Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. చెల్లాచెదురైన మృతదేహాలు!

ఏపీ కర్నూల్ జిల్లా హోలేబీడు గ్రామ సమీంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తాపడి ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు అదోని వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

New Update
Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి

Car Accident : కర్నూలు జిల్లా (Kurnool District) ఆలూరు మండలం హోలేబీడు గ్రామ సమీంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఆదివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో రహాదారిపై జైలో కారు ప్రమాదానికి గురైంది. అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మందిలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు పిల్లలు స్వల్పంగా గాయాపడ్డారు. మృతుల్లో ఒక మహిళ ఉండగా.. మృతులు అదోని వాసులుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడివుండటం స్థానికులను కలచివేసింది. క్షతగాత్రులను ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి (Adoni Government Hospital) కి తరలించారు. ప్రమాదం ఎలా జరిగిందో అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కారు వేగంగా వచ్చి బోల్తాపడిందా? లేక ఏదైన వెహికిల్ ఢికొట్టి వెళ్లిందా అనే కోణంలో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు..ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌!

Advertisment
Advertisment
తాజా కథనాలు