AP DGP: మదనపల్లె సబ్‌ కలెక్టరేట్ ను పరిశీలించిన డీజీపీ.. అగ్ని ప్రమాదంపై కీలక ప్రకటన!

మదనపల్లె ఆర్డీవో కార్యాలయాన్నిడీజీపీ ద్వారకా తిరుమల రావు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఈ ఘటన యాక్సిడెంట్ కాదని.. ఇన్సిడెంట్‌లా కనిపిస్తోంది.కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. ఆఫీసు బయట కూడా పలు ఫైల్స్ కాలిపోయినట్లు గుర్తించినట్లు డీజీపీ తెలిపారు.

New Update
AP DGP: మదనపల్లె సబ్‌ కలెక్టరేట్ ను పరిశీలించిన డీజీపీ.. అగ్ని ప్రమాదంపై కీలక ప్రకటన!

Ap DGP: అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయాన్ని డీజీపీ ద్వారకా తిరుమల రావు సీఎం ఆదేశాల మేరకు పరిశీలించారు. ఆ తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సంఘటన యాక్సిడెంట్ కాదని.. ఇన్సిడెంట్‌లా కనిపిస్తోందన్నారు.‘గత రాత్రి 11.30 గంటలకు మదనపల్లె ఆర్డీవో ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగింది. సుమారుగా 3 గంటలపాటు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించాం. ఇది యాక్సిడెంట్ కాదు.. ఇన్సిడెంట్‌గా అనుకుంటున్నాం. 22ఏ భూముల రికార్డులున్న గదిలో మంటలు చెలరేగాయి.

కీలక సెక్షన్‌లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పలు అనుమానాలకు దారి తీస్తుంది. అయితే, ఘటనకు సంబంధించిన సమాచారం ఆర్డీవోకు తెలిసింది.. కానీ, ఆయన కలెక్టర్‌కు తెలియజేయలేదు. స్థానిక సీఐకి తెలిసినా ఆయన కూడా డీఎస్పీ, ఎస్పీలకు సమాచారం అందించలేదు. ఈ పరిణామాలు అన్ని అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశమే లేదు. ఇదే విషయాన్ని ఫోరెన్సిక్ వాళ్లు కూడా స్పష్టం చేస్తున్నారు.

ఆర్డీవో ఆఫీసులో కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. ఆఫీసు బయట కూడా పలు ఫైల్స్ కాలిపోయినట్లు గుర్తించాం. ఇవన్నీ కూడా అనుమానాలను మరింత పెంచుతున్నాయి. ఇటీవల సాక్ష్యాలను నాశనం చేసే ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా దర్యాప్తు మొదలుపెట్టాం. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు 10 బృందాలను ఏర్పాటు చేశాం’ అంటూ ఆయన మీడియాకి వివరించారు.

Also read: తెలివి తక్కువ దద్దమ్మ అన్నందుకు..పెళ్లైన మూడు నిమిషాలకే విడాకులు!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Aghori: చంచల్‌గూడ జైలుకు అఘోరీ..  ప్రత్యేక బ్యారక్ ఏర్పాటు చేసి!

చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరీని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ప్రత్యేక బ్యారక్ సిద్దం చేసి లోపలికి తీసుకెళ్లారు. మరోవైపు శ్రీ వర్షిణికి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా శంకర్‌పల్లి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

New Update
aghori ccg

Aghori going to Chanchalguda jail

Aghori: చీటింగ్ కేసులో అరెస్టైన లేడీ అఘోరిని ఎట్టకేలకు పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించి..  ప్రత్యేక బ్యారక్ సిద్దం చేశారు జైలు అధికారులు. ఇతర ఖైదీలను కలవకుండా ఏర్పాట్లు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణిని అదుపులోకి తీసుకున్నారు శంకర్‌పల్లి పోలీసులు. ఆమె తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేలా కౌన్సెలింగ్ ఇచ్చారు.  

ఉత్తరప్రదేశ్ సరిహద్దులో అదుపులోకి..

ఇదిలా ఉంటే.. లేడీ అఘోరీ అలియాస్ అల్లూరి శ్రీనివాస్ పోలీసులకు చిక్కాడు. వర్షిణీని పెళ్లి చేసుకుని కనిపించకుండా పోయిన అఘోరీని పోలీసులు మంగళవారం సాయంత్రం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నార్సింగి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడ నుంచి చేవెళ్ల కోర్టుకు తీసుకెళ్లారు. విచారణలో భాగంగా లేడీ అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆమెను సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు.  అదే సమయంలో శ్రీనివాస్ నుంచి వర్షిణీని వేరు చేసిన పోలీసులు భరోసా సెంటర్‌కు పంపించారు. 

ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

లేడీ అఘోరికి సంగారెడ్డి జైలు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. ఆడా, మగా తేలకుండా ఏ బ్యారక్‌లో ఉంచలేమని సంగారెడ్డి సెంట్రల్ జైలు తేల్చి చెప్పారు. దీంతో లింగ నిర్ధారణ పరీక్షలు చేయించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ పరీక్షల తర్వాత అఘోరీని చంచల్ గూడ జైలుకు తరలించారు.

ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ

Aghori for Varshini | jail | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment