RCB Vs GT : హ్యాట్రిక్‌ కొట్టిన బెంగళూర్.. కోహ్లీ, డుప్లెసిస్ ధనాధన్!

ఐపీఎల్ సీజన్ 17లో బెంగళూర్ జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. డుప్లెసిస్, విరాట్‌ కోహ్లీ మొదటి ఓవర్ నుంచే గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.

New Update
RCB Vs GT : హ్యాట్రిక్‌ కొట్టిన బెంగళూర్.. కోహ్లీ, డుప్లెసిస్ ధనాధన్!

IPL : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్(RCB) మరో విజయం తన ఖాతాలో వేసుకుంది. వరుసగా మూడు మ్యాచ్ ల్లో గెలిచి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. శనివారం సొంత మైదానంలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన బెంగళూరు.. 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ పూర్తి చేసింది.

Also Read : రాయ్‌బరేలీ నుంచి రాహుల్ గాంధీ.. అమేథీని కాదని అక్కడే ఎందుకు?

మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. షారూఖ్‌ (37), తెవాటియా (35) రాణించడంతో గౌరవ ప్రదమైన స్కో్ర్ చేయగలిగింది. బెంగళూర్ బౌలర్లు సిరాజ్‌, యశ్‌ దయాల్‌, విజయ్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కామెరాన్‌, కర్ణ్‌ శర్మ చెరో వికెట్‌ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బెంగళూర్.. మొదటినుంచి ధాటిగా ఆడింది. డుప్లెసిస్ (64; 23 బంతుల్లో), విరాట్‌ కోహ్లీ (42; 27 బంతుల్లో) గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. చివర్లో దినేశ్‌ కార్తిక్‌ (21; 12 బంతుల్లో), స్వప్నిల్‌ సింగ్‌ (15; 9 బంతుల్లో) వేగంగా పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. గుజరాత్‌ బౌలర్లలో జోష్‌ లిటిల్‌ 4, నూర్‌ అహ్మద్‌ 2 వికెట్లు తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మహ్మద్ సిరాజ్ 2/29 దక్కించుకున్నాడు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Vontimitta Temple: ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణం.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే....

ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై సమీక్షచేశారు.

New Update
Vontimitta Temple

Vontimitta Temple

Vontimitta Temple : ఒంటిమిట్ట కోదండ రామస్వామి బ్రహ్మోత్స వాల్లో భాగంగా ఈనెల 11న జరిగే శ్రీరాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు విచ్చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు ఒంటిమిట్టలో పర్యటించారు… కడప జిల్లాఒంటిమిట్ట శ్రీరాముల కళ్యాణోత్సవం ఏర్పాట్లపై మంత్రుల బృందం సోమవారం ఆరా తీశారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేతృత్వంలో మంత్రుల బృందం రోడ్డు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, ఎమ్మెల్సీ బి.రాంగోపాల్ రెడ్డి, కలెక్టర్ చామకూరి శ్రీధర్ లు పాల్గొన్నారు. వీరికి అర్చకులు టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికినారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఒంటి మిట్ట శ్రీరాముల కళ్యాణ మహోత్సవం ఏర్పాట్లు, ఆలయం వద్ద ఏర్పాట్లను మంత్రుల బృందం సమీక్షించి పరిశీలించారు.

Also Read: Vijay- Rashmika: ఒకేచోట విడివిడిగా ఫొటోలు.. ఇంకెన్ని రోజులు కొండన్న ఈ దాగుడు మూతలు!

దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.. దేవస్థానం సమీపంలోని శ్రీకోదండరామ స్వామి కల్యాణ వేదిక చేరుకుని అనంతరం అక్కడ జరుగుతున్న  ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించి.. కల్యాణ వేదిక, గ్యాలరీలు, రోడ్లు, బారికేడ్లు, పార్కింగ్, విద్యుత్, ఇతర క్లినింగ్ వంటి పనులపై అధికారులకు దిశానిర్దేశం చేసి సలహాలు, సూచనలు ఇచ్చినారు.. ఈ సందర్భంగా మంత్రి రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ… శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన సీతారాముల కల్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుందని, అందుకు సంబంధించి ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా, సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని మంత్రులు కోరారు.

Also Read: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. HCU విద్యార్థులకు ఊరట

 ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో.. ఆగమ శాస్త్ర ప్రకారం, శాస్త్రోక్తంగా పూజా కైంకర్యాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతి ఆలయంలో ప్రతి రోజూ దీప దీప నైవేద్యాలు నిరంతరాయంగా జరిగేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. అందుకే.. ప్రతి ఆలయంలో  దేదీప్యమానంగా పూజలు అందుతున్నాయన్నారు మంత్రి ఆనం.. 12 కెటగిరీలకు చెందిన 121 గ్యాలరీలలోకి వచ్చే దాదాపు 80 వేల మంది భక్తులకు సంతృప్తికరంగా 47,770 ప్యాకెట్ల అన్న ప్రసాదాలు మంచి అంద  చేయడం జరిగిందన్నారు. ప్రజా భద్రత  కోసం సుమారు 150 కి పైగా సిసి కెమెరాల నిఘా, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే కడప, రాజంపేట వైపు నుంచే ఆర్టీసీ బస్సులకు పార్కింగ్, అలాగే ఇతర జిల్లాలనుంచి ఎన్ని బస్సులు వస్తున్నాయో తెలుసుకుని పక్కాగా ప్లాన్ రూపొందించుకుని పార్కింగ్ ఏర్పాట్లు చేసుకోవడం జరిగిందన్నారు. ఒకవేళ పార్కింగ్ దూరంగా ఉంటే అక్కడి నుంచి కళ్యాణవేదిక వద్దకు భక్తులను తీసుకువచ్చేందుకు ఉచిత బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్ వద్ద టోయింగ్ వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Also read :  మరికొన్ని రోజుల్లో పెళ్లి... కాబోయే భర్త కళ్లముందే యువతి మృతి!

Advertisment
Advertisment
Advertisment