Kavitha: ఈరోజు జైలు నుంచి కవిత విడుదల!

మనీలాండరింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.కవిత బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ఈసారి కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

New Update
MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్.. నేడే తీర్పు!

BRS MLC Kavitha: మద్యం కుంభకోణం కేసులో రీసెంట్‌గా ఆమ్ ఆద్మీ నేత మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్, మద్యం కుంభకోణం కేసుల్లో జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావొచ్చని ఆ పార్టీ భావిస్తోంది. ఈరోజు సుప్రీంకోర్టులో కవిత బెయిల్ మీద విచారణ జరగనుంది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. దర్యాప్తు సంస్థలు అడ్డు చెప్పకపోతే కచ్చతంగా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. కవిత అనారోగ్య కారణాల వల్ల కూడా బెయిల్ ఇవ్వాలనే యెచనలో సుప్రీంకోర్టు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నమ్మకంతోనే కవిత అన్న, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 25 మంది ఎమ్మెల్యేలు, ముఖ్య బీఆర్ఎస్ నేతలతో ఢిల్లీకి వెళ్ళారని సమాచారం. అందరితో కలిసి కవితకు గ్రాండ్‌గా వెల్క్మ్ చెప్పడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక కవితను హైదరాబాద్ తీసుకువచ్చాక కూడా బీఆఎస్ శ్రేణులు ర్యాలీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మద్యం పాలసీ కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్‌ చేసింది. ఇదే కేసులో ఏప్రిల్‌ 15న సీబీఐ అరెస్టు చేసింది. గత కొన్ని నెలలుగా కవిత తీహార్ జైలులో ఉన్నారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్యం బాగా పాడయిందని, చాలా సన్నగా అయిపోయారని వార్తలు వచ్చాయి.

Also Read: Ukraine: క్షిపణులతో రష్యా మళ్ళీ దాడి..సాయం చేయమంటున్న జెలెన్ స్కీ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

BIG BREAKING: ‘సింగపూర్‌లో పవన్ కళ్యాణ్ కొడుక్కి ప్రధాని మోదీ సాయం’

అగ్ని ప్రమాదంలో పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మార్క్ శంకర్‌ను కాపాడిన సింగపూర్ స్కూల్ సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు. పవన్‌‌తో మోదీ మాట్లాడి.. అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు.

author-image
By K Mohan
New Update
PM modi pK

PM modi pK Photograph: (PM modi pK)

సింగపూర్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు చదువుతున్న స్కూల్‌లో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారిక సమాచారాన్ని వెల్లడించారు. ప్రధాన మంత్రి మోదీ కూడా పవన్ కళ్యాన్‌కు ఫోన్ చేసి మాట్లాడారని ఆయన చెప్పారు. ప్రమాదం గురించి, బాబు ఆరోగ్య పరిస్దితి గురించి మోదీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఆరా తీశారు. చికిత్స పొందుతున్న పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ప్రమాదంలో పవన్‌ కుమారుడు మార్క్ శంకర్ గాయపడినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఈరోజు రాత్రి 7గంటలకు ఫ్లైట్‌లో సింగపూర్ బయలుదేరనున్నారు.

Also read: 71మంది చనిపోయిన బాంబు బ్లాస్ట్ కేసులో నలుగురికి జీవిత ఖైదు

స్కూల్ అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న పవన్ చిన్న కొడుకు మార్క్ శంకర్‌ను కాపాడిన సిబ్బందికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో బాలుడికి చికిత్స కొనసాగుతోందని జనసేన లీడర్ తెలిపారు. జరిగిన ప్రమాదంపై పవన్‌ కళ్యాణ్‌తో మోదీ మాట్లాడారని ఆయన చెప్పారు. అవసరమైన సహాయం అందిస్తామని ప్రధాని మోదీ చెప్పారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Also read: Dubai Crown Prince: ఢిల్లీకి చేరుకున్న అత్యంత సంపన్నుడు దుభాయ్ రారాజు.. ఎందుకంటే?

Advertisment
Advertisment
Advertisment