Ugadi awards : త్రివిక్రమ్ సతీమణికి ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మక అవార్డు

ఏపీ ప్రభుత్వం 202 ఉగాది పురస్కారాలు ప్రకటించింది. విజయవాడలో ఉగాది సందర్భంగా CM చంద్రబాబు ఈ అవార్డులను ఇవ్వనున్నారు. 86 కళారత్న, 116 ఉగాది పురస్కారాలు ఇవ్వనున్నారు. పృథ్వీరాజ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ భార్య సాయిసౌజన్యకు కళారత్న పురస్కారాలు లభించింది.

New Update
Soujanya Srinivas

Soujanya Srinivas Photograph: (Soujanya Srinivas)

దాదాపు ఆరేళ్లుగా ఆగిపోయిన కళారత్న (హంస), ఉగాది పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. శనివారం విజేతల జాబితాను విడుదల చేశారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి అవార్డులను ప్రదానం చేయనున్నారు. రాష్ట్రంలో వివిధ రంగాలకు చెందిన 202 మంది ప్రముఖులకు కళారత్న (హంస), ఉగాది పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. సాహిత్యం, కళలు, జర్నలిజం, హాస్యావధానం, బాల సాహిత్యం, పద్యం, సాంస్కృతిక సేవలు, మిమిక్రీ, బుర్రకథ, హరికథ, నాటకం, సామాజిక సేవ, సినిమా ఇలా అనేక రంగాల్లో ప్రముఖులను అవార్డులకు ఎంపిక చేశారు. ఈమేరకు శనివారం స్పెషల్‌ సీఎస్‌ ఆజయ్‌జైన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

Also read: SLBC tunnel: 37 రోజులవుతున్నా లోకో ఇంజిన్‌ మాత్రమే బయటకు.. టన్నెల్‌‌లో దొరకని ఆచూకీ

86 మందికి కళారత్న, 116 మందికి ఉగాది పురస్కారాలు ప్రకటించారు. చివరిగా 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉగాది అవార్డులను అందించింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ పురస్కారాలు ప్రకటించలేదు. మళ్లీ ఆరేళ్ల తర్వాత టీడీపీ ప్రభుత్వం ఉగాది పురస్కారాలను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సాహిత్య విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావుకు కళారత్న అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. సినిమా విభాగంలో నటుడు పృథ్వీరాజ్‌, కొరియోగ్రఫీకి గానూ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సతీమణి సాయిసౌజన్యకు కళారత్న పురస్కారాలు లభించింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

AP News: ఎకరాకు రూ.31 వేలు.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన!

ఏపీ ప్రభుత్వం మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లాలో  497 ఎకరాల్లో CBG ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఇక్కడి ప్రభుత్వ భూములకు 15 వేలు, రైతుల భూములకు 31 వేలు కౌలు ఇస్తామని ప్రకటించారు. 

New Update
lokesh

lokesh Photograph: (lokesh)

AP News: ఏపీలో వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పీసీపల్లి మండలం దివాకరపల్లి వద్ద రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్(CBG) ప్లాంట్‌కు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీ, టీఎస్ మెంటర్ పీవీఎల్ మాధవరావు, రిలయన్స్ బయోఎనర్జీ సీఈవో హరీంద్ర కే.త్రిపాఠితో కలిసి భూమిపూజ చేశారు.

తొలిప్లాంటుకు శంకుస్థాపన..

ఈ సందర్భంగా దివాకరపల్లి వద్ద 497 ఎకరాల్లో, రూ.139 కోట్ల పెట్టుబడితో, 100 టన్నుల సామర్థ్యంతో రిలయన్స్ సంస్థ సీబీజీ ప్లాంట్ ను ఏర్పాటుచేస్తోందని చెప్పారు. రిలయన్స్ రాష్ట్రవ్యాప్తంగా నెలకొల్పనున్న 500 సీబీజీ ప్లాంట్లలో భాగంగా తొలిప్లాంటుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పిన P4 విధానానికి రిలయన్స్ సీబీజీ ప్లాంట్స్ నాంది కాబోతున్నాయన్నారు.

ఇది కూడా చదవండి: విశాఖలో​ ప్రేమోన్మాది దాడి.. తల్లి కూతురిని చంపిన దుర్మార్గుడు

కనిగిరి నియోజకవర్గం దివాకరపురంలో మొదటి సీబీజీ ప్లాంట్ కు శంకుస్థాపన అనంతరం ఏర్పాటుచేసిన సభలో ప్రసంగించిన ఆయన.. ఎలాంటి నీటివసతి లేని మెట్టప్రాంత రైతులకు ఈ ప్లాంట్స్ ద్వారా పెద్ద ఎత్తున మేలు జరుగుతుందన్నారు. నైపర్ గడ్డితో గ్యాస్ తయారు చేస్తారు. ప్రభుత్వ భూములకు 15 వేలు, రైతుల భూములకు 31 వేలు కౌలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్లాంట్ల ద్వారా గ్రామీణ యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు లభిస్తాయి. ప్రకాశం జిల్లాలో పేదరికం లేకుండా చేయడమే మా లక్ష్యమని వివరించారు. 

ఇది కూడా చదవండి: సోడా తాగడం వల్ల నిజంగా గ్యాస్ నయమవుతుందా?

ap minister nara lokesh | ongole | factory | today telugu news 

Advertisment
Advertisment
Advertisment