Vijayawada: కృష్ణలంకను ఆదుకున్న రిటైనింగ్ వాల్..
విజయవాడలోని కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాలకు వరద ముప్పు తప్పింది. ఇందుకు కారణం అక్కడ రిటైనింగ్ వాల్ ఉండటమే. మొత్తం 12 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునేలా ఈ ప్రహారి గోడ నిర్మించారు.
విజయవాడలోని కృష్ణలంక, రాణిగారితోట ప్రాంతాలకు వరద ముప్పు తప్పింది. ఇందుకు కారణం అక్కడ రిటైనింగ్ వాల్ ఉండటమే. మొత్తం 12 లక్షల క్యూసెక్కుల నీటిని తట్టుకునేలా ఈ ప్రహారి గోడ నిర్మించారు.
విజయవాడలోని సింగ్నగర్లో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఆహారం లేక జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు కాలనీలకు ఇంకా తాగునీరు చేరలేదు. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లో 5 హెలికాప్టర్లు, డ్రోన్లతో ఆహారం సరఫరా చేస్తున్నారు.
విజయవాడలో కొందరు కక్కుర్తి గాళ్లు బోట్ల దందా మొదలుపెట్టారు. వరదల వల్ల ఇంత ప్రళయం జరిగినా కూడా దాన్ని ఆసరగా చేసుకోని బోట్ల యజమానులు జనాల వద్ద డబ్బులు దండుకున్నారు. బోటు ప్రయాణానికి రూ.1500 నుంచి రూ.4 వేల వరకు వసూలు చేస్తున్నారు.
121 ఏళ్ల చరిత్రలో ప్రకాశం బ్యారేజీకి ఇదే అతిపెద్ద వరద అని ఆంధ్రప్రదేశ్ సీఎంవో ట్వీట్ చేసింది. 1903, 2009లో అత్యధికంగా పది లక్షల క్యూసెక్కుల ప్రవాహం దాటగా.. ఇప్పుడు ఏకంగా 11.36 లక్షల క్యూసెక్కులు దాటేసినట్లు పేర్కొంది.
విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బాధితులకు సహాయం చేయడానికి అధికారులు అన్ని మార్గాలను వినియోగించుకుంటున్నారు. అపార్ట్మెంట్లలో చిక్కుకుపోయిన వారికి డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ చేస్తున్నారు.
ఒక్కడిగా రాజకీయ పార్టీ పెట్టాడు. జనసైనికుడు అయ్యాడు. ఓటమి ముందు కుంగిపోలేదు. ఇప్పుడు గెలుపు వాకిట్లో పొంగిపోవడం లేదు. పవన్ కళ్యాణ్.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పవన్ పొలిటికల్ జర్నీపై స్పెషల్ స్టోరీ..
విజయవాడలో దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యటించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డును పరిశీలించారు. నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. మరమ్మతులకు సంబంధించి అధికారులతో చర్చించారు.
రాష్ట్రంలో వరద పరిస్థితులపై సీఎం చంద్రబాబు కొద్ది సేపటి క్రితం అధికారులతో మరోసారి సమీక్ష నిర్వహించారు. వరద ప్రాంత ప్రజలకు మరో రెండు రోజుల వరకూ అందచేసే ఆహార పదార్థాలను సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఆక్రమణలు, బుడమేరు డైవర్షన్ పనులు నిలిచిపోవడమే విజయవాడలో వరదలకు కారణమని తెలుస్తోంది. ఇంకా కృష్ణానది ముఖ ద్వారంలో రాజకీయ నాయకులకు చెందిన అనేక నిర్మాణాలు ఉన్నాయి. అవి వరద ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయి. ఈ నిర్మాణాలను తొలగించకపోవడం మరో కారణమన్న చర్చ ఉంది.