Tea Tips: టీ చేసేటప్పుడు మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా? అయితే మీరు విషం తాగినట్లే..!

'టీ'ని ఆరు నిమిషాల కంటే ఎక్కువ మరిగించకూడదు. టీ ఆకులను పదే పదే ఉపయోగించడం, అదే పాన్‌లో మళ్లీ మళ్లీ టీ చేయడం, 'టీ'ని ఎక్కువసేపు మరిగిచడం, సిద్ధంగా ఉన్న 'టీ'ని మళ్లీ మరిగించి తాగడం.. ఇవన్నీ ఆరోగ్యానికి విషపూరితం చేస్తాయి.

New Update
Tea Tips: టీ చేసేటప్పుడు మీరు కూడా ఈ తప్పు చేస్తున్నారా? అయితే మీరు విషం తాగినట్లే..!

Tea Tips: చలికాలంలో టీ ఔషధం ప్రభావాన్ని కలిగి ఉంటుంది. తలనొప్పిగా ఉంటే టీ తాగండి, జలుబు, దగ్గు ఉంటే టీ ఉపశమనాన్ని ఇస్తుంది. ఆఫీసులో అలసిపోయినట్లు అనిపిస్తే టీ తాగుతారు. టీ చేసేటప్పుడు కొంతమంది కొన్ని పొరపాటు చేస్తారు.టీ సరిగ్గా తయారు చేయకపోతే ఇబ్బందులు వస్తాయి. ఆర్ట్ మేకింగ్ టీ మీరు ఎప్పుడైనా చేశారా.? దానిని ప్రయోజనాలు వింటే ఆశ్చర్యపోతారు. అందరూ టీ చేస్తారు. అయితే.. అందరూ ఆరోగ్యకరమైన టీని తయారు చేయలేరు. టీ తయారుచేసేటప్పుడు మనం తరచుగా చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం. దాని వల్ల టీ ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తుంది. మీరు టీ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తే.. మీ ఉదయం, సాయంత్రం టీ విషంగా మారుతుంది. ప్రతిరోజూ వంటగదిలో తయారు చేసే టీ రుచి భిన్నంగా ఉంటుంది. కొందరికి అల్లం టీ, ఏలకుల టీ, స్ట్రాంగ్ టీ, ఎక్కువ పాలతో తాగటం ఇష్టం ఉంటుంది. అయితే.. టీ రుచి కోసమే కాకుండా ఆరోగ్యం కోసం కూడా తయారు చేసుకోవాలని గుర్తుచుకోవాలి. ఇప్పుడు సరైన పద్ధతితో టీని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

టీని ఇలా చేస్తే హాని ఉండదు

పర్ఫెక్ట్ టీ కోసం: ముందుగా పాన్‌లో పాలను మరిగించాలి. ఈ పాలు మరిగే లోపు మరొక పాన్‌లో 1 పెద్ద కప్పు నీటిని ఉంచాలి.
నీరు మరిగేటప్పుడు.. అందులో సుమారు 1 టీస్పూన్ టీ ఆకులు, అల్లం, యాలకులు, తుస్లీ, ఏదైనా టీపోడి వేయాలనుకుంటే మీ ఎంపిక ప్రకారం వేసుకోవాలి. తరువాత మీడియం మంట మీద కేవలం 5 నిమిషాలు మరిగించాలి.ఆపై అరకప్పు పాలు, రుచికి సరిపడ చక్కెర వేసుకోవాలి. ఇప్పుడు టీని 3 నుంచి 5 సార్లు ఎక్కువ మంట మీద మరిగించాలి.తరువాత గ్యాస్ ఆఫ్ చేయాలి. ఇలా తయారు చేసిన టీ వల్ల పెద్దగా హాని ఏం ఉండదు. 

అయితే.. టీ చేయడానికి ఉత్తమ మార్గం నీటిని మరిగించాలి. టీ ఆకులు, ఏదైనా ఫ్లేవర్ వేసి దానిని ఫిల్టర్ చేయడం. తర్వాత కప్పులో మరిగిన పాలు, పంచదార కలపాలి. ఇలా చేసే టీ ఆరోగ్యానికి అస్సలు హాని చేయదు. టీ తయారు చేసేటప్పుడు.. టీ చేయడానికి పట్టే సమయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. టీని ఆరు నిమిషాల కంటే ఎక్కువ మరిగించకూడదు. టీ ఆకులను పదే పదే ఉపయోగించడం, అదే పాన్‌లో మళ్లీ మళ్లీ టీ చేయడం, టీని ఎక్కువసేపు మరిగిచడం, సిద్ధంగా ఉన్న టీని మళ్లీ మరిగించి తాగడం.. ఇవన్నీ ఆరోగ్యానికి విషపూరితం చేస్తాయి.

ఇది కూడా చదవండి: ఇంట్లో తయారు చేసిన రూమ్ ఫ్రెషనర్ల గురించి తెలుసుకోండి!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Babu Mohan : రాజకీయాల నుంచి సేవారంగంవైపు... బాబుమోహన్‌ కీలక నిర్ణయం

 ప్రముఖ సినీ నటుడు బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఈ రోజు సేవా రంగంలోకి అడుగుపెట్టారు. తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు.

New Update
Babu Mohan

Babu Mohan

 ప్రముఖ సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ తెలియనివారుండరు. తన హాస్యనటనతో ఎందరినో అలరించిన ఆయన ఆ తర్వాత రాజకీయరంగ ప్రవేశం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రఏర్పాటు తర్వాత బీఆర్‌ఎస్‌ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ అనుకోని కారణాల వల్ల ప్రస్తుతం ఆయన ఏ పదవిలో లేరు. అయితే ఆయన ఈ రోజు మరో రంగంలోకి అడుగుపెట్టారు. అదే సేవా రంగం. అవును తన కుమారుడి జ్ఞాపకార్థం ‘పవన్ బాబు మోహన్ ఛారిటబుల్ ట్రస్ట్’ను స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలకు చేయూత అందిస్తామని ఆయన ప్రకటించారు. సోమవారం బషీర్ బాగ్‌ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఆవిర్భావ సమావేశంలో బాబు మోహన్ ట్రస్ట్ లక్ష్యాలు, కార్యక్రమాలను వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి పొందిన ఈ ట్రస్ట్.. నిరుపేదలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. నిరుద్యోగులకు చేయూత అందించడం కూడా ట్రస్ట్ ముఖ్య లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్నారు.

Also Read :  నీకు తక్కువ జీతం పిల్లనివ్వమని ఒకరు.. సంబంధం కుదరడం లేదని మరోకరు.!
 
బాబు మోహన్ మాట్లాడుతూ.. తన కుమారుడి పేరుతో ఏర్పాటు చేసిన ఈ ట్రస్ట్ ద్వారా సమాజంలోని బలహీన వర్గాలకు సహాయం అందించాలనేది తన చిరకాల కోరిక అని అన్నారు. పేదరికం నుంచి బయటపడటానికి విద్య ఒక ముఖ్యమైన సాధనమని ఆయన నొక్కి చెప్పారు. అందుకే.. ట్రస్ట్ ద్వారా నిరుపేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు.. వారికి నాణ్యమైన విద్యను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.అలాగే.. సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం అందించడం కోసం.. వైద్య శిబిరాలు నిర్వహించడం, ఆసుపత్రి ఖర్చుల కోసం ఆర్థిక సహాయం చేయడం వంటి కార్యక్రమాలను ఈ ట్రస్ట్ చేపడుతుందని బాబు మోహన్ తెలిపారు. ఉపాధి లేని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి.. వారు ఉద్యోగాలు పొందేలా సహాయం చేస్తుందన్నారు.

Also Read :  HIT 3 బాహుబలి, RRR రికార్డులను మించి.. ట్రెండింగ్ లో 'హిట్ 3' ట్రైలర్.. ఎన్ని మిలియన్ల వ్యూస్ అంటే!
 
ట్రస్ట్ ద్వారా సహాయం పొందాలనుకునే వారు కోఆర్డినేటర్ రాజ్ కుమార్‌ను 8919511215 నెంబర్‌ ద్వారా సంప్రదించవచ్చని బాబు మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం బండారు గూడెం కోయజాతికి చెందిన సమీప అనే విద్యార్థి ఎంటెక్ చేయడానికి, గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడానికి బాబు మోహన్ తన ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు.

Also Read :  కడుపుతో ఉన్న భార్యను ఎందుకు చంపాడంటే.. షాకింగ్ విషయాలు చెప్పిన విశాఖ పోలీసులు.. !


బాబు మోహన్ కుమారుడు పవన్ కుమార్ 2003 అక్టోబర్ 12న జరిగిన హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ని ఢీ కొట్టడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కొడుకు మరణంతో బాబు మోహన్ ఎంతగానో కుంగిపోయారు. కొడుకు పేరిట సేవా కార్యక్రమాలు చేపట్టాలని తాను ఎంతో కాలంగా భావిస్తున్నానని.. కానీ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదన్నారు. తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండటం వల్ల పూర్తి స్థాయిలో ట్రస్ట్ కోసం పని చేస్తానని ఆయన చెప్పారు.

 Also Read :  ముగ్గురు భార్యలు జంప్.. నాలుగో పెళ్లికి రెడీ.. నీ కష్టం పగోడికి కూడా రావొద్దురా!

Advertisment
Advertisment
Advertisment