Andhra Pradesh : మన చరిత్ర ఏంటో ప్రపంచం చూసింది.. హింసాత్మక ఘటనలపై హైకోర్టు ఆవేదన

ఏపీలో ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన న్యాయస్థానం.. పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలు రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచానికే చూపించామంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

New Update
Andhra Pradesh : మన చరిత్ర ఏంటో ప్రపంచం చూసింది.. హింసాత్మక ఘటనలపై హైకోర్టు ఆవేదన

High Court Key Comments : ఏపీ(AP) లో ఎన్నికల(Elections) సందర్భంగా పల్నాడు జిల్లా(Palnadu District) లో జరిగిన హింసాత్మక ఘటనలు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టు(High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఘటనలు వల్ల రాష్ట్ర ప్రజలకే కాదు.. మన చరిత్ర ఏంటో ప్రపంచానికే చూపించామని పేర్కొంది. రాష్ట్రంలో.. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో జరిగిన ఘటనలు అందరూ చూశారని.. ఇందుకు ఆధారాలు పరిశీలించాల్సిన అవసరం లేదంటూ ఈ హింసాత్మక ఘటనపై ఆవేదన వ్యక్తం చేసింది.

Also Read: ఏపీ ఆందోళన పరిస్థితులపై ఈసీ సంచలన నిర్ణయం.. అప్పటి వరకు కేంద్రబలగాలు రాష్ట్రంలోనే..

పల్నాడులో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, డీజీపీలతో సహా పల్నాడు జిల్లా కలెక్టర్, ఎస్పీలను హైకోర్టు ఆదేశించింది. అదనపు బలగాలను మోహరించాలంటూ పిటిషనర్ సమర్పించిన వినతిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల రోజు.. ఆ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగాయని.. వాటని అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని వినుకొండకు చెందిన నలబోతు రామకోటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. పరిస్థితులు అదుపు చేసేందుకు అదనపు బలగాలను మోహరించేలా కోర్టు ఆదేశించాలి కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపించారు. హింసా ఘటనలకు చెందిన ఆడియోను వినాయని ఆయన న్యాయమూర్తిని కోరాడు. దీనికి స్పందించిన న్యాయమూర్తి.. ఇది వినాల్సిన అవసరం లేదని.. పల్నాడు ఘటన రాష్ట్ర ప్రజలకే కాదు ప్రపంచానికే చూపామంటూ వ్యాఖ్యానించారు.

మరోవైపు ఈసీ తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. అదనపు బలగాను మోహరించాలంటూ పిటిషనర్ ఇచ్చిన వినతి పరిశీలనలో ఉందని తెలిపారు. భద్రత విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అనేది రాష్ట్ర హోంశాఖ సమాధానం చెప్పాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తరఫున ఏజపీ నిర్మల్‌ కుమార్ వాదిస్తూ.. హింసాత్మక ఘటనపై ఈసీ ఇప్పటికే వివరణ కోరిందని.. ప్రస్తుతం పల్నాడులో 144 సెక్షన్ విధించామని పరిస్థితులు అదుపులో ఉన్నాయని చెప్పారు. అలాగే అదనపు పోలీసు బలగాలను మోహరించామని చెప్పారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి.. రాష్ట్ర ప్రభుత్వం, ఈసీ చర్యలు తీసుకోవడం ప్రారంభించినట్లు గుర్తుచేశారు.

Also Read: కామన్ అడ్మిషన్లకు కాలం చెల్లు.. ఏపీ కోటాకు బ్రేక్!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP Crime: అయ్యో బిడ్డలు.. ఈత కోసం వెళ్లి తిరిగి రాని లోకానికి

అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలంలో విషాదం చోటు చేసుకుంది. కుంటలో మట్టి కోసం తవ్విన గుంతలో పడి దేవాన్ష్‌ (6), విజయ్‌ (6), యశ్వంత్‌ (7) లు ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారి ముగ్గురు పిల్లలు శవాలై కనిపించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.

New Update
annamaiah crime news

annamaiah crime news

AP Crime: ఏపీలో విషాదం చోటు చేసుకుంది. సరదాకు ఈతకు వెళ్లి ముగ్గురు చిన్నారులు పాణాలు కోల్పోయారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది. అప్పటి వరకు ఆ ఊరంతా రామ నామస్మరణతో మార్మోగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా.. గ్రామస్థులంతా ఉత్సవ కార్యక్రమాన్ని చూసేందుకు వెళ్లారు. పండుగ వేళ ఉరంతా సంతోషంగా ఉన్న సమయంలో ఓ విషాదం జరిగింది.  వేడుక అనంతరం ముగ్గురు పిల్లలు కనిపించకుండా పోయారు. విషయం తెలుసుకున్న  కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు నీటి కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. కన్న బిడ్డులు మృతి చెందిన విషయం తెలుసుకుని విషాదంలో మునిగిపోయారు. 

ప్రాణం తీసిన ఈత..

ఈ హృదయ విషాదకర సంఘటన శుక్రవారం జరిగింది. చిట్వేలి మండలంలో ఎం. రాచపల్లికి చెందిన చొక్కరాజు నరసింహరాజుకు కుమారుడు దేవాన్ష్‌ (6), శేఖర్‌రాజు కుమారుడు విజయ్‌ (6), వెంకటేష్‌ కుమారుడు యశ్వంత్‌ (7)లు కలిసి గ్రామంలో జరిగిన సీతారాముల ఉభయంలో పాల్గొన్నారు. అనంతరం ఊరి సమీపంలోని నీటి కుంట దగ్గరకు ఈత కొట్టేందుకు వెళ్లారు. నీళ్లలో దిగి ఈత రాక.. ప్రమాదవశాత్తు మునిగి మృత్యువాత పడ్డారు. పిల్లల ఈతకు వెళ్లి మృతి చెందిన విషయం తెలియక కుటుంబ సభ్యులు ఆలయం దగ్గర ఉన్నారు అనుకోని ఇంటికి వెళ్లారు. 

ఇది కూడా చదవండి: యువతకు నోటి క్యాన్సర్ ముప్పు..ఈ లక్షణాలను అశ్రద్ధ చేయొద్దు

సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో ఆలయ మైకులో పేర్లు చెప్పించారు. అయినా ఆచూకీ తెలియకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఊరు బయట ఉన్న నీటి కుంట దగ్గర వెతకగా.. ముగ్గురి మృతదేహం లభ్యమైంది. విజయ్, యశ్వంత్‌ల తల్లితండ్రులు జీవనాధారం కోసం గల్ఫ్‌ దేశానికి వెళ్లారు. చిట్వేలిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో వీరిని చదివిస్తున్నారు. ఒక్కసారి ముగ్గురు పిల్లలు శవాలై కనిపించడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. పిల్లల మరణానికి కారణమైందని గ్రామ ప్రజలు అంటున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: వేసవి విడిది కోసం బెస్ట్‌ ప్లేసులు ఇవే

( ap-crime-news | ap crime latest updates | latest-news )

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు