Avocado Benefits : అవోకాడోతో టైప్-2 డయాబెటిస్‌ తగ్గుతుందా?

అవోకాడోలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, దీనిలోని ఫైబర్ గుండె, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. అవకాడోలో విటమిన్ ఎ, బి, ఇ, ఫైబర్, మినరల్స్, ప్రొటీన్లు, చక్కెర చాలా తక్కువగా ఉంటుంది.

New Update
Avocado Benefits : అవోకాడోతో టైప్-2 డయాబెటిస్‌ తగ్గుతుందా?

Avocado : టైప్-2 డయాబెటిస్(Type-2 Diabetes) అనేది రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల వచ్చే వ్యాధి. ఈ వ్యాధికి మందు లేదు కాబట్టి బరువు తగ్గడం, ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా కొంత వరకు నియంత్రించవచ్చు. అవోకాడో(Avocado) లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, దీనిలోని ఫైబర్ గుండె, రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. అవకాడోలో విటమిన్ ఎ, బి, ఇ(Vitamin A, B, E), ఫైబర్, మినరల్స్, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నాయి. అవకాడోలో చక్కెర చాలా తక్కువగా ఉంటుంది. అవకాడో తినడం వల్ల బరువు తగ్గుతారు. ఈ పండు తింటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యానికి మేలు:

ఈ పండు అధిక రక్తపోటు(High BP), కొలెస్ట్రాల్‌(Cholesterol) ను తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అంతేకాకుండా అవకాడోలో క్యాల్షియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు B6, A, E మరియు C కూడా ఉన్నాయి. అవకాడోలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికం,. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది మంచి ఎంపిక అని వైద్యులు అంటున్నారు. మీ ప్యాంక్రియాస్ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయనప్పుడు లేదా ఉత్పత్తి చేయబడిన ఇన్సులిన్ శరీరం సమర్థవంతంగా ఉపయోగించనప్పుడు మధుమేహం వస్తుంది. రెండు సందర్భాల్లో మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. క్రమంగా తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

ఆకలి తక్కువగా ఉంటుంది:

టైప్ 2 డయాబెటిస్‌కు చికిత్స లేదు. బరువు తగ్గడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు వ్యాయామం చేయడం వల్ల మధుమేహాన్ని నియంత్రించవచ్చు. అవకాడోలోని గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతుంది. రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో విసెరల్ ఫ్యాట్ పేరుకుపోవడం తగ్గుతుంది. దీనిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు నెమ్మదిగా కడుపు ఖాళీ చేయడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఎక్కువ ఆకలి కాకుండా ఉంచుతుంది.

ఇది కూడా చదవండి: Stress: ఒత్తిడిని సింపుల్‌గా తగ్గించే జపనీస్‌ థెరపీ గురించి తెలుసా?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime : అన్నంలో మత్తు మందు కలిపి... వ్యాపారవేత్త ఇంట్లో భారీ చోరీ

హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడీ జరిగింది. వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఇంట్లో పని మనుషులే ఈ దోపిడీకి పాల్పడ్డారు.

New Update
Massive theft

Massive theft

 TG Crime :  హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడీ జరిగింది. వృద్ధ దంపతులకు భోజనంలో మత్తుమందు కలిపి దాదాపు 2 కిలోల బంగారు నగలు, రూ.3కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో ప్రముఖ పారిశ్రామికవేత్త హేమ్‌రాజ్‌ , అతడి భార్య మీనా దుగ్గర్‌ నివాసముంటున్నారు. ఇంట్లో పని మనుషులు వ్యాపారవేత్త హేమరాజు దంపతులకు రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి పెట్టారు. అది తిన్న దంపతులిద్దరు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో వారు నగలు, నగదు తీసుకుని పారిపోయారు.

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

కొద్ది రోజుల క్రితం వారు నేపాల్‌కు చెందిన దంపతులను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇటీవల వారి కొడుకు, కోడలు విదేశీ యాత్రకు వెళ్లడంతో హేమ్‌రాజ్, అతడి భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదనుగా భావించిన పనివారు ఆదివారం రాత్రి భోజనంలో మత్తు మందు కలిపారు. వారు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదుతో పాటు కారు తీసుకుని ఉడాయించారు. ప్రతి రోజూ వాకింగ్‌కు వెళ్లే  హేమరాజ్‌ సోమవారం వాకింగ్‌కు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. 

Also read: Murder case: కొడుకు అక్రమ సంబంధానికి బలైన తండ్రి.. వాడి పెళ్లం ఫొటోలు వాట్సాప్ స్టేటస్‌

దీంతో అనుమానం వచ్చిన అతని స్నేహితుడు ఇంటికి వచ్చాడు. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న హేమరాజు దంపతులను అతను ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి నుంచి బంగారు ఆభరణాలు, నగదు ఎత్తుకెళ్లిన పని మనుషులు (నేపాలి దంపతులు) కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Also read: wife harassment: మరో భార్యా బాధితుడు బలి.. ‘నా అస్తికలను డ్రైనేజీలో కలపండి’

Advertisment
Advertisment
Advertisment