Bank Jobs : ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్.. 3,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్!

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు ప్రకటించింది. మొత్తం 3వేల పోస్టులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 6.

New Update
IBPS Clerk: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో 6128 ఉద్యోగాలు!

Latest Bank Jobs : సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్‌(Central Bank Of India Recruitment) ను స్టార్ట్ చేసింది. 3,000 అప్రెంటిస్ పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ మార్చి 06, 2024. ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు www.nats.education.gov.in పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి.

అర్హతలు:
దరఖాస్తు చేసే అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ(Bachelor Degree) ని కలిగి ఉండాలి.

దరఖాస్తు రుసుము:
PWBD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 400. SC/ST/మహిళా అభ్యర్థులు/EWS అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 600. మిగతా అభ్యర్థులందరికీ దరఖాస్తు రుసుము రూ. 800.

దరఖాస్తుదారులందరూ తప్పనిసరిగా www.nats.education.gov.in పోర్టల్‌ని విజిట్ చేయాలి. అక్కడ 'సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అప్రెంటిస్‌షిప్' ఆన్‌లైన్ అప్లికేషన్‌ను సబ్మిట్‌ చేయాలి.

దరఖాస్తు చేయడానికి దశలు:

--> ముందుగా అధికారిక వెబ్‌సైట్ nats.education.gov.in ని విజిట్ చేయండి.

--> పోర్టల్‌లో నమోదు చేసుకోండి

--> అప్లికేషన్‌తో కొనసాగండి(Continue To Application).

--> 'సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్‌షిప్' అప్లికేషన్‌ ఫారమ్‌ కనిపిస్తుంది.

--> 'అప్లై' బటన్‌పై క్లిక్ చేసి లాగిన్ చేయండి.

--> ఫారమ్‌ను పూరించండి

--> డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయండి

--> రుసుము చెల్లించి సబ్మిట్ చేయండి.

--> కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి..ఫ్యూచర్‌ పర్పస్‌ కోసం ప్రింటవుట్ తీసుకోండి.

Also Read : ఏపీ టెట్‌ హాల్‌టికెట్స్ రిలీజ్.. డౌన్ లోడ్ లింక్ ఇదే!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

All India Civil Services ఇప్పటివరకు ఫోన్ వాడలేదు.. ఆల్ ఇండియా సివిల్స్ లో తెలంగాణ అమ్మాయికి 11వ ర్యాంకు

వరంగల్ కి చెందిన సాయి శివాని అనే విద్యార్థిని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. ఇటీవలే తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లోనూ సాయిశివాని రాష్ట్రస్థాయిలో 21వ ర్యాంకు, జోనల్ 1లో 11వ ర్యాంకు సాధించింది.

New Update

All India Civil Services సాధారణంగా చాలామంది సివిల్స్ క్లియర్ చాలా కష్టమని భావిస్తారు. కానీ కస్టపడి చదివితే సాధ్యం కానిది ఏదీ ఉండదు అని మరో సారి నిరూపించింది ఈ అమ్మాయి. తెలుగు తేజం సాయిశివాని ఆల్ ఇండియా సివిల్స్ లో 11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. 

Also Read: Viral News: ఫోన్ తీసుకుందని.. టీచర్‌ను చెప్పుతో కొట్టి, ల*జే అంటూ దాడిచేసిన విద్యార్థిని: (వీడియో)

సివిల్స్ లో ఆల్ ఇండియా 11వ ర్యాంకు 

వరంగల్ కి చెందిన సాయి శివాని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. కడప జిల్లా ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తిచేసిన సాయి శివాని.. ఆ తర్వాత సివిల్స్ కోసం ప్రిపేర్ అవడం మొదలు పెట్టింది. కలెక్టర్  కలతో అహర్నిశలు కష్టపడింది. ప్రణాళికతో రోజుకు 12 గంటలు చదివింది. మొదటి సారి విఫలమైనా.. నిరాశ చెందలేదు. మళ్ళీ కష్టపడి చదివింది. రెండో ప్రయత్నంలో ఆల్ ఇండియా స్థాయిలో  11వ ర్యాంకు సాధించి సత్తాచాటింది. రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది.  2023లో ఐదు మార్కులతో సాయిశివాని ప్రిలిమ్స్ మిస్సయింది. తిరిగి 2025లో తన కల నెరవేర్చుకుంది. 

Also Read: Pahalgam Attack: పహల్గాంలో నా బర్త్ డే వేడుకలు, షూటింగ్ కూడా.. విజయ్ దేవరకొండ సంచలన ట్వీట్!

ఈ సందర్భంగా సాయిశివాని మాట్లాడుతూ.. ఇంతవరకు ఫోన్ వాడకపోవడం.. సోషల్ మీడియాకు దూరంగా ఉండడమే తన కల నెరవేరడానికి కారణమని తెలిపింది. కలెక్టర్ కావాలనే లక్ష్యంతో కఠోర సాధన చేశాను. రోజుకు 12 గంటలు చదివాను. ఒత్తిడిని జయించడానికి యోగా, భగవద్గీత చదివేదాన్ని. ఈ విజయంలో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహకారం మరువలేనిది అని చెప్పింది. 

latest-news

Also Read: AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

Also Read: Viral Video అందరి ముందు భుజం పై నుంచి విజయ్ చేయి తీసేసిన విద్యార్ధి.. ఏం జరిగిందంటే

Advertisment
Advertisment
Advertisment