దారుణం.. భార్యను కాల్చి ఆత్మహత్య చేసుకున్న పోలీస్ అధికారి

పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులతో పోలీస్‌ అధికారి తనువు చాలించిన ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. పోలీస్ అధికారి తాను ఆత్మహత్య చేసుకోవడమే కాక తనతోపాటు కుటుంబీకులను సైతం చంపేశాడు స్థానికంగా ఏసీపీగా పని చేస్తున్న 57 ఏళ్ల భరత్ గైక్వాడ్.. భార్య, మేనల్లుడిని కాల్చి చంపి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మృతులు భరత్ గైక్వాడ్‌ అతని భార్య మోని గైక్వాడ్, మేనల్లుడు దీపక్‌గా గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

New Update
దారుణం.. భార్యను కాల్చి ఆత్మహత్య చేసుకున్న పోలీస్ అధికారి

Atrocious.. Police officer who shot his wife and committed suicide

పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులతో పోలీస్‌ అధికారి తనువు చాలించిన ఘటన మహారాష్ట్రలోని పూణేలో చోటు చేసుకుంది. పోలీస్ అధికారి తాను ఆత్మహత్య చేసుకోవడమే కాక తనతోపాటు కుటుంబీకులను సైతం చంపేశాడు స్థానికంగా ఏసీపీగా పని చేస్తున్న 57 ఏళ్ల భరత్ గైక్వాడ్.. భార్య, మేనల్లుడిని కాల్చి చంపి అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మృతులు భరత్ గైక్వాడ్‌ అతని భార్య మోని గైక్వాడ్, మేనల్లుడు దీపక్‌గా గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

తుపాకి శబ్ధం విన్న స్థానికులు ఘటనా స్థలికి వెళ్లి చూడటంతో ముగ్గురు అప్పటికే మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమర్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఏసీపీ వాడిన తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. గైక్వాడ్ అమరావతిలో ఏసీపీగా పనిచేస్తున్నాడు. సెలవుపై ఇంటికి వచ్చిన వెంటనే గైక్వాడ్ కాల్పులు జరిపినట్లు గుర్తించారు. ముందుగా తన భార్య తలపై కాల్పులు జరిపినట్లు పోలీసుల విచారణలో తేలింది. కాల్పుల శబ్ధం వినడంతో కుమారుడు, మేనల్లుడు పరిగెత్తుకుంటూ వచ్చారని, తలుపు తెరవడంతోనే మేనల్లుడిపై కాల్పులు జరిపాడని పోలీసులు వెల్లడించారు. అతడి ఛాతీలోకి బులెట్లు దూసుకెళ్లాయన్నారు. అనంతరం గైక్వాడ్ సైతం తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని వెళ్లడించారు. ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారని పోలీసులు వివరించారు.

కాల్పులకు ఏసీపీ ప్రైవేట్ పిస్టల్ వాడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాల్పుల సమయంలో గైక్వాడ్ తల్లి, ఇద్దరు కుమారులు, ఇతర కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. వారి ఎదురుగానే గైక్వాడ్ తన భార్యను, మేనల్లుడి కాల్చి అనంతరం తాను కాల్చుకున్నట్లు ప్రత్యేక్ష సాక్షులు వెల్లడించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు  ఉన్నతాధికారి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఏసీపీ పని ఒత్తిడి వల్ల సూసైడ్‌ చేసుకుంటే.. అతనిపై ఎవరు ఒత్తిడి తీసుకువచ్చారనే కోణంలో సైతం విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

గతంలో తెలుగు రాష్ట్రాల్లో  సీఐ స్థాయి నుంచి కానిస్టేబుళ్ల వరకు పలువురు ఆత్మహత్య చేసుకున్నారు. కొందరు అధికారులు పోలీస్‌ స్టేషన్‌లోనే ఆత్మహత్య చేసుకోగా మరికొందరు ఇంట్లో కాల్చుకొని తనువు చాలించారు. పోలీస్ అధికారులు ఎందుకు సూసైడ్‌ చేసుకుంటున్నారనేది చర్చనీయంశంగా మారింది. ప్రజలను రక్షించాల్సిన పోలీస్ అధికారులు బలవన్మరణం చేసుకోవడంతో వారి క్రింది స్థాయి అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. రేపాకపల్లికి చెందిన మొండయ్య కోడలిపై మోజుతో కొడుకు ఓదెలును రోకలిబండతో కొట్టి చంపాడు. అనంతరం ఇంటినుంచి పారిపోగా పోలీసులు కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. 

New Update
father killed

Warangal Father kills son

TG Crime: తెలంగాణలో మరో దారుణం జరిగింది. కోడలుపై మోజుతో కనిపెంచిన తండ్రే కొడుకును లేపేశాడు. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించవద్దని హెచ్చరించినందుకు కుమారిడిపై దారుణానికి పాల్పడ్డాడు. రోకలి బండతో కొట్టి కొట్టి చంపాడు. ఈ దారుణమైన ఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేపాకపల్లిలో జరగగా ఘటను సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కోడలితో అసభ్య ప్రవర్తన..

ఈ మేరకు పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రేపాకపల్లికి చెందిన కాసం ఓదెలు(35), తన భార్య, కొడుకు(2)తో కలిసి తల్లిదండ్రులు సారక్క, మొండయ్యలతో కలిసి నివసిస్తున్నాడు. ఓదెలు 108 అంబులెన్స్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా 14 ఏళ్ల కిందట పెళ్లైంది. అయితే కొంతకాలంగా మొండయ్య ప్రవర్తన సరిగా లేకపోవడంతో గొడవలు జరుగుతున్నాయి. మొండయ్య కోడలితో అసభ్యంగా ప్రవర్తిస్తుండగా బంధువులు పంచాయితీ పెట్టి హెచ్చరించారు. అయినా మారని మొండయ్య అలాగే ప్రవర్తిస్తున్నాడు. అయితే సోమవారం ఓదెలు తమ పెళ్లిరోజు వేడుకలు జరుపుకున్నాడు. అప్పుడు తాగి ఇంటికొచ్చి తండ్రి మొండయ్య కొడుకుతో గొడవపడ్డాడు. 

Also  read :  AP 10th Result: ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600 కు 600 మార్కులు!

ఎప్పటినుంచో పగతో రగిలిపోతున్న మొండయ్య కొడుకును చంపాలని ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే మంగళవారం తెల్లవారుజామున ఇంటి ముందు పడుకున్న కొడుకు ఓదెలు తలపై రోకలి బండతో కొట్టాడు. దీంతో తీవ్ర గాయమైన ఓదెలు అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం మొండయ్య పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పిన భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, చిట్యాల సీఐ మల్లేశ్‌, ఎస్సై సందీప్‌కుమార్‌ తెలిపారు.

Also Read: ఈ సారి సైన్యం కాదు.. పర్యాటకులే టార్గెట్.. ఉగ్రమూకల కొత్త వ్యూహం అదేనా?

father | killed | son | today telugu news

Advertisment
Advertisment
Advertisment