవర్షిణీ మ్యారేజ్ చేసుకున్నారు. అదీ ఒకసారి కాదు ఏకంగా రెండు సార్లు వివాహం చేసుకున్నారు. మొదటి సారి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్‌లో బ్రహ్మముహుర్తాన తెల్లవారిజామున 4 గంటలకు వర్షిణీ మెడలో అఘోరీ తాళి కట్టింది. రెండోసారి వర్షిణీ ఇంట్లో ఫ్యామిలీ సమక్షంలోనే బంగారం చైన్‌ను మెడలో వేసి మ్యారేజ్ చేసుకుంది. ఇది గడిచి చాలా రోజులే అయింది. కానీ ఇప్పుడే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

Also Read :  కల్యాణ్‌రామ్‌ ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’ ట్రైలర్‌ చూశారా? కెవ్ కేక

ప్రభాస్ అంటే ఇష్టం

వర్షిణీ మళ్లీ అఘోరీ చెంతకు చేరుకుంది. అక్కడ నుంచి RTVతో లైవ్ లో మాట్లాడిన అఘోరీ-శ్రీవర్షిణీ.. తమ ఇష్యూలోకి ప్రభాస్‌ను లాగారు. ప్రభాస్ లాంటి అబ్బాయిని పెళ్లిచేసుకోవాలనిపించలేదా? అనే ప్రశ్నకు వర్షిణీ మాట్లాడుతూ.. ‘‘ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రభాస్ లాంటి అబ్బాయి ఉండడని అనుకున్నాను. కేవలం హీరోస్‌లోనే ఇష్టం.. రియల్ లైఫ్‌లో కాదు. 

Also Read :  'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

ప్రభాస్‌ను డైరెక్ట్‌గా ఎప్పుడూ చూడలేదు. ఆయన్ను డైరెక్ట్‌గా చూసే రోజు ఎప్పుడొస్తుందా? అని ఎదురుచూస్తున్నాను. ప్రభాస్‌ను ఫస్ట్ టైం షూటింగ్ లో కానీ ఎక్కడైనా కలిస్తే ఆయన దగ్గరకి వెళ్లి.. హాయ్ సర్ ఐయామ్ బిగ్ ఫ్యాన్‌ ఆఫ్ యు డార్లింగ్ అని చెప్తాను. అంతేకాకుండా ఒక సెల్ఫీ కూడా అడుగుతాను. అఘోరీని కూడా డార్లింగ్ అని పిలిస్తాను’’ అని అఘోరీని డార్లింగ్ అని పిలిచింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Also Read :  ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..

అయితే వర్షిణీ ప్రభాస్ గురించి మాట్లాడుతుండగా.. సరిగ్గా అప్పుడే అఘోరీ వచ్చి ఏంటీ ప్రభాస్ గోల అని లైవ్‌లో అనేసింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు చిర్రెత్తిపోయింది. ఒక్కసారిగా వారు షాక్ అయిపోయారు. తమ అభిమాన హీరో గురించి అఘోరీ అలా అనడం ఏంటని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. 

Also Read :  'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి

(aghori | sri varshini | aghori sri varshini | Aghori Sri Varshini Lov | latest-telugu-news | telugu-news)

Advertisment
Advertisment
Advertisment