High BP: ఇవి పాటించండి.. ఆహారంలో ఇవి చేర్చుకోండి.. బీపీ తగ్గుతుంది..!!

పెరిగిన రక్తపోటును నియంత్రించడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరం. రోజూ వ్యాయామం చేయాలి. ధూమపానం మానేయాలి. ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు ఉండాలి. ఇవి పాటిస్తే అధిక BPని నియంత్రించవచ్చు.

New Update
High BP: ఇవి పాటించండి.. ఆహారంలో ఇవి చేర్చుకోండి.. బీపీ తగ్గుతుంది..!!

High BP: నేటి కాలంలో అధిక రక్తపోటు అందరిని వేదిస్తుంది. ఎటువంటి లక్షణాలు లేకుండా సంవత్సరాలు అధిక రక్తపోటు చాలా మందికి ఉండవచ్చు. దీని కారణంగా.. భవిష్యత్తులో గుండెపోటు, స్ట్రోక్ మొదలైన అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల..దానిని అదుపులో ఉంచుకోవడానికి మంచి జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు అంటున్నారు. అధిక రక్తపోటును జీవనశైలిలో ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని నడవాలంటే మీకు ఉపయోగపడే కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆరోగ్యకరమైన ఆహారం

  • రక్తపోటు నియంత్రణలో ఆరోగ్యకరమైన జీవనశైలి ముఖ్యం. ఉప్పు ఎక్కువగా తినడం వల్ల అధిక రక్తపోటు వస్తుంది. కావునా ఆహారంలో ఉప్పు తక్కువగా వాడాలి. మీ ఆహారంలో ఉప్పు మొత్తాన్ని తగ్గిస్తే బెస్ట్. ఆహారంలో ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, ఉంటే మంచిది.

నియంత్రణ బరువు

  • అధిక బరువు రక్తపోటును కూడా పెంచుతుంది. కావున అధిక రక్తపోటును నియంత్రించడానికి సమతుల్య బరువు ఉండటం చాలా ముఖ్యం. అధిక రక్తపోటుతో సహా అధిక బరువుతో సంబంధం ఉన్న అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీరు అధిక బరువు ఉంటే ఆహారంలో మార్పులు, వ్యాయామంపై శ్రద్ధ పెట్టాలి.

రోజూ వ్యాయామం

  • రోజూ వ్యాయామం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇది రక్తపోటును అదుపులో ఉంచటంతోపాటు శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది. అనేక వ్యాధులను నయం చేస్తుంది. రోజూ వ్యాయామం, వాకింగ్, జాగింగ్, యోగా, స్విమ్మింగ్‌ వంటికి చెస్ట్‌ ఆరోగ్యానికి మంచిది.

ధూమపానానికి దూరం

  • ధూమపానం రక్తపోటును పెంచుతుంది. ఈ అలవాటును త్వరగా మానుకుంటే మంచిది. ఎందుకంటే స్మోకింగ్‌లో ఉండే నికోటిన్ రక్తపోటును ఎక్కువగా పెంచుతుంది. ధూమపానం రక్తపోటును మాత్రమే కాకుండా గుండె జబ్బులు, క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు వచ్చేలా చేస్తుంది.

ఒత్తిడికి దూరం

  • అధిక రక్తపోటుకు ప్రధాన కారణం ఒత్తిడి. అందుకే.. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఒత్తిడి కారణంగా.. శరీరం ఆందోళన చెంది గుండె పనితీరు తగ్గుతుంది. దీని కారణంగా రక్తపోటు కూడా పెరిగే అవకాశం ఉంది. యోగా, ధ్యానం, మంచి నిద్ర వలన ఒత్తిడి తగ్గుతుంది.

ఇది కూడా చదవండి: మీ స్మార్ట్ ఫోన్ వేడెక్కుతుందా? ఈ ట్రిక్స్‌ తెలుసుకుంటే ఆ సమస్య ఉండదు!

