Harish Rao: ప్రజలు ఊరుకుంటారా?.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు ఊరుకుంటారా? అని హరీష్ రావు అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు 24 గంటల కరెంట్ తెచ్చింది కేసీఆరే అని అన్నారు.

New Update
Harish Rao: ప్రజలు ఊరుకుంటారా?.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

Harish Rao: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించినారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి మొక్కవోని పోరాటం వల్లే వచ్చిందని అన్నారు. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆరే అని పేర్కొన్నారు. కేసీఆర్ లేకుండా తెలంగాణ లేదు, కేసీఆర్‌ను తెలంగాణను ఎవరూ వేరు చేయలేరని అన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే మన నీళ్లు మనకు వచ్చినయి, మన గ్రామలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు.

ALSO READ: రైతులకు రేవంత్‌ సర్కార్‌ గుడ్‌ న్యూస్‌

కేసీఆర్ వల్లే ఇదంతా..

తెలంగాణ వచ్చింది కాబట్టే ఆసరా పెన్షన్, రైతుబంధు, రైతు బీమా వచ్చిందని హరీష్ రావు అన్నారు. కళ్యాణ లక్ష్మి వచ్చింది, దివ్యాంగుల పెన్షన్ వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది.. ఇవన్నీ తెచ్చింది మన కేసీఆర్ అని అన్నారు. ప్రజాతీర్పును అంగీకరిస్తూ బీఆర్ఎస్ పార్టీకి వేసిన ప్రతి ఓటు కోసం కృతజ్ఞతతో పనిచేస్తామన్నారు. మనోహరాబాద్‌ను మండలం చేసింది కేసీఆర్. కాని ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కొత్త మండలాలను, జిల్లాలను రద్దు చేస్తుందట అని పేర్కొన్నారు.

కాంగ్రెస్ అబద్ధాలు..

కొత్త విద్యుత్ పాలసీ తెస్తామని కాంగ్రెస్ అంటుందని.. కొత్త పాలసీ అంటే పాత కాంగ్రెస్ కరెంటు తెస్తారా? అని చురకలు అంటించారు. కేసీఆర్ రైతులకు ఇచ్చిన 24 గంటల కరెంట్ పై కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గజ్వేల్‌ డెవలప్‌మెంట్ అథారిటీని రద్దు చేశారని ఫైర్ అయ్యారు. మనం చేసిన అభివృద్ధిని కక్షతో అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

ప్రజలు ఊరుకుంటరా?...

కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుకుందామని.. నెరవేర్చకపోతే ప్రజలు ఊరుకుంటరా? అని హరీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు ప్రజలంటే రాజకీయం, బీఆర్ఎస్‌కు ప్రజలంటే బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రయోజనాల కోసం ఢిల్లీలో కొట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని స్పష్టం చేశారు. ఓడినంత మాత్రన ప్రజలను వదిలేయం అని అన్నారు. వారి పక్షాన పోరాడతామని.. బీఆర్ఎస్‌కు ప్రజలే దేవుళ్లని అన్నారు. బట్ట కాల్చి బీఆర్ఎస్ మీద వేస్తామంటే ప్రజలు ఊరుకోరని.. ఆరోపణలు మాని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని అన్నారు. ఎన్నికల హామీల అమలు కోసం ప్రజల పక్షాన అసెంబ్లీలో గట్టిగా పోరాడతాం అన్నారు.

ALSO READ: చంద్రబాబుతో భేటీ.. షర్మిల ఏమన్నారంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు