Mahadev Betting App: మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ కేసులో నటుడు సాహిల్ ఖాన్ అరెస్టు..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ స్కామ్‌లో తాజాగా బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్‌గడ్‌లో ఆదివారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సాహిల్ ఖాన్ పిటిషన్‌ వేయగా.. న్యాయస్థానం నిరాకరించింది.

New Update
Mahadev Betting App: మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ కేసులో నటుడు సాహిల్ ఖాన్ అరెస్టు..

Actor Sahil Khan Arrested in Mahadev Betting App Case: మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ స్కామ్‌లో తవ్విన కొద్ది నిందితులు బయటికి వస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఛత్తీస్‌గడ్‌లో ఆదివారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకున్నారు. సైబర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన సిట్‌ సాహిల్‌.. అతడిని కస్టడీలోకి తీసుకుంది. సాహిల్ ఖాన్ ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ఇటీవల బాంబే హైకోర్టును ఆశ్రయించగా కోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి సిట్‌ 2023 డిసెంబర్‌లోనే సాహిల్ ఖాన్‌కు సమన్లు జారీ చేసింది. అయినప్పట్టికీ అతడు హాజరు కాలేదు.

Also Read: మోదీ.. ప్రజల మనోభావాలు రెచ్చగొడుతున్నారు: సిద్ధరామయ్య

బెయిల్ నిరాకరణ
ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఇటీవల సాహిల్ ఖాన్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. తాను సెలబ్రిటీ కావడం వల్లే యాప్‌కు బ్రాండ్‌ ప్రమోటర్‌గా పనిచేశానని చెప్పారు. యాప్‌ ద్వారా జరిగే కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని పిటిషన్‌లో చెప్పాడు. కానీ, పోలీసులు మాత్రం అతడు బెట్టింగ్‌ యాప్‌ సహ-యజమానిగా చెప్పుకొచ్చారు. సాహిల్ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు అతడికి బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. బెట్టింగ్ యాప్‌లో అక్రమం జరిగిందని.. పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని పేర్కొంది. ఫేక్ బ్యాంకు ఖాతాలను సృష్టించి.. నకిలీ సిమ్‌ కార్డులో సంప్రదింపులు చేసినట్లు గుర్తించారు.

మొత్తం 15 కోట్ల అవినీతి..
పిటిషన్‌దారుకు 'ది లయన్ బుక్247'తో నేరుగా సంబంధం ఉందని ధర్మాసనం తెల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తాజాగా ముంబై పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అయితే పలు బాలివుడ్ చిత్రాల్లో నటించిన సాహిల్‌ ఖాన్‌.. ప్రస్తుతం ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. అంతేకాదు సొంతంగా ఓ కంపెనీ ఏర్పాటు చేసుకోని ఫిట్‌నెస్ సప్లిమెంట్స్‌ను విక్రయిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ మహదేవ్ బెట్టింగ్ యాప్‌ ద్వారా దాదాపు రూ.15 వేల కోట్లు అవినీతి జరిగినట్లు ప్రత్యేక దర్యాప్తు సంస్థ (SIT) గుర్తించింది.

67 బెట్టింగ్ వెబ్‌సైట్లు..
దాదాపు 67 బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌లు సృష్టించి క్రికెట్, ఫుట్‌బాల్, తీన్‌పత్తీతో పాటు మరికొన్ని గేమ్స్‌లో బెట్టింగ్/గ్యాంబ్లింగ్ చేసినట్లు తెలిపారు. ఈ బెట్టింగ్ యాప్స్‌లోకి సామాన్యులను ఆకర్షించేందుకు సెలబ్రిటీలతో ప్రమోట్ చేయించినట్లు ఆరోపించారు. అయితే దీనిపై సామాజిక కార్యకర్త ప్రకాశ్ బంకర్‌ గతంలో ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ స్కామ్ బయటపడింది. 2023 నవంబర్‌లో మాతుంగ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఈ కేసు ప్రధాన నిందితుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ను గత ఏడాదే దుబాయ్‌లో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.

Also read: మరో నల్లజాతీయుడిపై పోలీసుల కర్కశత్వం.. ఊపిరాడక బాధితుడు మృతి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడిలో 28 మంది మృతి.. తనికెళ్ల భరణి కన్నీటి కవిత

పహల్గాం టెర్రరిస్టు అటాక్‌పై సినీ నటుడు తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక కన్నీటి కవితను షేర్ చేసారు. కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది! అంటూ ఆ కవిత సాగుతుంది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
Pahalgam Terror Attack

Pahalgam Terror Attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అందమైన ప్రదేశాలను చూసేందుకు వచ్చిన టూరిస్టులపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో దాదాపు 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిమేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు సాక్ష్యులు చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

అమాయక ప్రజల మృతిపై ఇప్పటికే సినీ సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలు సంతాపం తెలిపారు. ఈ చర్యలకు పాల్పడిన వారిని అస్సలు వదలకూడదని.. కఠినంగా శిక్షించాలంటూ భారతీయులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ తనికెళ్ల భరణి స్పందించారు. ఈ మేరకు ఒక కవితతో ఉన్న పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

కన్నీటి కవిత

కాశ్మీరంలోనే కుంకం పువ్వెందుకు పూస్తుందో నా కర్ధమైపోయింది!
అక్కడ ఉన్నట్టుండి పాకే పాకే పసిబిడ్డ నెత్తురు ముద్దై పోతుంది. 

సామగానం చేసే కాశ్మీరీ పండితుల కంఠాల్లోంచి వేదం ఆగి- రుధిరం బైటికొస్తుంది.

అక్కడ రేపు పల్లకీ లెక్కి ఊరేగాల్సిన పెళ్ళికొడుకులు ఇవాళే పాడెక్కుతారు...

ఆ లోయలో హిమాలయాలు సైతం మూర్తీభవించిన వైధవ్యాల్లా ఉంటాయ్

భరతమాత కిరీటం వొరుసుకునీ నిరంతరం అక్కడ నెత్తురోడుతూ ఉంటుంది !

బుద్ధుడు కూడా కళ్ళూ నోరూ మూసుకుని మళ్ళీ అంతర్ముఖుడౌతాడు !!

ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం రాసిన కవిత, ఇంకా తడిగానే ఉంది!! అంటూ తనికెళ్ల భరణి ఒక కవితను పంచుకున్నారు. ఇప్పుడది నెట్టింట వైరల్‌గా మారింది. 

 

pahalgam | Pahalgam attack | pahalgam breaking news | tanikella-bharani | latest-telugu-news | telugu-news

Advertisment
Advertisment
Advertisment