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Govt : అలర్ట్.. తెలంగాణ పర్యటకుల కోసం‌ హెల్ప్‌లైన్

కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయింది. కశ్మీర్‌ ప్రాంతాల్లో చిక్కుకున్న తెలంగాణవారిని సురక్షితంగా తిరిగి రప్పించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది. వారికోసం ప్రత్యేకంగా హెల్ప్‌ లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 

New Update
Telangana State Tourism Development Corporation

Telangana State Tourism Development Corporation

 TG Govt :   కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్‌ అయింది. కశ్మీర్‌ ప్రాంతాల్లో చిక్కుకున్న తెలంగాణవారిని సురక్షితంగా తిరిగి రప్పించడానికి ప్రభుత్వం రంగంలోకి దిగింది.ఈ మేరకు పర్యాటక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు  మాట్లాడుతూ కశ్మీర్‌లో చిక్కుకున్నవారిని తిరిగి రప్పించడానికి  రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌ఫున ప‌ర్యట‌కుల‌కు త‌గిన సహాయం అందిస్తామని వెల్లడించారు. ఈ ఘటనపై తెలంగాణ ప‌ర్యట‌క శాఖ అధికారులు.. ఢిల్లీలోని తెలంగాణ భవన్ అధికారులతో పాటు కేంద్ర ఏజెన్సీలతో సమన్వయం చేస్తూ పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉగ్రదాడిలో తెలంగాణ వారు ఎవరు మరణించలేదన్న ఆయన పర్యాటకులు ఎవరైన కశ్మీర్‌ పర్యటనకు వెళ్లి ఉంటే సమాచారం ఇవ్వాలని కోరారు. దానికోసం ప్రత్యేకంగా హెల్ప్‌ లైన్‌ నంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  

Also Read: BIG BREAKING: మహేష్ బాబుకు ఈడీ నోటీసులు.. రియల్ ఎస్టేట్ కంపెనీల కుంభకోణంలో బిగ్ షాక్!

అలాగే ఇటీవల జమ్ము, కశ్మీర్ లో పర్యటించిన పర్యటకుల వివరాలు వెంటనే అందించాల‌ని తెలంగాణలోని అన్ని టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లను మంత్రి జూపల్లి కోరారు. దీనివల్ల పర్యటకుల స్థితిగతులను పర్యవేక్షించేందుకు అవసరమైన సమయంలో ప్రభుత్వ సహాయాన్ని అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర ప‌ర్యట‌క శాఖ ఆధ్వర్యంలో హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేశామ‌ని, కశ్మీర్‌లో చిక్కుకున్న తెలంగాణ ప‌ర్యట‌కుల స‌హాయం కోసం నిరంతరం ఫోన్ ద్వారా సేవలు అందించేందుకు ఈ హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఏ విషయమైన హెల్ప్ లైన్ నంబ‌ర్లు: 9440816071, 9010659333, 040 23450368 లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

ఇది కూడా చదవండి: ఇంట్లో బల్లుల బెడద ఎక్కువగా ఉందా ఇలా తరిమేయండి

 పర్యటకుల బంధువులు లేదా స్నేహితులు కూడా తమ సమాచారం అందించేందుకు, లేదా సహాయం కోసం ఈ నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.కశ్మీర్‌తో పరిసర ప్రాంతాల్లో పర్యటకులు ఎవరైనా చిక్కుకున్నా వారి నుంచి బంధువులకు ఎలాంటి సమాచారం వచ్చిన వెంటనే హెల్ప్‌లైన్‌ సెంటర్లకు సమాచారం ఇవ్వాలని మంత్రి కోరారు.

Also Read:దుబాయ్ నుంచి బ్యాగ్‌ తెచ్చిన భర్త.. చంపి అదే బ్యాగ్‌లో ప్యాక్ చేసిన భార్య.. ఎలా దొరికిందంటే?

Also Read: Pastor Praveen Case: పాస్టర్ ప్రవీణ్ మృతి.. హర్ష కుమార్ కు సోనియా గాంధీ సంచలన లేఖ!

Advertisment
Advertisment
Advertisment