Accident: కుక్కల భయంతో రైలు కిందపడి చనిపోయిన 80 గొర్రెలు!

ఏపీ విజయవాడలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుక్కల భయంతో రైల్వే ట్రాక్ పైకి పరిగెత్తిన 80 గొర్రెలను భీమసింగి వద్ద ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ ఢీ కొట్టింది. అన్నీ అక్కడికక్కడే మరణించాయి. దీంతో తమను ఆదుకోవాలంటూ రైతులు అధికారులను వేడుకుంటున్నారు. 

New Update
దిఆ

Vijayawada: ఏపీ విజయవాడలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కుక్కల భయంతో 80 గొర్రెలు రైలు ఢీకొని చనిపోయాయిన ఘటన కలిచివేసింది. స్థానికులు, భాదితుల వివరాల ప్రకారం.. లక్ష్మీపురం గ్రామానికి చెందిన గొలగాని ఎర్నాయుడు, గొలగాని సింహాచలం, గొంప బంగారునాయుడు, ఆనందపురానికి చెందిన వారాది రమణమ్మ తమ గొర్రెల మందలను జామి మండలంలోని భీమసింగి పంచాయతీ యాతపాలెం రైల్వే ట్రాకు దగ్గరలో మేత కోసం తోలుకెళ్లారు. 

ఇది కూడా చదవండి: అలా చేయొద్దు నాన్న.. అన్నందుకే కూతురిని కడ తేర్చిన తండ్రి!

ప్రాణ భయంతో రైల్వే ట్రాకుపైకి పరుగులు..

ఈ క్రమంలోనే గొర్రెలపై స్థానికంగా ఉండే కుక్కలు దాడి చేసేందుకు ప్రయత్నించగా.. ప్రాణ భయంతో రైల్వే ట్రాకుపైకి పరుగులు తీశాయి. అప్పటికే విజయనగరం నుంచి విశాఖపట్నం వెళ్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ వాటిని ఢీ కొట్టింది. దీంతో 80 గొర్రెలు అక్కడికక్కడే మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక గొర్రెల మరణంతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులతోపాటు పశువైద్యాధికారి గీతావాణి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి ఆదుకుంటామని రైతులకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. 

ఇది కూడా చదవండి: సైకిల్ తోసుకుంటూ వెళ్తున్న ఉస్తాద్ హీరో.. 'RAPO 22' ప్రీ లుక్ వైరల్

Also Read: తిరుపతి ముంతాజ్ హోటల్స్‌ను రద్దు చేస్తారా? టీటీడీ ఛైర్మన్ ఏమన్నారు?

Also Read: విడిపోతున్న రెహమాన్ దంపతులు..ప్రకటించిన భార్య సైరా

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

టీచర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని సస్పెండ్

టీచర్‌ని చెప్పుతో కొట్టిన విద్యార్థినిపై రఘు ఇంజనీరింగ్ కాలేజ్ చర్యలు తీసుకుంది. యువతి వెంకటలక్ష్మీని కాలేజీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. కాలేజీలో విద్యార్థిని ఫోన్ లెక్చరర్ తీసుకున్నందుకు ఆమెను బూతులు తిడుతూ దాడికి దింగింది.

New Update
raghu clg

కాలేజ్‌లో టీచర్‌ని చెప్పుతో కొట్టిన స్టూడెంట్‌పై యాజమాన్యం చర్యలు తీసుకుంది. ఆంద్రప్రదేశ్ విజయనగరంలోని రఘు ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఇది జరిగింది. టీచర్‌ను దుర్భాషలాడుతూ ఆమెపై దాడికి దిగింది యువతి. ఆ విద్యార్థిని టీచర్‌ను చెప్పుతో కొడుతున్నప్పుడు అక్కడే ఉన్న కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విద్యార్థిని ప్రవర్తన పట్ల ఇంటర్‌నెట్‌లో చాలా మంది సీరియస్ అయ్యారు. విద్యార్థిని గురుగుబెల్లి వెంకటలక్ష్మీని రఘు ఇంజనీరింగ్ కాలేజీ సస్పెండ్ చేసింది.

విద్యార్థిని.. ఆ ఫోన్ 12వేలు ఇస్తావా? ఇవ్వవా? అంటూ టీచర్‌ని బూతులు తిడుతూ గొడవకు దిగింది. చివరికి ఫోన్ ఇస్తావా? లేదంటే చెప్పుతో కొట్టమంటావా అంటూ టీచర్ పై రెచ్చిపోయింది. దీంతో టీచర్ ఇవ్వను అనేసరికి ఆమెపై చెప్పుతో దాడి చేసింది. ఆ తర్వాత టీచర్ విద్యార్థిని మధ్య గొడవ పెరగడంతో పక్కనే ఉన్న విద్యార్థులు, ఇతర టీచర్లు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విద్యార్థిని తీరుపై  నెటిజన్లు మండిపడుతున్నారు.

(Raghu Engineering College | student | teacher | latest-telugu-news | viral-video)

Advertisment
Advertisment
Advertisment