AP: వల్లభనేని వంశీ, మరో ఇద్దరికి 14 రోజుల రిమాండ్...

వైసీపీ నేత వలంలభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆయనతో పాటూ ఈ కేసులో నిందితులుగా ఉన్న లక్ష్మీపతి, కృష్ణప్రసాద్‌కు కూడా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు. 

New Update
ap

Court Remanded 14days to Vallabhaneni Vamsi

హైదరాబాద్‌లో వైసీపీ నేత వల్లభనేని వంశీ గురువారం అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనతోపాటు ఈరోజు మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సత్యవర్థన్‌ కిడ్నాప్, బెదిరించి దాడి చేసిన కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మంది అరెస్ట్ అయ్యారు. వెంకట శివరామకృ‌ష్ణ, నిమ్మ లక్ష్మీపతి లను పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఏ1గా వల్లభనేని వంశీ, ఏ7గా వెంకట శివరామ కృష్ణప్రసాద్, ఏ8గా నిమ్మ లక్ష్మీపతిని చేరార్చు పోలీసులు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి నిందితులను మెడికల్ టెస్టుల కోసం విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు.

ముగ్గురికి 14 రోజుల రిమాండ్...

వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు నిన్న రాత్రి అతణ్ణి విజయవాడ కోర్టులో హాజరుపర్చారు. ప్రభుత్వం తరుఫున వీరగంధం రాజేంద్ర ప్రసాద్‌, వంశీ తరఫున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1.45 వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి. ఈ వాదనలు కొలిక్కి రాకపోవడంతో న్యాయమూర్తి అదనంగా మరో అరగంటపాటు వాదనలు విన్నారు. దాని తర్వాత ముగ్గురికీ 14 రోజుల రిమాండ్‌ విధించారు.  

పోలీసులు టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ ను వంశీని కిడ్నాప్.. బెదిరింపుల కేసులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ కార్యాలయంపై దాడి కేసు విచారణ వేగవంతం చేసారు. ఈ కేసులో వంశీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కోర్టు ఈ నెల 20న తీర్పు ఇవ్వనుంది. కానీ ఈలోపునే వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీ రిమాండ్ లో పోలీసులు కీలక అంశాలను వెల్లడించారు. సత్యవర్ధన్ ను బెదిరించడంలో అతను కీలక పాత్ర పోషించాడని తెలిపారు. చంపేస్తారని భయంతో సత్యవర్ధన్ వంశీ అనుచరులు చెప్పినట్టు చేసారని..సత్యవర్ధన్‌ ఫిర్యాదును వెనక్కి తీసుకోవడంలో ఏ7, ఏ8 కీలకంగా వ్యవహరించారని పోలీసులు చెబుతున్నారు.  కేసులు ఏ9గా ఉన్న రామును కలవాలని వంశీ బలవంతం చేశారని చెప్పారు. 

Also Read: TS: నగరంలో ట్రాఫిక్ ను నియంత్రణకు ఫ్లై ఓవర్లు- సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మార్క్ శంకర్ హెల్త్ అప్డేట్‌పై పవన్ సంచలన ప్రకటన!

మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే పై పవన్‌కళ్యాణ్ తాజాగా ట్వీట్ చేశారు. తన కొడుకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతీ ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.

New Update

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌ అగ్ని ప్రమాదంలో చిక్కుకుపోవడంతో గాయాలు అయిన విషయం తెలిసిందే. ఊపిరితిత్తుల్లోకి పొగ చేరడంతో సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స చేశారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ తన సింగపూర్ నుంచి హైదరాబాద్‌కి వచ్చారు. ఈ క్రమంతో తన కుమారుడు ఆరోగ్య పరిస్థితిపై సోషల్ మీడియా ద్వారా ఓ అప్డేట్ ఇచ్చారు. 

ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!

ఇది కూడా చూడండి: SRH VS PBKS: వాట్ ఏ కమ్ బ్యాక్..ఎస్ఆర్హెచ్ దుమ్ము దులిపేసింది మామా..

కొడుకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న..

సింగపూర్‌లో సమ్మర్ క్యాంప్‌లో జరిగిన ఘటనలో గాయపడిన మార్క్ శంకర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందన్నారు. నా కొడుకు ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న ప్రతీ ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు. ఇలాంటి కష్ట సమయాల్లో కూడా వివిధ రాజకీయ పార్టీలు, జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, సినిమా కుటుంబసభ్యులు, మిత్రులు అందరికి కూడా నా ధన్యవాదాలని తెలిపారు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది కూడా చూడండి: TS: భూభారతిపై అవగాహనా సదస్సులు..సీఎం రేవంత్ రెడ్డి

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌ను తీసుకుని ఇండియాకి వచ్చారు. పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవాలు తమ కుమారుడు మార్క్ శంకర్ తో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు. 

Advertisment
Advertisment
Advertisment