జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు

మానవత్వం మంటగలుస్తోంది. చిన్న తనం నుంచి పెంచిన తండ్రిని కొడుకు చంపిన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. అంతే కాకుండా తండ్రి ఊరు వెళ్లాడని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరకు పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.

New Update
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో దారుణం.. తండ్రిని చంపిన కొడుకు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండల పరిధిలోని దుదేకులపల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రిని కొడుకు హత్య చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లి చనిపోవడంతో కొడుకు ధనుంజయ్ తండ్రి తిరుపతి వద్దే పెరిగాడు. గత మూడు రోజుల క్రితం తండ్రీ కొడకుల మధ్య చిన్న గొడవ జరిగింది. అది చిలికి చిలికి గాలివానగా మారడంతో క్షణికావేశంతో ధనుంజయ్‌ కర్రతో తిరుపతి తలపై బలంగా మోదాడు. దీంతో తిరుపతి అక్కడి కక్కడే మృతి చెందాడు.

అనంతరం భయాందోళనకు గురైనా నిందితుడు విషయం బయటకు చెప్పుతే తనను పోలీసులు అరెస్ట్‌ చేస్తారనే భయంతో మృతదేహాన్ని మూటకట్టి మూడు రోజుల పాటు ఇంట్లోనే దాచాడు. ఇరుగు పోరుగు వారు అడిగితే తన తండ్రి ఊరుకి వెళ్లాడని నమ్మబలికాడు. కాగా ఇంట్లో దుర్వాసన రావడంతో ధనుంజయ్‌ తిరుపతి మృతదేహాన్ని మూటగట్టి తిసుకెళ్లి ఊరు చివర ఉన్న చెరువులో పడేశాడు. చెరువులో మృతదేహం ఉండటాన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్నా స్థానిక ఆస్పత్రికి తరలించారు.

మృతుడి కొడుకు ధనుంజయ్‌పై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో నిందితుడిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు ధనుంజయ్‌ని రిమాండ్‌కు తరలించారు. కాగా ఈ ఘటన స్థానికంగా కలకలం రేగింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. రేపాకపల్లికి చెందిన మొండయ్య కోడలిపై మోజుతో కొడుకు ఓదెలును రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం ఇంటినుంచి పారిపోగా పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. 

New Update
father killed

Warangal Father kills son

TG Crime: తెలంగాణలో మరో దారుణం జరిగింది. కోడలుపై మోజుతో కనిపెంచిన తండ్రే కొడుకును లేపేశాడు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించవద్దని హెచ్చరించినందుకు కుమారిడిపై దారుణానికి పాల్పడ్డాడు. రోకలి బండతో కొట్టి కొట్టి చంపాడు. ఈ దారుణమైన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేపాకపల్లిలో జరగగా ఘటను సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కోడలితో అసభ్య ప్రవర్తన..

ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేపాకపల్లికి చెందిన కాసం ఓదెలు(35), తన భార్య, కొడుకు(2)తో కలిసి తల్లిదండ్రులు సారక్క, మొండయ్యలతో కలిసి నివసిస్తున్నాడు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా 14 ఏళ్ల కిందట పెళ్లైంది. అయితే కొంతకాలంగా మొండయ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి. మొండయ్య కోడలితో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా బంధువులు పంచాయితీ పెట్టి హెచ్చరించారు. అయినా మారని మొండయ్య అలాగే ప్రవర్తిస్తున్నాడు. అయితే సోమవారం ఓదెలు తమ పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్నాడు. అప్పుడు తాగి ఇంటికొచ్చి తండ్రి మొండయ్య కొడుకుతో గొడవపడ్డాడు. 

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

ఎప్పటినుంచో పగతో రగిలిపోతున్న మొండయ్య కొడుకును చంపాలని ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే మంగళవారం తెల్లవారుజామున ఇంటి ముందు పడుకున్న కొడుకు ఓదెలు తలపై రోకలి బండతో కొట్టాడు. దీంతో తీవ్ర గాయమైన ఓదెలు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం మొండయ్య పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పిన భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, చిట్యాల సీఐ మల్లేశ్‌, ఎస్సై సందీప్‌కుమార్‌ తెలిపారు.

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

father | killed | son | today telugu news

Advertisment
Advertisment
Advertisment