BJP : మహిళకు లంచం ఇస్తూ అడ్డంగా బుక్కైన బీజేపీ నాయకుడు.. వీడియో వైరల్!

తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, కోయంబత్తూరు లోక్‌సభ అభ్యర్థి అన్నామలై ఓ మహిళకు లంచం ఇస్తూ అడ్డంగా దొరికిపోయాడు. ఇటీవలే గెలుపుకోసం ఒక్కరూపాయి ఖర్చు చేయనని సవాల్ విసిరిన ఆయన ఇలా చేయడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. వీడియో వైరల్ అవుతోంది.

New Update
BJP : మహిళకు లంచం ఇస్తూ అడ్డంగా బుక్కైన బీజేపీ నాయకుడు.. వీడియో వైరల్!

Coimbatore : ఓ మహిళకు లంచం(Bribe) ఇస్తూ బీజేపీ(BJP) నాయకుడు అడ్డంగా దొరికిపోయాడు. ఈ మేరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, కోయంబత్తూరు లోక్‌సభ అభ్యర్థి అన్నామలై తనకు హారతి ఇచ్చిన ఓ మహిళకు డబ్బులు ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఎన్నికల అధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Also Read : ”నో ఎగ్జిట్‌ పోల్‌”.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు!

సుడిగాలి ప్రచారంలో..
తమిళనాడు(Tamilnadu) బీజేపీ నేత అన్నామలై(Annamalai) ని కోయంబత్తూరు పార్లమెంటు స్థానానికి అభ్యర్థిగా బీజేపీ నాయకత్వం ఇటీవల ప్రకటించింది. ఇటీవలే తమిళనాడులో రాజకీయ మార్పు తీసుకురావడానికి వచ్చానని, ఢిల్లీ రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని అన్నామలై చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కోయంబత్తూరులో అభ్యర్థిగా పేరు ప్రకటించిన రోజు నుంచి అన్నామలై సుడిగాలి ప్రచారంలో నిమగ్నమయ్యారు.

ఒక్క రూపాయి ఇవ్వనంటూనే..
అయితే అలాగే కోయంబత్తూరులో తనను ఓడించేందుకు చాలా మంది డీఎంకే మంత్రులు ఇక్కడ డబ్బులు ఖర్చు చేస్తున్నారని, అయినా ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా విజయం సాధిస్తున్నారని అన్నామలై ఇటీవల సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో కోయంబత్తూరులో ఇవాళ అన్నామలై ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. అనంతరం ఓ ఇంటికి వెళుతుండగా అక్కడి మహిళ అన్నామలైకి హారతి పట్టింది. అప్పుడు అన్నామలై ఆ అమ్మాయి చేతిలో ఏదో పెట్టినట్లు వీడియోలో రికార్డవగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

విచారణ కొసాగుతోంది..
ఇక దీనిపై స్పందించిన ఈసీ(EC).. ‘మాకు షేర్ చేసిన వీడియోను గుర్తించాం. ధృవీకరణ కోసం పోలీసు బృందానికి పంపించారం. విచారణ కొసాగుతోంది’ అని తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

CSK VS LSG: ఎట్టకేలకు చైన్నైను వరించిన విజయం..దగ్గరుండి గెలిపించిన కెప్టెన్ మహీ

హమ్మయ్య పాయింట్ల పట్టికలో అట్టుగ ఉండి విజయం కోసం తపిస్తున్న జట్టును కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ విజయతీరాలకు నడిపించాడు. చివర్లో వరుసగా ఫోర్లు, సిక్స్ లు కొడుతూ మ్యాచ్ గెలిచేలా చేశాడు. ఐదు వరుస ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ ఈరోజు ఎల్ఎస్జీ మీద గెలిచింది.

author-image
By Manogna alamuru
New Update
ipl

CSK VS LSG

గెలిచింది...గెలిచింది...చెన్నై సూపర్ కింగ్స్ మొత్తానికి మ్యాచ్ గెలిచింది.  పేలవమైన ప్రదర్శనతో అందరినీ నిరాశకు గురి చేస్తున్న సీఎస్క్ కు ఈరోజు మంచి విజయం దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ మీద 5 వికెట్ల తేడాతో చెన్నై గెలిచింది. వరుసగా ఐదు ఓటములను మూట గట్టకున్న సీఎస్కో ఎట్టకేలకు కాస్త ఊపిరి పీల్చుకుంది. స్వయంగా కెప్టెన్ ధోనీనే మ్యాచ్ ను గెలిపించడం ఈ మ్యాచ్ లో మరొక విషయం. ముందు బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చెన్నై బ్యాటర్లలో శివమ్‌ దూబె (43*), రచిన్‌ రవీంద్ర (37), షేక్‌ రషీద్‌ (27), ధోనీ (26*) రాణించారు. లఖ్‌నవూ బౌలర్లలో రవి బిష్ణోయ్‌ 2, అవేశ్‌ ఖాన్‌, మార్‌క్రమ్‌, దిగ్వేశ్‌ ఒక్కో వికెట్‌ తీశారు.  

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగి..

ఈరోజు మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన లక్నో నిర్దేశించిన 20 ఓవర్లలో లక్నో జట్టు 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రిషభ్ పంత్ చెలరేగిపోయాడు. 49 బంతుల్లో 63 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన మార్క్‌రమ్, నికోలస్ పూరన్ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ ఇద్దరూ ఎక్కువ సమయం క్రీజ్‌లో నిలవలేకపోయారు. తొలి ఓవర్‌ ముగిసేసరికి లక్నో 1 వికెట్ నష్టానికి 6 పరుగులు చేసింది. 

చెలరేగిన పంత్..

ఆ తర్వాత క్రీజ్‌లోకి మిచెల్ మార్ష్ వచ్చాడు. అక్కడనుంచి మార్ష్, పూరన్ భారీ షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టారు. కానీ పూరన్ దూకుడు తక్కువ సమయానికే పరిమితం అయింది. నికోలస్ పూరన్ (8) పరుగులకే ఔట్ అయ్యాడు. దీంతో లఖ్‌నవూ రెండో వికెట్ కోల్పోయింది. అన్షుల్ కాంబోజ్ వేసిన నాలుగో ఓవర్‌లో చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్‌ దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టాడు.  దీంతో లక్నో జట్టు 5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 34 పరుగులు సాధించింది. ఇక పంత్, మార్ష్‌ నిలకడగా ఆడుతున్న సమయంలో మరో బిగ్ షాక్ తగిలింది. మార్ష్‌ (30) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో లక్నో జట్టు 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 78 పరుగులు సాధించింది. ఆ తర్వాత పంత్ చెలరేగిపోయాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. 49 బంతుల్లో 63 పరుగులు రాబట్టాడు. అలాగే బడోని 17 బంతుల్లో 22 పరుగులు, అబ్దుల్ సమద్ 11 బంతుల్లో 20 పరుగులు చేశారు. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 166 పరుగులు రాబట్టారు.  
 

today-latest-news-in-telugu | IPL 2025 | csk-vs-lsg 

Also Read: Waqf Act Protest: బెంగాల్ చల్లబడటం లేదు..మళ్ళీ నిరసనలు, పోలీస్ వాహనానికి మంటలు..

Advertisment
Advertisment
Advertisment