Blinkit : ఆ ఆన్‌లైన్ కంపెనీలో కొత్తిమీర ఉచితం.. నెటిజన్ సూచనతో కంపెనీ నిర్ణయం

ఓ వినియోగదారుడు తన తల్లి సూచన మేరకు .. బ్లింకిట్ అనే ఆన్‌లైన్ కంపెనీ కొత్తిమీరకు కూడా డబ్బులు తీసుకుంటుందని సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. దీనికి ఆ కంపెనీ సీఈవో స్పందించారు. అతని తల్లి సూచన మేరకు కొత్తిమీరను ఉచితం చేసేశారు.

New Update
Blinkit : ఆ ఆన్‌లైన్ కంపెనీలో కొత్తిమీర ఉచితం.. నెటిజన్ సూచనతో కంపెనీ నిర్ణయం

Coriander Free : ప్రస్తుతం.. అన్ని రకాల వస్తువులను ఆన్‌లైన్‌ (Online) లో అందుబాటులోకి వచ్చాయి. చాలామంది తమకు కావాల్సినవి ఆన్‌లైన్‌ నుంచే తెప్పించుకుంటున్నారు. మరికొందరైతే బయటకు వెళ్లకుండానే కూరగాయలు (Vegetables) కూడా ఆన్‌లైన్‌లో ఆర్టర్‌ పెట్టేస్తున్నారు. అయితే ఓ వినియోగదారుడు.. ఒక ఆన్‌లైన్ కంపెనీ కొత్తిమీరకు కూడా డబ్బులు తీసుకుంటుందని సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. దీనికి ఆ కంపెనీ సీఈవో స్పందించారు. ఆమె సూచన మేరకు కొత్తిమీరను ఉచితం చేసేశారు.

Also Read: రేపు బీజేపీ కార్యాలయానికి వస్తున్నా.. కేజ్రీవాల్‌ సవాల్

ఇక వివరాల్లోకి వెళ్తే.. ముంబయి కి చెందిన అంకిత్ సావంత్ అనే వ్యక్తి ఇటీవల ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ' నేను బ్లింకిట్‌లో కూరగాయలు కొన్నాను. అందులో కొత్తిమీర (Coriander) కు కూడా డబ్బులు చెల్లించడం చూసి మా అమ్మకు చిన్నాపాటి గుండెపోటుకు గురైంది. ఎక్కువ మొత్తంలో కూరగాయలు కొన్నప్పుడు కొత్తిమీర ఫ్రీగా ఇస్తే కదా అని మా అమ్మ సలహా' అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్టును బ్లింకిట్ సీఈవో అల్బీందర్ ధిండ్సాకు ట్యాగ్ చేశారు. దీనిపై ధిండ్సా స్పందించారు. ముందుగా మేము దీన్ని పరిశీలిస్తాం అంటూ పోస్టు చేశారు. ఆ తర్వాత తమ యాప్‌లో కొత్తిమీరను ఉచితంగా ఇస్తున్నట్లు మరో పోస్ట్ చేశారు. ' కొత్తిమీర ఉచితం అందుబాటులోకి వచ్చింది. అందరూ అంకిత్ అమ్మగారికి కృతజ్ఞతలు చెప్పండి. రానున్న రోజుల్లో ఈ ఫీచర్‌ను మరింత అప్‌డేట్ చేస్తామంటూ రాసుకొచ్చారు.

సీఈవో తీసుకున్న నిర్ణయంపై నెటీజన్లు విభిన్న కామెంట్లు చేస్తున్నారు. చాలామంది దీన్ని స్వాగతిస్తున్నారు. మరికొందరు మిర్చి, మెంతి, పూదీన కూడా ఫ్రీగా ఇవ్వాలంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరు వీటిల్లో ఏదో ఒకదాన్ని ఫ్రీ కోసం ఎంచుకునే ఆప్షన్ పెట్టాలంటున్నారు.

Also read: ఓటు వేయమంటున్న బ్రహ్మచారులు.. ఎందుకంటే

#online-order #blinkit-ceo #blinkit #coriander #vegetables
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ ...

Renu Desai: నాకు రాజకీయాల్లోకి రావాలని ఉంది..రేణూ దేశాయ్

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. దేశంలో జరిగే అన్ని విషయాలపైనా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని చెప్పారు. 

New Update
Renu Desai

Renu desai

తనకు రాజకీయాల్లోకి వెళ్ళే అవకాశం ఇంతకు ముందే వచ్చిందని..కానీ పిల్లలు చిన్నవారు కావడం వలన వదులుకున్నానని చెప్పారు రేణూ దేశాయ్. రాజకీయాల్లోకి వెళ్ళడం తన జాతకంలోనే ఉందని అన్నారు. ఇప్పటికీ తనకు అదే కోరికని...కానీ తాను విధి రాతకు వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నానని చెప్పుకొచ్చారు రేణు. ఓ పాడ్ కాస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులో మాటను బయటపెట్టారు.  సామాజిక సేవ చేయడం అంటే తనకు ఆనందమని...ఏ చిన్నారీ ఆకలితో ఉండకూడదని అనుకుంటానని ఆమె తెలిపారు. అయితే తాను కొంచెం ముక్కు సూటి మనిషిని...స్నేహితులు, పిల్లలతో ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తానని...అందుకే వారు తాను పోలిటిక్స్ లో పనికి రానని అంటారని నవ్వూతూ చెప్పారు రేణూ దేశాయ్. 

మోడీ భక్తురాలిని..బీజేపీకే సపోర్ట్..

తాను ఎప్పటికీ మోడీనే సపోర్ట్ చేస్తానని...ఆమె భక్తురాలిని అని నిర్భయంగా చెప్పుకున్నారు రేణు. మన ధర్మం ఎలా బతకాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించింది. అందుకే నేను సనాతురాలినే అని చెప్పుకుంటాననన్నారు ఎవరేం అనుకున్నా ఎప్పటికీ తాను బీజేపీకే సపోర్ట్ చేస్తానని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులా తాను ఏదైనా పార్టీలో చేరితే కచ్చితంగా అందరికీ చెప్పే చేస్తానని రేణూ దేశాయ్ అన్నారు. ఇక ఆమె కుమారుడు అకీరా నందన్ గురించి చెబుతూ...ఓజీ సినిమాలో అతను పని చేయడం లేదని తెలిపారు. అకీరా నటన గురించి ఆలోచించిన రోజే నా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెడతా. కొందరు యూట్యూబర్లు మనీ కోసం తప్పుడు థంబ్‌నైల్స్‌ పెడుతున్నారు రేణూ ఆరోపించారు. 

today-latest-news-in-telugu | renu-desai | actress | inter-view

Also Read: WHO: మరో మహమ్మారి తప్పదు-WHO చీఫ్

Advertisment
Advertisment
Advertisment